Saturday, 22 February 2020

రథోత్సవం

...  పాల సముద్రంలో పుట్టిన హాలాహలంను మింగి మగత నిద్రలోకి జారుకుని తిరిగి మేలుకున్న సందర్భంగా శివుడిని తన రథం పై ఊరేగింపు నిర్వహిస్తాడు  బ్రహ్మ. దీనినే రథోత్సవం అని అంటారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు శ్రీకాళహస్తిలో రథోత్సవం జరగడం ఆనవాయితీ గా ఉంది. వేల మంది భక్తుల సమక్షంలో స్వామి అమ్మవార్ల రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. బ్రహ్మ నిర్వహించిన ఉత్సవం కాబట్టి బ్రహ్మ రాత్రి అంటారు.

అని ఆర్యోక్తి.రథంపై ఊరేగే శంకరుని దర్శిస్తే పునర్జన్మ ఉండదని పెద్దలు చెబుతారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు బ్రహ్మ రాత్రి ఉత్సవం జరిగింది. ఈ సందర్భంగా గంగాదేవి సమేతుడైన సోమస్కంద మూర్తి బ్రహ్మ రథంపై,  అమ్మవారు మరో రంగంలో స్వామిని అనుసరించారు. ఉత్సవ మూర్తులను ఆలయం  నుంచి తీసుకొచ్చి రథా లకు సమీపంలో ఉన్న నెప్పల మండపంలో ఉంచి పూజలు చేశారు అర్చకులు.  ఆ తర్వాత  రథంపై స్వామి అమ్మవార్లను అలంకరించి రథోత్సవం నిర్వహించారు.  రెండు రథాలు ఒకేసారి రావడానికి వీలు లేక పోవడం వల్ల ముందుగా స్వామి వారి రథాన్ని  తర్వాత అమ్మవారి రధాన్ని భక్తులు లాగడం జరిగింది.

నంది సేవ

.. శ్రీకాళహస్తిలో జరుగుతున్న మహా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మ వార్లు నంది, సింహ వాహనాలపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన మహాశివరాత్రి సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో ఉత్సవం జరిగింది. ఈ సందర్భంగా గంగాదేవి సమేతుడైన సోమస్కంద మూర్తి నంది వాహనం పైన, జ్ఞానప్రసూనాంబ సింహ వాహనంపై ఊరేగి భక్తులను కరుణించారు. సాధారణంగా నంది వాహనంపై ఊరేగే పరమ శివుడిని దర్శిస్తే ముక్తి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. అయితే మహా శివరాత్రి రోజు దర్శిస్తే మరింత పుణ్యమని నమ్ముతారు భక్తులు. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా  నంది వాహన సేవ  ప్రమథ గణాలు వెంట రాగా గంగాదేవి సమేతుడైన సోమస్కంద మూర్తి నంది వాహనంపై ఊరేగారు. అమ్మ వారు సింహ వాహనంపై ఊరేగి భక్తులకు నయనానందం కలిగించారు. భక్తుడైన నందిని అనుగ్రహించి తన వాహనంగా చేసుకున్నాడు పరమేస్వరుడు.  ముందుగా నందిని దర్శించి ఆ తర్వాత స్వామిని దర్శించాలని పురాణాలు కూడా చెబుతున్నాయి. అటువంటి ఉన్నతమైన నంది వాహనంపై ఊరేగిన స్వామివారిని దర్శించి భక్తులు పులకించి పోయారు. సింహ వాహనంపై అమ్మవారు చిరునవ్వులు చిందిస్తూ ఊరేగగా భక్తులు మొక్కులు తీర్చుకున్నారు.

Thursday, 20 February 2020

జన్మానికో శివరాత్రి – మహాశివరాత్రి


ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే 'మహాశివరాత్రి' పర్వదినానికే ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. శివరాత్రి వ్రతంలో ఇమిడి ఉన్న ఎన్నో ఆధ్యాత్మికమైన మరియు పౌరాణికపరమైన అంశాలు ఉన్నాయి. శివరాత్రి అంటే శివునకు ప్రీతిరకమైన రోజు అని, మాఘమాసం, కృష్ణపక్షంలో 14వ రోజున వచ్చె శివరాత్రి, శివపూజ గురించి ఎన్నో పురాణేతిహాసాలు సూచించాయి. సంవత్సరమంతయూ శివపూజ వేయుట వలన ఏ ఫలమును పొందెదమో, అంతటి ఫలముని శివరాత్రినాడు శివార్చనవలన పొందగలము.
లింగరూప శివార్చనచే సాలోక్య, సామిప్య, సారూప్య, సర్ష్టి, సాయుజ్యమను పంచక్రియల ఫలము లభించును. సృష్టి, స్థితి, సంహార, తిరోభావ, అనుగ్రహాలను ఐదు జగత్కార్యములు శివునకు సిద్ధములు. భూమియందు సృష్టి, నీటియందు స్థితి, అగ్నియందు సంహారము, వాయువునందు తిరోభావము, ఆకాశమునందు గ్రహము కలవు. మానవ శరీరము పంచభూతాత్మకము. ఆ పంచభూతాత్మకమగు శక్తిననుసరించియే ఈశ్వరుడు ప్రపంచమును నడుపుచున్నాడు. అందుచేతనే పరమాత్మునెన్నడును విడిచి పోరాదు.

'నా రుద్రో రుద్రమర్చయేత్' అనగా రుద్రుడు కాకుండా రుద్రుని అర్చింపరాదని, సోహం భావముతో శివార్చన చేయాలని అది శంకరాచార్యులు సెలవిచ్చిన విషయాన్ని మరువరాదు.

శివాకృతి – చిహ్నం

శివుడు అంటే మంగళస్వరూపుడు. సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే. సర్వవ్యాపకుడు, సర్వమునకు మూలకారణమైనవాడు శివుడు. శివునకు భిన్నమైనదేదీ లేదు. శివుణ్ణి నిరాకారిగాను, సాకారిగాను ఆరాధిస్తారు. శివుని అర్చామూర్తియే లింగము. లింగము అంటే చిహ్నం.
లింగరూపధారియగు ఈశ్వరునియందు కోట్ల బ్రహ్మాండ గోళకములు పరమాణువులవలె విలీనమై పోవుచున్నవి.
సగుణోపాసన నుండి నిర్గుణోపాసన వైపు మరల్చుటకు చేసే ఆకార, నిరాకార రూపం శివలింగం. త్రిశూలం సత్వరజస్తమో గుణాలకు ప్రతిరూపమైతే, డమరుకం శబ్ద బ్రహ్మ స్వరూపం. శిరస్సున ధరించిన నెలవంక మనోనిగ్రహానికి, గంగాదేవి శాశ్వతత్వానికి, దేహంపై ధరించిన సర్వరూపాలు భగవంతునిలోని జీవాలుగా, భస్మం పరిశుద్ధతకి, ధరించిన ఏనుగు చర్మం అహంకారాన్ని త్యజించటానికి, ఆసనంపై గల పులి చర్మం కోరికలకు దూరంగా ఉండమని, శివుడు పట్టుకున్న నాలుగు జింకా కాళ్ళు నాలుగు వేదాలని సూచిస్తున్నాయి. సత్సాంగత్యానికి నందీశ్వరుడు, ధర్మ దేవతగా ఎద్దు, మూడవనేత్రం జ్ఞానానికి ప్రతిరూపాలు.
మనం నిర్వర్తించే అభిషేకం మోక్షప్రాప్తికి, అయన పాదాల ముందుంచిన పంచామృతాలు పంచ జ్ఞానేంద్రియాల నివేదన. తనని తాను అర్పణగావించుకొనుటలో సాష్టాంగం. తనలోని అహాన్ని త్యజించడానికి ఆరతి. ఆత్మనివేదన లేక జీవాత్మ పరమాత్మలో లీనం కావడం. చివరగా శివతాండవం శక్తిస్వరూపానికి, ఆనంద పారవశ్యానికి ప్రతిరూపాలు.
శివరాత్రినాడు చేయవలసిన విధులు
1.   ఉపవాసం - భక్తి లేకుండా నిరాహారంగా రోజు గడిపివేస్తే అది ఉపవాసం కాదు. జీవాత్మను పరమాత్మ సన్నిధిలోకి తీసుకుని వెళ్ళాలి. అంటే, మన మనస్సు, మాట, చేష్టలు ఆ పరమశివుని కోసమే ఉండాలి. మనస్సులో మరో భావనకు చోటులేకుండా, జీవాత్మ పరమాత్మల ఐక్యవాసమే ఉపవాసం.
2.  జాగరణం - బాహ్యంగా పరమశివుడు మహావిషాన్ని సేవించిన రోజు శివరాత్రి. విషం మ్రింగి నిదురపోతే శరీరమంతా త్వరగా వ్యాపించి, సమస్త భువన మండలాలకు వ్యాపిచి, ప్రళయం సంభవిస్తుంది. అందువలన భక్తులందరు శివస్తుతులతో ఆ పరమ శివుణ్ణి మేలుకొనేటట్లుగా చేసిన, సమస్త లోకాలకు మేలు చేకూరుతుంది. అంతర్గతంగా శివభక్తి సాధనలో మోక్షాన్ని సాధించాలంటే మనో-బుద్ధి-అహంకార-చిత్తములనే అంతఃకరణల్ని శివభావాత్మకాలుగా జాగృతం చేసి, జీవ చైతన్యాన్ని విశ్వ చైతన్యంతో ఐక్యం చెయ్యాలి. అంటే, కామ-క్రోధాది అరిషడ్వర్గ బంధనాలనుంచి 'జీవాహంత'ను విడిపించి, 'విశ్వ అహంత' అయిన శివతత్వంలోనికి ఐక్యం చెయ్యటమే జాగరణ.
3.  అభిషేకం - పరమేశ్వర జ్యోతిర్లింగం అర్ధరాత్రి సమయంలో సంభవించిందని పురాణాలు చెబుతున్నవి. అందుచేతనే అర్ధరాత్రి సమయంలో అభిషేకవిధిని నిర్వహిస్తారు. పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు.
రుద్రం, మహారుద్రం, లఘురుద్రం, అతి రుద్రంలో తేడాలు ఉన్నాయి. యజుర్వేదంలోని మంత్రభాగమైన 11 అనువాకాల 'శతరుద్రీయా'నికి 'రుద్రం' అని పేరు. దానికి ఒకసారి పఠిస్తూ చేసే అభిషేకం రద్రాభిషేకం అంటారు. దానికి 'రుద్రం', 'ఏకరుద్రం' అని పేర్లు కూడా ఉన్నాయి. ఈ 11 అనువాకాల 'రుద్రం' పదకొండుసార్లు చెబుతూ చేస్తే 'ఏకాదశ రుద్రాభిషేకం' లేదా 'రుద్రి' అంటారు. రుద్రాన్ని 121 సార్లు పఠిస్తూ చేసే అభిషేకం 'లఘురుద్రాభిషేకం'. 11 లఘురుద్రాలు ఒక 'మహారుద్రం' అంటే, ఈ అభిషేకంలో రుద్రం (మొత్తం 116 అనువాకాలు) 1331 సార్లు పఠించబడుతుంది. ఈ మహారుద్రాలు పదకొండయితే 'అతిరుద్రం', దీనిలో 14641 మారులు రుద్రం చెప్పబడుతుంది. ఈ రుద్రమంత్రాలను అభిషేకానికి వాడితే 'రుద్రాభిషేకం' హోమంలో వినియోగిస్తే 'రుద్రయాగం'. ఈ అభిషేక తీర్థాన్ని భక్తితో గ్రహించటం ద్వారా జీవాత్మను ఆశ్రయించి ఉన్న సమస్త మాయాదోషాలు తొలగి, జీవుడు మరమాత్మలోనికి ఐక్యం చెందుతాడు.
శివ నిర్మాల్యం స్వీకరించవచ్చా లేదా?
శివ నైవేద్యం కంటితో చూస్తే చాలు పాపాలన్నీ దూరమవుతాయి, స్వీకరిస్తే చాలు, అనేక కోట్ల పుణ్యాలు మానవునికి సంప్రాప్తమవుతాయి. శివ నైవేద్యాన్ని భక్తితో స్వీకరించి శివ స్మరణ చేస్తుబక్షించాలి.
నర్మదా బాణలింగం (సాలగ్రామ లింగము), ధాతు లింగం (పాదరస లింగము, పాషాణ లింగము, వెండి లింగము, బంగారు లింగము),  పురాణ ప్రసిద్ధి లింగం (దేవతలచేత, సిద్ధులచేత ప్రతిష్ఠించబడిన లింగము), స్వయంభూ లింగం, కుంకుమ పువ్వులతో నిర్మించిన లింగము, స్ఫటిక లింగము, రత్నమయ లింగం, మరియు ద్వాదశ జ్యోతిర్లింగాలకు సమర్పించబడిన నైవేద్యమును లేక నిర్మాల్యాన్ని స్వీకరించినచో చాంద్రాయణ వ్రతాన్ని ఆచరించిన ఫలితం సంప్రాప్తమవుతుంది, పాపాలు తక్షణమే తొలిగిపోతాయి మరియు బ్రహ్మహత్యా పాతకం కూడా నశిస్తుంది అంతే కాకుండా చండీశ్వరునికి వీటిపై ఎట్టి అధికారము లేదు. మిగతా శివలింగములందు శివలింగాలపై ఉంచిన వస్తువులను వదిలివేసి లింగమునకు దూరంగా ఉంచబడిన ఏ వస్తువునైన ప్రసాదంగా స్వీకరించవచ్చు. నిషిద్ధములైన శివ నిర్మాల్యమును కూడా సాలగ్రామ శిలాస్పర్శ చేసి పవిత్రమైన వాటిగా గ్రహించవచ్చునని శాస్త్రం చెబుతున్నది.
శివరాత్రి వ్రతం మరియు శివ తత్వం.
శివం అంటే ప్రపంచమంతా వ్యాప్తి చెంది, మార్పులేని, కష్టాలను తొలగించి, అజ్ఞాంధకారాలను పోగొట్టి, ఆనందాన్ని ప్రసాదించే తత్వం. శివతత్వం అనంతం. శివుడు అనేకరూపాలలో వివిధ ఆకారాలలో స్థుతింపబడుతూ ఉంటాడు. ఈశ్వరుడు సగుణాకారుడని, నిర్గుణ నిరాకారుడైన బ్రహ్మమని వేదం చెబుతోంది. శివతత్వం వర్ణింపనలవికానిది. అయినప్పటికీ, ఇది మానవకోటియొక్క పాపాల భారాన్ని తొలగించి, జీవన సమరంలో కొట్టుమిట్టాడుతున్న సమాజానికి ఊరట కలిగించే పరతత్వం.
సకల శాస్త్రాలకు నిలయమైన ఈశ్వరుడే విశ్వపరిపాలకుడు, శంభు, మయోభు, మయస్కర, రుద్రా, శివ, శివతర, శంకర అని యజుర్వేద వాక్యం (ఈశానః సర్వ విద్యానాం ఈశ్వరః సర్వభూతానం....) శివతత్వం మానవ మేధస్సుకు అందని విషయం.
శివరాత్రిలో రాత్రికి గల విశిష్టత - రాత్రి అనే పదానికి మూలం 'రా', అనగా శాంతిని, సౌఖ్యాన్ని కలిగించేది లేక ఇచ్చేదని అని అర్థం.
ఆధ్యాత్మిక చింతనతో పంచభూతాత్మకమైన ఈ శరీరాన్ని అంటిపెట్టుకునే కలవరపాట్లు, భ్రమ, భ్రాంతి వదిలి పెట్టి కైవల్య ప్రాప్తికి సాధకుడు చేసే ప్రయత్నమే 'శివరాత్రి జాగరణ'. వక్రమార్గంలో నడిచే మనసును అదుపులో ఉంచుకొని, మనసులో అంతర్లీనమైన పరమాత్మ తత్వాన్ని మేలు కొల్పడమే ఉద్దేశ్యం. బహిర్ముఖ వృత్తి నుండి అనగా భౌతికమైన ప్రాపంచిక సుఖాలనుండి పంచేంద్రియాలను అదుపులో ఉండేలా నిగ్రహమైన మనసుతో 'అంతర్ముఖ' సాధనకై నిర్వర్తించే ప్రవృత్తి, అనగా ఆధ్యాత్మిక పరంగా ఆత్మనివేదన గావించడమే నిజమైన శివరాత్రినాడు చేసే ఉపవాస దీక్ష.
అమావాస్య అంటే అర్థం - అమ - యుగప్తుః వాస - కలిసి ఉండడం. ఖగోళ శాస్త్రం ప్రకారం, సూర్య-చంద్రులు కలిసి ఉండడం. ఆధ్యాత్మిక పరంగా సూర్య-చంద్రులు పరమాత్మ-జీవాత్మల రూపాలు. వేదాంత శాస్త్రంలో అమావాస్య అంటే సమాధి యోగస్థితి. ఇక్కడ జీవాత్మ పరమాత్మలో లీనం చెందడం. కృష్ణచతుర్థశి నాడు జీవాత్మ పరమాత్మలో లీనమయి, అద్వైతానుభూతిలో సమాధి చెంది ఏకత్వం సిద్ధించే రోజే శివోపాశనకి శుభముహూర్తం. అదే 'నిత్య, శుద్ధ, బుద్ధ, ముక్త, సచ్చిదానంద మూలస్వరూపం'.
పురాణేతిహాసాలు.
స్కాందపురాణం ప్రకారం పవిత్ర స్నానాలు, శుచిగా ఉండుట, ధూపసంస్కారం, పుష్పాలతో పూజ గావించుట, చివరకు ఉపవాస దీక్షలు శివునికి తృప్తి కలిగించేవి కావు.
ఈశ్వర సంహితలో శివరాత్రి పర్వదినాన్ని విస్మరించి, శివారాధన లేక శివునికి కాకుండా విష్ణువును గాని, లేక మరేదేవతను పూజించినప్పటికి ఫలితం శూన్యం.
విష్ణువుకి, శివునకు మధ్యం బేధం లేదని, నేనెక్కడ ఉంటే శివుడు అక్కడ ఉంటాడని విష్ణువు, విష్ణువు ఎక్కడ ఉంటే నేను అక్కడేనని శివుడు అంటారు. భూదేవిని ప్రార్థిస్తూ శివారాధన చేసినవారు, విష్ణువును కూడా పూజించినట్లేనని వారాహావతారమెత్తిన విష్ణుమూర్తి సూచించాడు.ఇంకా భక్తులు నన్ను కేశవుడు, శివుడు, దేవి, అంబిక అనే నామాలతో పిలుస్తారని వరాహమూర్తి అంటాడు. నారాయణుని పూజించినా, మోక్ష ప్రాప్తిని పొందినా సరే శివ ద్వేషం పనికిరాదు.
సమాజంలో అన్ని వర్గాలవారు చేయదగినది 'శివరాత్రి వ్రతం'. రాత్రి సమయంలో నాలుగు భాగాలలో అభిషేకంతో శివారాధన జరగాలి. రాత్రి తోలి జాములో క్షీరాభిషేకంతోను, రెండవజాములో దధి అభిషేకంతోను, మూడవజాములో నేతితోను, నాల్గవజాములో తేనెతోను శివాభిషేకం జరిపించాలని 'సంవత్సర ప్రదీప' లో సూచించారు. రాత్రి నాలుగు భాగాలలో, మొదటి జాములో శివుడు 'ఈశానుడు'గాను, రెండవ జాములో 'అఘోరుడు'గాను, మూడవ జాములో 'వామదేవుడు'గాను, నాల్గవ జాములో 'సద్యోజాత'గాను ఆరాధింపబడతాడు.
పూజా క్రమంలో గౌతమ మహాముని కొన్ని నియమాలను సూచించారు. పూజలు, దేవతా కార్యక్రమాలను రాత్రి సమయంలో ఉత్తరాభిముఖంగా నిర్వర్తించాలి. కాని 'శివారాధన' అన్ని వేళలా ఉత్తరాభిముఖంగానే నిర్వర్తించాలని నిర్దేశించారు. పంచముఖ లింగాకృతిలో ప్రధానముఖం తూర్పుదిశను సూచిస్తున్నట్లు ప్రతిష్థించాలని సూచిస్తుంది లింగపురాణం. శివపూజ విధానంలో ఫాలభాగంపై మూడు విభూది రేఖలు, మెడలో రుద్రాక్షమాల ధరించకుండా చేసిన శివపూజ నిష్ప్రయోజనం అని నందిపురాణంలో వివరించబడింది.
శివారాధనలో సైకత లింగాన్ని పూజించడం అత్యుత్తమం. సైకత లింగారాధనతో పుత్ర, పౌత్ర, ధన, ధాన్య, వస్తు సంపదలతోబాటు దీర్ఘాయుష్షు సిద్ధిస్తుందని విజ్ఞుల అభిప్రాయం.
ఆయా పదార్థాలతో చేసిన లింగాకృతులను బట్టి ఫలసృతులు వేర్వేరుగా ఉంటాయి. శివలింగాన్ని ఇసుకతో, హోమభస్మంతో, ఆవుపేడతో, రాగి, ఇత్తడి లోహాలతో రూపొందించవచ్చు. లింగాక్రుతి ప్రమాణంగా సాధారణ మనిషి బొటనవ్రేలు ఊర్ధ్వభాగం కన్నా తక్కువగను ఒక 'అక్ష' అనగా 16 ధాన్యపు గించల బరువుకన్నా తక్కువుగాను ఉండరాదని 'భవిష్యపురాణం' సూచిస్తోంది. దారిద్ర దుఃఖ నాశిని అయిన బిల్వపత్రాలతో పూజ పరమేశ్వరునకు ఎంతో ప్రీతి. మరే ఇతర పదార్థాలు లేకున్నపటికీ, మారేడుదళాలతో శివుని ఆరాధిస్తే ఎంతగానో ప్రసన్నుడవుతాడని పురాణాలలో సూచించారు. మూడు ఆకులు కలిగి ఉన్న బిల్వపత్రం అడుగుభాగం శివలింగాన్ని స్ప్రుశించేలా అలంకరించాలని స్కాందపురాణం సూచిస్తోంది.
నిశ్చలమైన దృష్ఠితో శివాలయానికి మూడు పర్యాయాలు ప్రదక్షిణ, అభిషేక జలాన్ని స్ప్రుశించకుండా తొలుత సమరీతిగాను, తిరుగు ప్రయాణంలో అసమరీతిలోను చేయాలని దేవీపురాణం సూచిస్తుంది. శివారాధనలో సాష్టాంగ దండ ప్రణామం చేయుట వలన సకల కోరికలు సిద్ధిస్తాయి. పరమశివునకు అర్పించిన పుష్ప, పత్రాలను భక్తి ప్రపత్తులతో శిరమున ధరించినవారు సకల పాపముల నుండి విముక్తులవుతారు.
ప్రతి సంత్సరం శివరాత్రి వ్రతాన్ని స్త్రీ-పురుషులు ఇరివురు 24 సంవత్సరాలు నిర్వహించిన వారి కోరికలు నెరవేరుతాయని 'పద్మ పురాణం'లో చెప్పబడింది. మనసులో కోరికలు లేకుండా భక్తులు శివరాత్రి పర్వదినాన ఆరాధించాలని 'లింగపురాణం' సూచిస్తోంది. ప్రాతఃకాల సమయంలో స్నానాదికాలు ముగించుకొని నిష్ఠతో నిత్యకర్మలనాచరించి, ఉపవాస దీక్షతో, శివ మంత్రోచ్ఛారణతో 'పార్థివలింగాన్ని' (మట్టితో చేసిన శివలింగం) ఆరాధించడం శ్రేష్ఠం. శివపూజ నిర్వహణలో ముఖ్య ఘట్టాన్ని 'దేవీ పురాణం'లో వివరించారు. ఉపవాస దీక్షతో పాటు ఏకాగ్రత, స్నానం, జపం, శివ సంబంధమైన పురాణ-ప్రవచనాలు వినడం, మొదలైన నియమాలను నిర్దేశించారు. శివ పంచాక్షరీ జపం తప్పనిసరి.
అష్టమూర్తులు
శివుడు లేక రుద్రుడు సర్వ భూత స్వరూపుడు. అయన స్థాన విశేషాలు:
(1) రుద్రుడు – సూర్యుడు. చరాచర జగత్తు యొక్క పుట్టుటకు కారణభూతుడు.
(2) భవుడు - నీరు. సర్వ సృష్టి, సమస్త లోకములు జలమునందే ప్రతిష్ఠితమైనవి. ఈ జగత్తంతా నీటిలోని నావలాగా తేలియాడుతున్నది.జలము పవిత్రము మరియు ప్రాణాధారము అయిన భవత్స్వరూపము.
(3) శివుడు - భూమి. సమస్త ప్రాణి నివాసమునకు ఆధారము.
(4) పశుపతి - అగ్ని. సమస్త ప్రాణికోటి యందు జఠరాగ్ని రూపంలో ప్రకాశిస్తూ భుజించిన ఆహారాన్ని జీర్ణం చేస్తూ ఉంటాడు.
(5) ఈశ్వరుడు - పంచభూతములలోని వాయువు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సామాన అను ఐదు వాయు రూపాలతో ప్రాణుల శరీరములోపల ఉండి జీవరాశిని బ్రతికిస్తూ ఉంటాడు.
(6) భీముడు - ఆకాశము. ప్రాణుల శరీరములోని రంధ్రములు అను ఆకాశములో వ్యాపించి ఉంటాడు.
(7) ఉగ్రుడు - యజ్ఞదీక్షితుడైన యజమాని. యజమాని యజ్ఞమును పరిపూర్తిగా నిర్వర్తించి, సమస్త దేవతలను తద్వారా సర్వాంతర్యామి అయిన భగవంతుని తృప్తి పరుచును.
(8) మహాదేవుడు - చంద్రుడు. ఓషధులకు అధిపతి అయి (అన్నదాత అయి) ఓషధులను (సస్యములను) అభివృద్ధి చేయును.
శివుని అష్టమూరి తత్వము ఎరిగిన వారేభగవద్విలాసమును తెలిసినవారంటారు జ్ఞానులు.
శివుని పంచ ముఖాలు
1. సద్యోజాతం
2. వామనం
3. తత్పురుషం
4. అఘోరం
5. ఈశానం

శ్రీ మహా మృత్యుంజయ స్తోత్రం


ఓం రుద్రం పశుపతిం స్థాణుం నీలకంఠ ముమాపతిమ్
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

కాలకంఠం కాలమూర్తిం కాలాగ్నిం కాలనాశనం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

నీలకంఠం విరూపాక్షం నిర్మలం నిలయప్రభుం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురుం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

దేవదేవం జగన్నాథం దేవేశం వృషభధ్వజం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

గంగాధరం మహాదేవం సర్పాభరణ భూషితం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

అనాధ పరమానందం కైవల్యపద గామినం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

స్వర్గాపవర్గ దాతారం సృష్టి స్థితి వినాశనం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

ఉత్పత్తి స్థితి సంహార కర్తారం గురుమీశ్వరం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

మార్కండేయకృతం స్తోత్రం యః పఠేచ్ఛివ సన్నిధౌ
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

తస్య మృత్యు భయం నాస్తి- నాగ్నిచోరభయం క్వచిత్
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

శతావర్తం ప్రవర్తవ్యం సంకటే కష్ట నాశనం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

శుచిర్భూత్వా పఠేత్ స్తోత్రం సర్వసిద్ధి ప్రదాయకం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

మృత్యుంజయ మహాదేవ త్రాహి మాం శరణాగతం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

జన్మ మృత్యు జరారోగైః పీడితం కర్మ బంధనైః
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

తావతస్త్వద్గత ప్రాణః త్వచ్చిత్తోహం సదామృడ
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

ఇతి విజ్ఞాప్య దేవేశం త్ర్యంబకాఖ్యం మనుం జపేత్
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

నమశ్శివాయ సాంబాయ హరయే పరమాత్మనే
ప్రణత క్లేశనాశాయ యోగినాం పతయే నమః ||

మృకండు సూను మార్కండేయ కృత
మృత్యుంజయ స్తోత్రం సంపూర్ణమ్.

శివుని పేర్లు


వేదాలు, పురాణాలు మరియు ఉపనిషత్తులలో శివునికి అనేక పేర్లతో స్మరిస్తుంటారు. వాటిలో కొన్ని పేర్లు మీకోసం...

హర-హర మహదేవ, రుద్రుడు, శివుడు, అంగీరాగురు, అంతకుడు, అండధరుడు, అంబరీషుడు, అకంప, అక్షతవీర్యుడు, అక్షమాలి, అఘోర, అచలేశ్వరుడు, అజాతారి, అజ్ఞేయ, అతీంద్రియుడు, అత్రి, అనఘ, అనిరుద్ధ్, అనేకాలోచనడు, అపానిధి, అభిరాముడు, అభీరు, అభదన్, అమృతేశ్వర్, అమోఘ, అరిదమ్, అరిష్టనేమి, అర్ధేశ్వర్, అర్థనారీశ్వరుడు, అర్హత్, అష్టమూర్తి, అస్థమాలి, ఆత్రేయ, ఆశుతోష్,

ఇంద్రభూషణుడు, ఇందుశేఖరుడు, ఇకంగ, ఈశాన్, ఈశ్వరుడు, ఉన్నమత్తవేషుడు, ఉమాకాంతుడు, ఉమానాథ్, ఉమేష్, ఉమాపతి, ఉరగభూషణ్, ఊర్ధ్వరేతా, ఋతుధ్వజ, ఏకనయన్, ఎకపాద్, ఎకలింగ, ఎకాక్ష, కపాలపాణి,

కమండలధర, కళాధర్, కల్పవృక్ష, కామరిపు, కామారి, కామేశ్వర్, కాలకంఠ, కాలభైరవ, కాశీనాథ్, కృత్తివాసా, కేదారనాథ్, కైలాశనాథ్, క్రతుధ్వసీ, క్షమాచార్, గంగాధర, గణనాథ, గణేశ్వర, గరళధర, గిరిజాపతి, గిరీష్, గోనర్ద్, చంద్రేశ్వర్, చంద్రమౌళి, చీరవాసా, జగదీశ్, జటాధర, జటాశంకర్, జమదగ్ని, జ్యోతిర్మయ్,

తరస్వీ, తారకేశ్వర్, తీవ్రానంద్, త్రిచక్షు, త్రిధామా, త్రిపురారి, త్రియంబక్, త్రిలోకేశ్, త్రయంబక్, దక్షారి, నందికేశ్వర్, నందీశ్వర్, నటరాజ్, నటేశ్వర్, నాగభూషణ్, నిరంజన్, నీలకంఠ, నీరజ,

పరమేశ్వర్, పూర్ణేశ్వర్, పినాకపాణి, పింగలాక్ష్, పురందర్, పశుపతినాథ్, ప్రథమేశ్వర్, ప్రభాకర్, ప్రళయంకర్, భోలేనాథ్, బైజనాథ్, భగాలీ, భద్ర, భస్మశాయీ, భాలచంద్ర్, భువనేశ్, భూతనాథ్, భూతమహేశ్వర్,

మంగలేశ్, మహాకాంత్, మహాకాల్, మహాదేవ్, మహారుద్ర్, మహార్ణవ్, మహాలింగ్, మహేశ్, మహేశ్వర్, మృత్యుంజయ, యజంత్, యోగేశ్వర్, లోహితాశ్వ్, విధేశ్, విశ్వనాథ్, విశ్వేశ్వర్, విషకంఠ్, విషపాయీ, వృషకేతు, వైద్యనాథ్,

శశాంక్, శేఖర్, శశిధర్, శారంగపాణి, శివశంభు, సతీష్, సర్వలోకేశ్వర్, సర్వేశ్వర్, సహస్రభుజ్, సాంబ, సారంగ, సిద్ధనాథ్, సిద్ధీశ్వర్, సుదర్శన్, సురర్షభ్, సురేశ్, హరిశర్, హిరణ్య, హుత్ సోమ్, స్రుత్వా మొదలైనవి.

Sunday, 16 February 2020

భస్మ ధారణ


విభుతి పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ విభుతి ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతు ఉంటాడు. నరక బాధలు లోనుకాకుండా చూస్తాడు. కాల్చిన పేడను (ఆవు పేడ) ఈ భస్మం లో ఉపయోగిస్తూ ఉంటారు. భస్మ ధారణ చేయకుండా చేసే జపతపాలు ఫలితాలను ఇవ్వవని శాస్త్ర వచనము. మన శరీరములో 32 చోట్ల భస్మ ధారణ చెయ్యాలి అని శాస్త్రము చేప్తోంది, కాని ఈ కాలము లో అలాగ చెయ్యటము వీలుపడని పక్షములో కనీసము శిరస్సు, రెండు చేతులు, గుండే, నాభి అనే ఐదు ప్రదేశాలలో భస్మాన్ని ధరించవచ్చు. త్రిపుండ్రాలుగా (ముడు గీతలు) అడ్డముగా భస్మ ధరణ చెయాలి. ఇలాగ చేస్తే జన్మ జన్మల పాపాలు నసించి పోతాయని పెద్దల వాక్కు.
ఈ భస్మ ధారణ చేయడానికి కొన్ని మంత్రాలు చెప్పబడ్డాయి శాస్త్రాలలో.
బ్రాహ్మణ, క్షత్రీయులు "మానస్తోకే మంత్రము " తో, వైశ్యులు " త్ర్యయంబక " మంత్రము తో , ఇతరులు శివపంచాక్షరి తో భస్మ ధారణ చెయాలి.
ఈ విభుతి మహిమను వివరించే కధ దేవి భాగవతము పదకొండవ స్కందము లో ఉంది.
మహిమాన్వితమైన విభుతిని వివిధ పద్ధతులలో తయారు చేస్తారు. ఆవుపేడను కింద పడనీయకుండా, చేత్తోపట్టుకుని, వేదమంత్రాల మధ్య హోమము చేసి తయారు చేసుకున్న భస్మాన్ని "శాంతికము " అని అంటారు.
షడాక్షరి మంత్రముతో హొమము చేసి తయారు చేసుకునే భస్మాన్ని "పౌష్ఠికం" అని అంటారు. బీజాక్షరాలతో హొమము చేసి తయారు చేసిన భస్మాన్ని "కామదం" అని అంటారు..
భస్మం తయారు చేసుకునే ముందే ఆవుపేడను సేకరించి, చిట్టు, లేక పొట్టును కలుపుతూ ముద్ద చేసి, ఆ ముద్దను పిడకలుగా చేసి అతి శుభ్రమైన ప్రదేశములో ఎండబెట్టాలి.
యాగాలు చేస్తున్నప్పుడు అరణిని మధించడం ద్వార వచిన అగ్నితో గాని, మంత్ర పూర్వకముగా పిడకలను హొమ గుండము లో వేసి హోమము చెయ్యాలి.
అనంతరం శుబ్ర్హమైన పాత్రలో విభుతిని నింపాలి.
హర హర మహా దేవ శంభో శంకర