Thursday, 27 June 2024

జమ్మూకాశ్మీర్ : కట్రా

🔅 జమ్మూకాశ్మీర్ : కట్రా 
🔅 శ్రీ మాత వైష్ణోదేవి మందిర్

💠 వైష్ణవ దేవి ఆలయం ప్రసిద్ధి చెందిన అమ్మవారి పుణ్యక్షేత్రం. ఈ దేవాలయం 18 శక్తి పీఠాలలో కాదు కానీ 51 శక్తి పీఠాలలో ఒకటిగా ఉంది. 

💠 వైష్ణోదేవి యాత్రికులు ప్రతి సంవత్సరం ఈ ఆలయాన్ని సందర్శిస్తారు మరియు తిరుమల వెంకటేశ్వర ఆలయం తరువాత భారతదేశంలో అత్యధికంగా సందర్శించే రెండవ మత మందిరం ఇది.

💠 హిందువులు వైష్ణవ దేవినే మాతా రాణి అని వైష్ణవి అని కూడా సంభోదిస్తారు.
అమ్మవారికి ఇతర పేర్లు:
వైష్ణవి, మాతా రాణి, అంబే, త్రికూట, షెరావాలి, జ్యోతావళి, పహడవాలి, దుర్గ, భగవతి, జగదాంబ, లక్ష్మి, విష్ణుమాయ, విష్ణుప్రియ, రామ, మణికి.

💠 ఈ ఆలయం జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలో ఎత్తైన హిమాలయ పర్వత ప్రాంతంలోని త్రికూట పర్వత శేణిలో సముద్ర మట్టమునకు 5200 అడుగుల ఎత్తులో ఉంది.

💠 వైష్ణవదేవి గుహాలయంలో సృష్టి, స్థితి, లయలకు మూలాధారమైన పరాశక్తిని మహా సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళిగా నిరూపించే మూడు విగ్రహాలున్నాయి.

💠 శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రముతో సతీదేవి శరీరమును ఖండించినప్పుడు సతీదేవి పుర్రె త్రికూట పర్వతములలోని ఈ ప్రదేశమునందు పడినట్లు ఈ క్షేత్రము వైష్ణోదేవి శక్తి పీఠముగా వెలుగొందుచున్నట్లు పురాణ కధనము.
శివుడు శక్తి పీఠములు అన్నిటికీ కాలభైరవుడిని క్షేత్ర పాలకునిగా నియమించాడు.
అందువలన శక్తి పీఠములు అన్నిటిలోనూ క్షేత్ర పాలకుడు కాలభైరవుని ఆలయం కలదు.

🔆 స్థల పురాణం 🔆

💠 పూర్వము అసురుల బాధలు ఎక్కువగా వుండి. వారితో పోరాడి భూలోకంలో ధర్మాన్ని ప్రజలని రక్షించుటకు జగన్మాతలు మహాలక్ష్మీ, మహాకాళి, మహాసరస్వతులు తమ తేజస్సునుండి ఒక దివ్య శక్తిని ఆవిర్భవింప చేయ సంకల్పించి ఒక అందమైన యువతని సృష్టించి ఆ యువతిని భూలోకంలో రత్నాకరసాగర్ అనే ఆయనకి విష్ణు అంశతో పుత్రికగా జన్మించి ధర్మ కార్యాలు చేయమని, ఆధ్యాత్మిక పరిపక్వత చెందిన పిమ్మట శ్రీ మహావిష్ణువులో ఐక్యం చెందుతావని చెబుతారు.

💠 రత్నాకరసాగర్ ఇంట జన్మించిన ఆ బాలికకు వైష్ణవి అని నామకరణం చేశారు.
వైష్ణవి అడవుల్లోకెళ్ళి తపస్సు చేయసాగింది. అదే సమయంలో 14 సంవత్సరాలు అరణ్యవాసంలో వున్న శ్రీరామచంద్రుడు అక్కడికి రాగా వైష్ణవి శ్రీరామచంద్రుణ్ణి శ్రీమహావిష్ణువుగా గుర్తించి, తనని ఆయనలో లీనం చేసుకోమని కోరింది. 

💠 శ్రీరామచంద్రుడు దానికి తగిన సమయంకాదని, తన అరణ్యవాసం తర్వాత తిరిగి వైష్ణవి దగ్గరకొస్తానని, ఆ సమయంలో ఆమె తనని గుర్తిస్తే తప్పక తనలో ఐక్యం చేసుకుంటానని తెలిపాడు.
ఆ ప్రకారమే శ్రీరామచంద్రుడు అరణ్యవాసం, రావణవధానంతరం అయోధ్యకి తిరిగి వెళ్తూ ఆమె దగ్గరకు ఒక వృధ్ధుడి రూపంలో వచ్చాడు. కానీ ఆ సమయంలో వైష్ణవి ఆయనని గుర్తించలేకపోతుంది.
అందుకని భగవంతునిలో ఐక్యమయ్యే కోరిక తీరలేదు.

💠 బాధపడుతున్న వైష్ణవిని శ్రీరామచంద్రుడు ఓదార్చి, ఆమె తనలో ఐక్యమవటానికి తగిన సమయమింకా రాలేదని, కలియుగంలో తాను కల్కి అవతారం ధరిస్తానని, అప్పుడు ఆమె కోరిక నెరవేరుతుందని ధైర్యం చెప్పాడు. 
త్రికూట పర్వత శ్రేణిలోని ఒక గుహలో ధ్యానం చేయమని చెప్పి, ఆమెకు రక్షణగా ఒక విల్లు,బాణం, సింహం మరియు చిన్న వానర సైన్యాన్ని ఇచ్చాడు.

💠 శ్రీరామచంద్రుని ఆజ్ఞానుసారం వైష్ణవి త్రికూట పర్వతసానువుల్లో తన తపస్సు కొనసాగించింది.
కొంతకాలం తర్వాత గోరఖ్ నాధ్ అనే తాంత్రికుడు వైష్ణవి గురించి, ఆమె దీక్ష గురించి తెలుసుకుని, ఆమె ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను అధిరోహించిందో లేదో తెలుసుకోవాలనే కుతూహలంతో, వివరాలు తెలుసుకు రావటానికి తన శిష్యుడు భైరవనాధుణ్ణి పంపాడు.

💠 భైరవనాధుడు చాటుగా వైష్ణనిని గమనించాడు. తపస్విని అయినా వైష్ణవి ఎల్లప్పుడు ధనుర్బాణాలు ధరించి వుండటం, ఆవిడకి రక్షగా లంగూర్లు, ఒక భయంకర సింహం వుండటం గమనించాడు. 
భైరవనాధుడు వైష్ణవి అందానికి ముగ్ధుడై తనని వివాహం చేసుకోమని ఆమెని విసిగించి వైష్ణవిపట్ల అమర్యాదగా ప్రవర్తించాడు.
భైరవుడి తలని ఆ గుహ బయట ఒక్క వేటుతో నరుకుతుంది. 

💠 తెగిన భైరవుడి తల కొంచెం దూరంలో ఒక పర్వత శిఖరం మీద పడింది.
అప్పుడు తన తప్పు తెలుసుకున్న భైరవుడు వైష్ణవీదేవిని క్షమించమని ప్రార్ధించాడు.
మాత దయతలచి, తన భక్తులంతా తన దర్శనం తర్వాత భైరవుణ్ణి దర్శిస్తారని, అప్పుడే వారి యాత్ర సంపూర్ణమవుతుందని వరమిస్తుంది.

💠 తదనంతరం వైష్ణవి త్రికూట పర్వతంపైన గుహలో, 3 తలలతో 5.5 అడుగుల ఎత్తయిన రాతిరూపం ధరించింది.
వైష్ణోదేవిలో గుహాలయంలో మనకి కనిపించే మూడు రాతి రూపాలు (పిండీలంటారు అక్కడివారు) ఆ మాత తలలే. వాటినే మహాకాళీ, వైష్ణోదేవి, మహా సరస్వతిగా చెప్తారు అక్కడి పండితులు.

Wednesday, 26 June 2024

తమిళనాడు ఫుల్ టూర్

కాణిపాకం To శ్రీపురం 55km 

శ్రీపురం To అరుణాచలం 80km

అరుణాచలం To తిరుక్కోయిళూరు 36km (ఉలగలంత పెరుమాల్ )

తిరుక్కోయిలూర్ To విరుదాచలం 
62 km

విరుదాచలం To చిదంబరం 45km

చిదంబరం To వైదిశ్వరన్ కోయిల్ 30km

వైదీశ్వరన్ కోయిల్ To కుంభకోణం 48km

కుంభకోణం చుట్టూ చాలా గుడులు ఉన్నాయి 

వాటిలో imp తిరువిడైమరదుర్, స్వామిమలై,నాచియార్ కోయిల్, తిరుచ్చేరై,

  కుంభకోణం To తిరువారుర్ 48km

తిరువారుర్ To తంజావూరు 60km

తంజావూరు To శ్రీరంగం 60km

శ్రీరంగం To జంబూకెశ్వరం 4km (తిరువనైకోయిల్ )

జంబూకెశ్వరం To సమయపురం 7 km

సమయపురం To మధురై 142km

మదురై To రామేశ్వరం173km

రామేశ్వరం To తిరుచేందూర్ 222km

తిరుచేందూర్ To కన్యాకుమారి 90km

కన్యాకుమారి To సుచింద్రం 15km

సుచింద్రం To టెంకాశి 135km

టెంకాశీ To శ్రీవిల్లి పుత్తూరు 82km

శ్రీవిల్లి పుత్తూరు To పళని 180km

పళని To భవాని 125km

భవాని To కంచి via వెల్లూరు హైవే 335km

కంచి To తిరుత్తని 42km

తిరుత్తని To తిరుపతి 67km


Saturday, 1 June 2024

రాయల వారి ఆలయం

మీకు తెలుసా?
శ్రీవారికి రాయలు సమర్పించుకున్న ఆభరణాలు ఎన్ని? 
తిరుపతి ఆలయంలో రాయల విగ్రహాలు ఎందుకు ఉన్నాయి?
రాయలవారు తిరుపతికి ఎన్ని సార్లు వచ్చారు?
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
 సువర్ణాక్షరాలతో లిఖించబడిన చరిత్ర....
దేశభాషలందు తెలుగులెస్స అని చాటిన కీర్తి....
వజ్రాలను వీధుల్లో రాసులుగా పోయించిన ఘనత....
సాహితీ సమరాంగణ సార్వభౌముడుగా ప్రఖ్యాతి....
కృష్ణదేవరాయల సొంతం !

విజయనగర సామ్రాజ్యాన్ని కృష్ణదేవరాయలు 1509 నుంచి 1529 వరకు జనరంజకంగా పాలించాడు. అందుకే ప్రజలు రాయలవారిని దేవుడిగా భావించారు. కాగా రాయలవారు తిరుమల వెంకటేశ్వరస్వామిని మనసారా ఆరాధించాడు ! మొక్కులు చెల్లించుకున్నాడు. శ్రీనివాసుడికి అపురూప కానుకలు సమర్పించిన మహారాజుల్లో దేవరాయలది మొదటి వరస! 

👉తిరుమల దర్శనం - ఆభరణాలు 

రాయలవారు తన జీవితకాలంలో....1513 నుంచి 1521 మధ్యకాలంలో ఎనిమిది సార్లు వెంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకున్నట్టు 
శాసనాలు ఆధారంగా తెలుస్తున్నది. తిరుమల శాసనాల్లో మాత్రం ఏడుసార్ల దర్శనం తాలూకు వివరాలు లభ్యం అవుతున్నాయి. దర్శనం సమయంలో అత్యంత విలువైన వెలకట్టలేని ఆభరణాలను శ్రీవారికి సమర్పించారని కూడా ఈ శాసనాలు చెబుతున్నాయి.

తిరుమల ఆలయంలో లభ్యమైన 1200కు పైగా శాసనాల్లో.... 50 శాసనాలు కృష్ణరాయలవారికి సంబందించినవే. ఈ శాసనాలు తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో ఉన్నాయి. వీటిలో కృష్ణదేవరాయలుతో పాటుగా ఆయన దేవేరులైన తిరుమలాదేవి, చిన్నాదేవిల ప్రస్తావన ఉన్నది.

▪️మొదటిసారి దర్శనం

1513, ఫిబ్రవరి 10 వ తేదీన కృష్ణదేవరాయలు మొట్టమొదటిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంలో....

1 ) 3.3 కేజీల నవరత్న కిరీటం,
2) ముత్యాలు పొదిగిన మూడుపేటల కంఠహారం,
3) 25 వెండి హారతి పళ్లాలు
4 )శ్రీనివాసుడి ఏకాంతసేవలో ఉపయోగించే రెండు బంగారు గిన్నెలు దేవేరులైన చిన్నాదేవి, తిరుమలదేవిల సమేతంగా ప్రత్యేకంగా సమర్పించారు.

▪️రెండవసారి దర్శనం

1513, మే 2 వ తేదీన రెండు నెలల వ్యవధిలో కృష్ణదేవరాయలు రెండోసారి తిరుమలకు యాత్ర చేసాడు..ఈ సందర్భంలో

5 ) వజ్రాలు, కెంపులు, పచ్చలు, రత్నాలు పొదిగిన   
      662 గ్రాముల మొలతాడు
7) వైజ్రవైఢూర్యాలు పొదిగిన కత్తి,
8) 132 గ్రాముల నిచ్చకం కఠారి,
9) ముత్యాలతో కూడిన కఠారి,
10) వజ్రాల కఠారి,
11) 98 గ్రాముల వజ్రాల పతకం,
12) 168 గ్రాముల నిచ్చకం భుజకీర్తుల జోడు,
13) 205 గ్రాముల బంగారుపేట,
14) 276 గ్రాముల వజ్రాలమాల
15 ) 573 గ్రాముల వజ్రాల భుజకీర్తులు,
16) ఉత్సవమూర్తులను అలంకరించేందుకు 380 గ్రాముల బరువైన మూడు వజ్ర కిరీటాలు
సమర్పించుకున్నాడు

▪️మూడవసారి దర్శనం

 1513, జూన్‌ 13 వ తేదీన ఒక నెల వ్యవధిలో దేవరాయలవారు మూడోసారి శ్రీవారిని దర్శించుకున్నాడు.
ఈ సందర్భంలో....

17) జతలకొద్ది బంగారు గిన్నెలు 
18) జతలకొద్ది నవరత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలు
వీటితో పాటుగా 
19) నిత్య నైవేద్యాల నిమిత్తం ఐదు గ్రామాలను దానముగా రాసి ఇచ్చాడు

ఇదే సమయంలో ప్రతి ఏటా తమిళనెల తైమాసంలో తన తల్లిదండ్రుల ఆత్మోద్ధరణ కోసం ఉత్సవం ప్రారంభించారు.

▪️నాల్గవసారి దర్శనం

1514, జులై 6 వ తేదీన తన జైత్రయాత్రలో భాగంగా తిరుమలేశుని నాల్గవమారు దర్శించుకున్నాడు. ఆ సమయంలో కృష్ణదేవరాయలు ఉదయగిరి కోటను జయించి విజయనగరానికి తిరిగివెళుతున్నాడు. తన విజయానికి జ్ఞాపకంగా సతీ సమేతముగా శ్రీవారికి కనకాభిషేకం చేశాడు.
20) 30వేల బంగారు వరహాలతో ఈ అభిషేకం  
       గావించాడు.
21) 250 గ్రాముల బంగారు త్రిసరం దండ, రెండు    
        వజ్రాల కడియాలు ఇచ్చుకున్నాడు.

22)వేంకటేశ్వరుడి నిత్యారాధనకు తాళ్లపాక గ్రామాన్ని దానంగా రాసిచ్చాడు.
23) ముత్యాలు, పచ్చలు, వజ్రాలు పొదిగిన 225న్నర గ్రాముల చక్రపాదకం తిరుమలాదేవి తరుపున సమర్పించడం జరిగింది.
 24 ) చిన్నాదేవి తరుపున _
200 గ్రాముల వజ్రాలు పొదిగిన మూడు కంఠమాలలు,
25 ) నిత్య కైంకర్యాల కోసం ఓ గ్రామం,
సమర్పించడం జరిగింది.

▪️ ఐదవసారి దర్శనం

1515, అక్టోబరు 25 వ తేదీన రాయలవారు...
కళింగ వరకు తన విజయనగర సామ్రాజ్యం విస్తరించిన శుభ సమయాన్ని పురస్కరించుకొని ఐదవసారి శ్రీనివాసుడి దర్శనం చేసుకున్నాడు.
ఈ విజయోత్సాహంలో

26) 27 కేజీల బరువున్న మకరతోరణాన్ని కానుకగా ఇచ్చాడు.

▪️ఆరవసారి దర్శనం

1517, జులై 2వ తేదీన....కళింగ
దేశాన్ని పూర్తిగా స్వాదీనపరుచుకుని తిరుగులేని మహారాజుగా రాయలవారు ఆరవసారి తిరుమల సందర్శించారు. ఈ సందర్బంగా....

27) వేంకటేశ్వరుడి ఆనంద నిలయానికి 30 వేల వరహాలతో బంగారు తాపడం చేయించాడు .
ఆనంద నిలయ గోపురానికి బంగారు తాపడం 1518 సెప్టెంబరు 9న పూర్తయింది
28) స్వామి వారికి ప్రత్యేకంగా బంగారు కంఠమాల 29) విలువైన బంగారు పతకం
సమర్పించుకున్నాడు

▪️పట్టపురాణులతో తన విగ్రహం

ప్రస్తుతం భక్తులు తిరుపతి యాత్ర వెళ్లి శ్రీవారిని దర్శించడానికి ముందు కృష్ణరాయమండపంలోకి ప్రవేశిస్తారు. ఈ మండపం కుడివైపున కృష్ణదేవరాయలు విగ్రహం తన దేవేరుల తో కలిసి ఉంటుంది. శ్రీచక్ర శుభనివాసుడికి ఈ విగ్రహాలు భక్తి పూర్వకంగా ప్రణమిల్లుతున్నట్టు ప్రతిష్టితులై కనిపిస్తారు. ఈ విగ్రహాలను దేవస్థానం వారు ప్రతిష్టించలేదు. కృష్ణదేవరాయలు వారే స్వయంగా తన ఆరవసారి తన దర్శనంలో భాగంగా
ఆలయంలో ప్రతిష్టించుకున్నారు. తనకు అంతులేని సంపదను రాజ్యాన్ని ఇచ్చిన శ్రీవారి చెంతన తాను శాశ్వతంగా మిగిలిపోయి తిరుమల వైభవాన్ని మహిమను చాటుతూనే ఉండాలనే ఉద్దేశంతో రాయలు వారు విగ్రహరూపంలో ఇక్కడ మిగిలిపోయారు.రాజైనా మహారాజైనా దేవుడి ముందు దాసోహులే కదా! 

▪️ఏడవసారి దర్శనం

518, అక్టోబరు 16 వ తేదిన దేవేరి తిరుమలాదేవితో కలిసి రాయలవారు ఏడవమారు తిరుమలకు వచ్చాడు. కమలాపురం శాసనాల్లో ఈ సమాచారం ఉన్నది.ఈ యాత్రకు సంబంధించిన ఆధారాలు తిరుమల శాసనాల్లో లేవు కాబట్టి, ఈ సందర్బంగా సమర్పించుకున్న కానుకల వివరాలు లభ్యం కావడం లేదు.

▪️ఎనిమిదవసారి దర్శనం

క్రీ.శ. 1521, ఫిబ్రవరి 17 వ తేదీన కృష్ణదేవరాయలు తిరుమల శ్రీవారిని ఎనిమిదవమారు 
దర్శనం చేసుకున్నాడు. ఈ సందర్భంలో...

30) రత్నాలు పొదిగిన వింజామర..
31) 31 కేజీల 124 గ్రాముల మకర తోరణం 
32) నవరత్న ఖచిత పీతాంబరం..
33) 10 వేల బంగారు వరహాలు
34) రత్నాలు, పచ్చలు, నీలాలు పొదిగిన కుళ్లాయి, సమర్పించుకున్నాడు.

👉స్వామివారి విశిష్టత

స్వామివారి విశిష్టత, తిరుమల వైభవం, రాయలు సమర్పించుకున్న ఆభరణాలు, ఈ మొత్తం వివరాలు
డా..సాదు సుబ్రమణ్యశాస్త్రిగారు తన 
 ""‘తిరుపతి శ్రీ వెంకటేశ్వర"" పుస్తకంలో రాసారు. ఈ పుస్తకం 1921లో ప్రచురించబడింది. ఈ పుస్తకం ప్రకారం పైన తెలిపిన ఆభరణాలు మాత్రమే కాకుండా, వెలుగులోకి రాని మరెన్నో ఆభరణాలు ఉన్నట్టుగా తెలుస్తున్నది.

హనుమాన్ జయంతి

హనుమాన్ చాలీసా

దోహా
శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి ।
వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి ॥
బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార ।
బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార ॥

ధ్యానం
గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్ ।
రామాయణ మహామాలా రత్నం వందే-(అ)నిలాత్మజమ్ ॥
యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ ।
భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్ ॥

చౌపాఈ
జయ హనుమాన జ్ఞాన గుణ సాగర ।
జయ కపీశ తిహు లోక ఉజాగర ॥ 1 ॥

రామదూత అతులిత బలధామా ।
అంజని పుత్ర పవనసుత నామా ॥ 2 ॥

మహావీర విక్రమ బజరంగీ ।
కుమతి నివార సుమతి కే సంగీ ॥3 ॥

కంచన వరణ విరాజ సువేశా ।
కానన కుండల కుంచిత కేశా ॥ 4 ॥

హాథవజ్ర ఔ ధ్వజా విరాజై ।
కాంథే మూంజ జనేవూ సాజై ॥ 5॥

శంకర సువన కేసరీ నందన ।
తేజ ప్రతాప మహాజగ వందన ॥ 6 ॥

విద్యావాన గుణీ అతి చాతుర ।
రామ కాజ కరివే కో ఆతుర ॥ 7 ॥

ప్రభు చరిత్ర సునివే కో రసియా ।
రామలఖన సీతా మన బసియా ॥ 8॥

సూక్ష్మ రూపధరి సియహి దిఖావా ।
వికట రూపధరి లంక జలావా ॥ 9 ॥

భీమ రూపధరి అసుర సంహారే ।
రామచంద్ర కే కాజ సంవారే ॥ 10 ॥

లాయ సంజీవన లఖన జియాయే ।
శ్రీ రఘువీర హరషి ఉరలాయే ॥ 11 ॥

రఘుపతి కీన్హీ బహుత బడాయీ (ఈ) ।
తుమ మమ ప్రియ భరత సమ భాయీ ॥ 12 ॥

సహస్ర వదన తుమ్హరో యశగావై ।
అస కహి శ్రీపతి కంఠ లగావై ॥ 13 ॥

సనకాదిక బ్రహ్మాది మునీశా ।
నారద శారద సహిత అహీశా ॥ 14 ॥

యమ కుబేర దిగపాల జహాం తే ।
కవి కోవిద కహి సకే కహాం తే ॥ 15 ॥

తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా ।
రామ మిలాయ రాజపద దీన్హా ॥ 16 ॥

తుమ్హరో మంత్ర విభీషణ మానా ।
లంకేశ్వర భయే సబ జగ జానా ॥ 17 ॥

యుగ సహస్ర యోజన పర భానూ ।
లీల్యో తాహి మధుర ఫల జానూ ॥ 18 ॥

ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ ।
జలధి లాంఘి గయే అచరజ నాహీ ॥ 19 ॥

దుర్గమ కాజ జగత కే జేతే ।
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే ॥ 20 ॥

రామ దుఆరే తుమ రఖవారే ।
హోత న ఆజ్ఞా బిను పైసారే ॥ 21 ॥

సబ సుఖ లహై తుమ్హారీ శరణా ।
తుమ రక్షక కాహూ కో డర నా ॥ 22 ॥

ఆపన తేజ సమ్హారో ఆపై ।
తీనోం లోక హాంక తే కాంపై ॥ 23 ॥

భూత పిశాచ నికట నహి ఆవై ।
మహవీర జబ నామ సునావై ॥ 24 ॥

నాసై రోగ హరై సబ పీరా ।
జపత నిరంతర హనుమత వీరా ॥ 25 ॥

సంకట సే హనుమాన ఛుడావై ।
మన క్రమ వచన ధ్యాన జో లావై ॥ 26 ॥

సబ పర రామ తపస్వీ రాజా ।
తినకే కాజ సకల తుమ సాజా ॥ 27 ॥

ఔర మనోరథ జో కోయి లావై ।
తాసు అమిత జీవన ఫల పావై ॥ 28 ॥

చారో యుగ ప్రతాప తుమ్హారా ।
హై ప్రసిద్ధ జగత ఉజియారా ॥ 29 ॥

సాధు సంత కే తుమ రఖవారే ।
అసుర నికందన రామ దులారే ॥ 30 ॥

అష్ఠసిద్ధి నవ నిధి కే దాతా ।
అస వర దీన్హ జానకీ మాతా ॥ 31 ॥

రామ రసాయన తుమ్హారే పాసా ।
సదా రహో రఘుపతి కే దాసా ॥ 32 ॥

తుమ్హరే భజన రామకో పావై ।
జన్మ జన్మ కే దుఖ బిసరావై ॥ 33 ॥

అంత కాల రఘుపతి పురజాయీ ।
జహాం జన్మ హరిభక్త కహాయీ ॥ 34 ॥

ఔర దేవతా చిత్త న ధరయీ ।
హనుమత సేయి సర్వ సుఖ కరయీ ॥ 35 ॥

సంకట క(హ)టై మిటై సబ పీరా ।
జో సుమిరై హనుమత బల వీరా ॥ 36 ॥

జై జై జై హనుమాన గోసాయీ ।
కృపా కరహు గురుదేవ కీ నాయీ ॥ 37 ॥

జో శత వార పాఠ కర కోయీ ।
ఛూటహి బంది మహా సుఖ హోయీ ॥ 38 ॥

జో యహ పడై హనుమాన చాలీసా ।
హోయ సిద్ధి సాఖీ గౌరీశా ॥ 39 ॥

తులసీదాస సదా హరి చేరా ।
కీజై నాథ హృదయ మహ డేరా ॥ 40 ॥

దోహా
పవన తనయ సంకట హరణ - మంగళ మూరతి రూప్ ।
రామ లఖన సీతా సహిత - హృదయ బసహు సురభూప్ ॥