Thursday, 3 September 2026

శ్రీ కృష్ణజన్మ అష్టమి

కృష్ణం_వందే_జగద్గురుం

 శ్రీ కృష్ణాష్టమి 

*శ్రీమహావిష్ణువు ధరించిన అవతారాల్లో పది ప్రధానమైనవి కాగా, వాటిలో శ్రీకృష్ణుని అవతారం పరిపూర్ణావతారమని పురాణాలు చెబుతున్నాయి. శ్రావణ బహుళ అష్టమి రోజున, రోహిణీ నక్షత్రాన శ్రీకృష్ణుడు జన్మించినట్లు పేర్కొంటున్నాయి. ఈ రోజును కృష్ణాష్టమిగా, గోకులాష్టమిగా, జన్మాష్టమిగా వ్యవహరిస్తారు. శ్రీకృష్ణావతారం దశావతారాల్లో ఎనిమిదవదికాగా, ఆయన పుట్టిన తిథి కూడా ఎనిమిది కావటం, దేవకీ వసుదేవల అష్టమ గర్భంలో ఆయన జన్మించడం, ఆయనకు ఎనిమిదిమంది భార్యలు ఉండడం, ఇలా శ్రీకృష్ణుని గాధలో ఎనిమిదవ సంఖ్యకు ప్రాధాన్యం ఎంతో వుంది.*
---------------------------------
*వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్*
*దేవకీ పరమానందం కృష్ణం వందే జగదుర్గుమ్*
-----------------------------------
*ఆదిశంకరాచార్యులు శ్రీకృష్ణుని జగదుర్గువుగా కీర్తిస్తూ కృష్ణాష్టకాన్ని విరచించారు. అద్వైతాన్ని స్థాపించిన ఆదిశంకరాచార్యులు, విశిష్టాద్వైతాన్ని బోధించిన రామాను* *జాచార్యులు, ద్వైతాన్ని ప్రతిపాదించిన మధ్వాచార్యులు సహా ఎందరో అధ్యాత్మిక గురువులు గీతాచార్యుడైన శ్రీకృష్ణుడిని జగద్గురువుగా తలచి కొలచి తరించారు. శ్రీకృష్ణుని పుట్టుక నుంచి నిర్యాణం వరకు ఆసాంతం ఆయన జీవితమంతా ఒక మహాప్రబోధం. మేనమామ కంసుని నుంచి మొదలుకొని దుర్యోధనాదులను వధింపజేయడం వరకూ ఆయన సాగించినదంతా దుష్టశిక్షణ. అది శిష్టులైన పాండవుల కోసమే. కలియుగంలో ధర్మం పూర్తిగా వినాశనం కాకుండా ఎన్ని ప్రబోధాలు అవసరమో అన్నింటినీ ఈ దేవదేవుడు మనకు అందించాడు. మరణం లేని మహాశక్తి స్వరూపం ఆ దేవ దేవునిది. భావ గతంలోని దశమ స్కంధం శ్రీకృష్ణలీలల సమాహారం అని చెప్పవచ్చు. ధర్మసం స్థాపనకు ఉద్భవించానని చెప్పిన కృష్ణ భగవానుడు మానవ జీవితానికి దిశా నిర్దేశం చేస్తూ భగవద్గీతని ప్రబోధించాడు. గీతాచార్యునిగా పూజలందుకుంటున్నాడు. నారదముని నుంచి ప్రేరణ పొందిన వేదవ్యాసుడు భక్తిరస ప్రధానమైన శ్రీకృష్ణచరిత్రను 'భాగవత పురాణం'గా రచించారు. అది భక్తి జ్ఞాన, వైరాగ్యాల సమ్మేళనం, పురాణాలన్నింటిలోకీ శ్రేష్టమైనదీ పరమ పవిత్రమైన భాగవతం. హైందవ పురాణ పురుషుల్లా శ్రీకృష్ణుడంతటి గొప్ప వ్యక్తి మరొకరు వుండరు. ఆయనకు ఆయనే సాటి. ఇప్పటికీ ప్రజాపాలకులనబడే వారందరికీ ఆయన ప్రబోధించిన ధర్మమార్గమే శిరోధార్యం. అదే దుష్టశిక్షణ- శిష్టరక్షణ. శ్రీకృష్ణుడు తానే పరమాత్మనని కురుక్షేత్ర సంగ్రామ వేళ అస్త్ర సన్యాసం: చేసిన అర్జునునికి 'భగవద్గీత'ను ఉపదేశిస్తూ పేర్కొన్నాడు. అంతటితో ఆగక, ప్రత్యక్ష సాక్ష్యాధారంగా తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. శ్రీమహావిష్ణువే శ్రీకృష్ణుడని, కాబట్టి కృష్ణతత్వమంటే పరమాత్మ తత్వమని వేరే చెప్పక్కర్లేదు. దశావతారాల పరమార్దం కూడా ఇదే, మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామ వేళ ఉద్భవించిన శ్రీకృష్ణుని 'భగవద్గీత' మహాప్రవచనం మరో సందేశం. కర్తవ్యం నుంచి దూరంగా జరిగే మనిషి ఏ సమయంలో బోధ చేస్తే వింటాడో పరమాత్మకు తెలుసు. కర్తవ్యం విడిచి వెడితే జాతి క్షమించదన్నాడు. కర్మాచరణమే నిజమైన సన్యాసమని తెలిపాడు.*
----------------------------------
*శ్రీకృష్ణుని లీలలు*
-----------------------------------
*ఏ అవతారంలోనూ కనిపించని ఎన్నో ప్రత్యేకతలు కృష్ణావతారంలో కన్పిస్తాయి. ధర్మాధర్మాలకు అతీతమైన భూమికలో జీవితాన్ని గడుపుతూ ధర్మసంస్థాపన చేయడం. సర్వం తెలిసినవాడైనా ఏమీ తెలియనివాడిలా లీలా మానుష విగ్రహుడిగా తన లీలలతో జగన్నాటకాన్ని నడపడం, బాలకృష్ణుడిగా చిలిపి చేష్టలతో అందరి హృదయాలలో చిరస్థాయిగా ఆత్మీయుడిగా నిలిచిపోవడం, 'మన్ను తిన్నావా?' అని అడిగిన యశోద మ్మకు నోటిలోనే పదునాలుగు భువనాలను చూపిస్తూ తల్లికి ఆత్మబోధ చేశాడు. 'సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ' అనే భగవద్గీతా శ్లోకానికి పర మాత్మ అప్పుడే ఆచరణాత్మకంగా అర్థాన్ని ప్రకటించాడు. గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలుతో ఎత్తి పట్టుకోవడం, పరమాత్మ పిలుపునందుకున్న వారంతా గోవర్ధన పర్వత ఛాయలో చేరుకోవడం నిజంగా ఆశ్చర్యమే. కంసుడిని మేన మామ అని చూడకుండా వధించి లోక సంరక్షణ విషయంలో బంధుత్వాలు పనికిరావని బోధించాడు. శకటాసుర, తృణావర్త తదితర రాక్షససంహారం, కాళీయ మర్దనం, శిశుపాల దంతవక్త్రుల సంహారం- ఇలా ప్రతి ఘట్టంలోనూ దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేశాడు పరమాత్మ. నిండుగా నీళ్లతో పారుతూ అలనాటి కృష్ణుని రాసక్రీడలకు సాక్షిగా దర్శనమిస్తుంది యమునానది. మధుర భక్తికి మూలం రాధాదేవి. ఒకప్రక్క వెన్నదొంగగా గోపెమ్మలను అరడి పెడతాడు, ఇంకొక పక్క చీరలు దొంగిలించి గోపికలకు తత్వోపదేశం కావిస్తాడు. ఇలా ఎన్నో వింతలు! ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తూనే వుంటుంది. అదే ఆ చిన్నికృష్ణునిలోని మహిమ, కృష్ణా! ముకుందా! మురారి! జయగోవిందా! బృందావిహారి! అంటూ ప్రేమతో ధ్యానిస్తే, కీర్తిస్తే ఆ జగద్గురువు అనుగ్రహం వెంటనే లభ్యమౌతుంది. అందుకు మధుర భక్తిమార్గాన్ని ఎంచుకుని ఆరాధించటానికి కృష్ణాష్టమే మంచి రోజు.*
------------------------------------
*బృందావనం వేదికగా*
------------------------------------
*శ్రీకృష్ణభగవానుని బాల్యక్రీడలకు, లీలా విన్యాసాలకు వేదిక బృందావనం. రాధాకృష్ణుల మధుర ప్రేమకు, రసరమ్య రాసక్రీడకు సాక్ష్యమిస్తుంది. స్థానికులు వృందావనం అంటారు. తులసికి వృంద అనే పేరుంది. గోకులం ఎంచుకుని నివసించిన ప్రాంతం కాబట్టి ప్రజభూమి అన్నారు. బృందావనం యమునా నది తీరంలో వుంది. ఇక్కడే యమునా తీరంలో 32 స్నాన ఘట్టాలున్నాయి. ఇక్కడే ప్రతీ స్నానఘట్టం శ్రీకృష్ణ నగవానుని బాల్య క్రీడలలో ముడి వడి అత్యంత పవిత్రమైనదని భావించి ఇక్కడ భక్తులు స్నానం చేస్తారు. శ్రీకృ ష్ణుడికి ఎనిమిది మంది రాణులున్నారు. రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్రవింద, నాగ్నజిత, భద్రమనువు, లక్షణ- వారంతా శ్రీకృష్ణుని కోసం తపించి ఆయన్ను భర్తగా పొందారు. స్వపర భేదాలు లేని ధర్మమూర్తి, యోగేశ్వరుడు శ్రీకృష్ణుడు. కర్మను ఈశ్వరార్పణంగా ఆచరించడమే సిద్ధికి హేతువనేది భగవద్గీత సారం. శ్రీకృష్ణపరమాత్మ చూపించింది లీలలు మాత్రమే కాదు అందించిన కర్తవ్య బోధ అవశ్యం అనుసరణీయం.*
---------------------------------
*కరార విందేన పదార విందం ముఖారవిందేన విని వేశ యంతు వటస్య పుత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసాస్మరామి*
----------------------------------
*చేతితో పాదాన్ని నోట్లో పెట్టుకుని, రావి ఆకు దొప్పలో పడుకుని వున్న బాలకృష్ణుని మనసారాస్మరిస్తున్నాను. లీలాశుకుడు రచించిన శ్రీకృష్ణకర్ణామృతంలో బాల ముకుందాష్టకం తొలి శ్లోకమిది.*
-----------------------------------
*ధర్మ సంస్థాపన కొరకు*
------------------------------------
*లోకంలో అధర్మం ప్రబలినపుడు దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించి ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి ప్రతియుగంలోనూ అవతరిస్తానని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. ద్వాపర యుగంలో అధర్మం పెచ్చుమీరినకాలంలో బ్రహ్మదేవుడు, భూదేవి ప్రార్ధించగా, శ్రీమహావిష్ణువు దేవకీ వసుదేవుకు జన్మించ సంకల్పించాడు. అపుడు మధురానగరాన్ని శూరసేన మహారాజు పరిపాలించే వాడు. వసుదేవుడు ఆయన కొడుకు. వసుదేవుడికి యుక్తవయస్సురావడంతో ఉగ్రసేన మహారాజు కూతురు దేవకీదేవితో వివాహం జరిపిస్తారు. చెల్లెలు దేవకీదేవిని అత్తవారింట దిగబెట్టేందుకు కంసుడు స్వయంగా రథం నడుపుతాడు. రథం తోవలో ఉండగానే 'దేవకీదేవి అష్టమ గర్భాన పుట్టిన కొడుకు చేతిలో కంసుడి చావు తప్పదు' అని అశరీరవాణి హెచ్చరిక వినిపిస్తుంది. ఆ హెచ్చరికతో ఆగ్రహించిన కంసుడు దేవకీదేవిని, వసుదేవుడిని, అడ్డువచ్చిన తన తండ్రి ఉగ్రసేనుడిని కూడా చెరసాలలో పెడతాడు. చెరసాలలో దేవకీదేవికి జన్మించిన ఆరుగురు శిశువులను కంసుడు దారుణంగా చంపేస్తాడు. దేవకీదేవి ఏడవసారి గర్భం ధరించినపుడు విష్ణువు తన మాయతో ఆమె గర్భాన్ని నందనవనంలో నందుడి భార్య రోహిణి గర్భంలో ప్రవేశపెడతాడు. ఈ గర్భంవల్ల రోహిణికి బలరాముడు జన్మిస్తాడు. చెరసాలలో దేవకికి గర్భస్రావం జరిగిందని అనుకుంటారు. కొన్నాళ్లకు దేవకీదేవి ఎనిమిదోసారి గర్భం ధరిస్తుంది. శ్రావణ బహుళ అష్టమినాడు అర్థరాత్రి వేళ రోహిణి నక్షత్రమున్న సమయంలో శ్రీకృష్ణుడు దేవకీ గర్భాన జన్మిస్తాడు. వసుదేవుడు కృష్ణుడిని పొత్తిళ్ళలో పెట్టుకుని చెరసాల బయట నిద్రిస్తున్న కావలి భటులను తప్పించుకుని యమున నది వైపు బయలుదేరుతాడు. యమునా నది రెండుగా చీలి వసుదేవుడికి దారినిస్తుంది. వ్రేపల్లెలోని తన స్నేహితుడైన నందుని ఇంటికి వెళతాడు. నందుడి భార్య యశోద ప్రక్కన శిశువుని విడిచి ఆమె ప్రక్క నిద్రిస్తున్న శిశువుని ఎత్తుకుని తిరిగి చెరసాలకు చేరుకుంటాడు. చెరసాలకు రాగానే ఆ శిశువు ఏడుస్తుంది. కంసుడు. హుటాహుటిన చెరసాలకు చేరుకుంటాడు. శిశువుని చంపడానికి పైకి విసిరి కొడతాడు. అయితే ఆ శిశువు ఆకాశమార్గాన కెగసి, తాను యోగమాయనని, కంసుడిని చంపేవాడు వేరేచోట పెరుగుతున్నాడని చెప్పి అదృశ్యమవుతుంది. దేవకి గర్భాన పుట్టినవాడు ఎక్కడ వున్నా వెతికి వాడిని చంపాలంటూ తన వద్ద నున్న రాక్షసులను పురమాయిస్తాడు. గోకులానికి వచ్చిన పూతనను, శకటాసురుడిని మొదలగువారిని బాల్యంలోనే చంపేశాడు. చెడ్డవారిని దండించి మంచి వారిని కాపాడి ధర్మాన్ని నిలబెట్టడమే నా పని- రాజ్యాలు పాలించటం కాదు. అని కృష్ణుడు ప్రకటించాడు. ఆ తర్వాత మహాభారత యుద్ధం జరిగింది. శ్రీకృ పరమాత్మ ధర్మపరులైన పాండవులకు సహాయంగా ఉండి చెడ్డవారందరినీ శిక్షించాడు.*
---------------------------------
*"పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం*
*ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే".*
--------------------------------                         *🙏🏻జై శ్రీ కృష్ణ🙏🏻*
--------------------------------
*శ్రీకృష్ణుని గురించి అద్భుతమైన సమాచారం*
----------------------------------
 *కృష్ణం వందే జగద్గురుం* 
-----------------------------------
*1)శ్రీకృష్ణుడు 5,252 సంవత్సరాల క్రితం జన్మించాడు*
*2)పుట్టిన తేది సాధారణ పూర్వ శకం 18.07.3228 (3228 B.C.E)*
*3)మాసం : శ్రావణం*
*4)తిథి: అష్టమి*
*5)నక్షత్రం : రోహిణి*
*6)వారం : బుధవారం*
*7)సమయం : రాత్రి గం.00.00 ని.* 
*8)జీవిత కాలం : 125 సంత్సరాల 8 నెలల 7 రోజులు*
*9)నిర్యాణం: సాధారణ పూర్వ శకం 18.02.3102(3102 B.C.E)*
*10)శ్రీకృష్ణుని 89వ యేట కురుక్షేత్రం జరిగినది*
*11)కురుక్షేత్రం జరిగిన 36సం. తరువాత నిర్యాణం*
*12)కురుక్షేత్రం సాధారణ పూర్వ శకం 08.12.3139న మృగసిర శుక్ల ఏకాదశినాడు ప్రారంభమై 25.12.3139 న ముగిసినది. సాధారణ పూర్వ శకం (B.C.E) 21.12.3139న 3గం. నుంచి 5గం.లవరకు సంభవించిన సూర్య గ్రహణం జయద్రదుని మరణానికి కారణమయ్యెను.*
*13)భీష్ముడు సాధారణ పూర్వ శకం. 02.02.3138న ఉత్తరాయణంలో మొదటి ఏకాదశినాడు ప్రాణము విడిచెను.*
*14)శ్రీకృష్ణుడిని వివిధ ప్రాంతాలలో వివిధ నామాలతో పూజిస్తారు. అవి:*
*మధురలో కన్నయ్య*
*ఒడిశాలో జగన్నాధ్*
*మహారాష్ట్ర లో విఠల (విఠోబ)*
*రాజస్తాన్ లో* *శ్రీనాధుడు*
*గుజరాత్ లో* *ద్వారకాదీసుడు & రాంచ్చోడ్*
*ఉడిపి, కర్ణాటకలో కృష్ణ*
*15)జన్మనిచ్చిన తండ్రి వసుదేవుడు*
*16)జన్మనిచ్చిన తల్లి దేవకీ*
*17)పెంచిన తండ్రి నందుడు*
*18)పెంచిన తల్లి యశోద*
*19)సోదరుడు బలరాముడు*
*20)సోదరి సుభద్ర*
*21)జన్మ స్థలం మధుర*
*22)భార్యలు : రుక్మిణీ, సత్యభామ, జాంబవతీ, కాళింది, మిత్రవింద, నగ్నజితి, భద్ర, లక్ష్మణ*
*23)శ్రీ కృష్ణుడు జీవితంలో కేవలం నలుగురిని మాత్రమే హతమార్చినట్టు* *సమాచారం. వారు : చాణుర - కుస్తీదారు*
*కంసుడు - మేనమామ*
*శిశుపాలుడు మరియు దంతవక్ర - అత్త కొడుకులు.*
*24)శ్రీకృష్ణుని జీవితం కష్టాల మయం. తల్లి ఉగ్ర వంశమునకు, తండ్రి యాదవ వంశమునకు చెందిన వారు.*
*25)శ్రీ కృష్ణుడు దట్టమైన నీలపు రంగు కలిగిన శరీరముతో పుట్టాడు. గోకులమంతా నల్లనయ్య / కన్నయ్య అని పిలిచేవారు. నల్లగా పొట్టిగా ఉన్నాడని, పెంచుకున్నరాని శ్రీ కృష్ణుడుని అందరూ ఆటపట్టిస్తూ, అవమానిస్తూ ఉండేవారు. తన బాల్యమంతా జీవన్మరణ పోరాటాలతో సాగింది.* 
*26)కరువు, ఇంకా అడవి తోడేళ్ళ ముప్పు వలన శ్రీకృష్ణుని 9 ఏళ్ల వయసులో గోకులం నుంచి బృందావనం కి మారవలసి వచ్చింది.*
*27)14-16 ఏళ్ల వయసు వరకు బృందావనం లో ఉన్నాడు. తన సొంత మేనమామ కంసుడిని 14-16 వయస్సులో మధుర లో చంపి తనను కన్న తల్లిదండ్రులను చెరసాల నుంచి విముక్తి కలిగించాడు.*
*28)తను మళ్ళీ ఏపుడూ బృందావనానికి తిరిగి రాలేదు.*
*29)కాలయవన అను సింధూ రాజు  నుంచి ఉన్న ముప్పు వలన మధుర నుంచి ద్వారకకి వలస వెళ్ళవలసి వచ్చింది.*
*30)వైనతేయ తెగకు చెందిన ఆటవికులు సహాయంతో జరాసందుడిని గోమంతక కొండ (ఇప్పటి గోవా) వద్ద ఓడించాడు.*
*31)శ్రీకృష్ణుడు  ద్వారకాను పునర్నిర్మించారు.*
*32)అప్పుడు విద్యాభ్యాసం కొరకు 16-18 ఏళ్ల వయసులో ఉజ్జయినిలో గల సాందీపని యొక్క అశ్రమంకు తరలివెళ్ళెను.*
*33)గుజరాత్ లో గల ప్రభాస అను సముద్రతీరం వద్ద ఆఫ్రికా సముద్రపు దొంగలతో యుద్ధం చేసి అపహరణకు గురి ఐన తన ఆచార్యుని కుమారుడగు పునర్దత్త ను కాపడెను.*
*34)తన విద్యాభ్యాసం తరువాత పాండవుల వనవాసమును గురించి తెలుసుకుని వారిని లక్క ఇంటి నుంచి కాపాడి తదుపరి తన సోదరి అగు ద్రౌపదిని పాండవులకు ఇచ్చి పెండ్లి చేసెను. ఇందులో చాలా క్రియాశీలంగా వ్యవహరించెను.*
*35)పాండవులు ఇంద్రప్రస్థ నగరమును ఏర్పాటు చేసి రాజ్యమును స్థపింపజేసెను.*
*36)ద్రౌపదిని వస్త్రాపహరణం నుంచి కాపడెను.*
*37)రాజ్యము నుండి  వెడలగొట్టునపుడు పాండవులకు తోడుగా నిలిచారు.*
*38)పాండవులకు తోడుగా ఉండి కురుక్షేత్రంలో విజయమును వరించునట్టు చేసెను.*
*39)ఎంతో ముచ్చటగా నిర్మించిన ద్వారక నగరము నీట మునిగిపోవుట స్వయముగా చూసేను.*
*40)అడవిలో జర అను వేటగాడి చేతిలో మరణించెను.*
*41)శ్రీకృష్ణుడు  జీవితం విజయవంతమైనదేమీ కాదు. జీవితములో ఒక్క క్షణం కూడా ఎటువంటి సంఘర్షణ లేకుండా ప్రశాంతముగా గడిపినది లేదు. జీవితపు ప్రతీ మలుపులో సంఘర్షణలు మాత్రమే ఎదుర్కొన్నాడు.*
*43)జీవితములో ప్రతీ వ్యక్తిని, ప్రతీ విషయాన్ని బాధ్యతతో ఎదుర్కొని చివరకు దేనికి / ఎవరికీ అంకితమవ్వలేదు.*
*అతను గతాన్ని, భవిష్యత్తును కూడా తెలుసుకోగల సమర్థుడు ఐనప్పటికీ తను ఎప్పుడు వర్తమానములోనే బ్రతికాడు.)*
*44)శ్రీకృష్ణుడు ఇంకా అతని జీవితము మానవాళికి ఒక నిజమైన ఉదాహరణ.*

Sunday, 23 August 2026

నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి

 శ్రీ పద్మావతీ సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం – నారాయణవనం* 
నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం సాధారణ వైష్ణవ ఆలయం మాత్రమే కాదు. శ్రీనివాసుడు–పద్మావతి అమ్మవారి దివ్య వివాహం జరిగిన పవిత్ర కల్యాణ క్షేత్రంగా భక్తులు విశ్వసించే అత్యంత ప్రాచీన పుణ్యస్థలం. తిరుమలలో స్వామివారు జగద్రక్షకుడిగా దర్శనమిస్తే, నారాయణవనంలో కల్యాణమూర్తిగా, నూతన వరుడి రూపంలో భక్తులను అనుగ్రహించడం ఈ క్షేత్రపు ప్రధాన విశిష్టత.
నారాయణవనం అనే పేరు ఎలా వచ్చింది?
పురాణకాలంలో ఈ ప్రాంతం తుండీర మండలం పరిధిలో ఉండేదని స్థలపురాణం తెలియజేస్తోంది. ఆకాశరాజు నారాయణవనాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించేవారు. శ్రీమహావిష్ణువు నారాయణుడి రూపంలో ఈ ప్రాంతానికి వచ్చి, ఇక్కడే పద్మావతి దేవిని వివాహం చేసుకున్న కారణంగా ఈ ప్రాంతానికి “నారాయణవనం” అనే పేరు స్థిరపడిందని భక్తుల విశ్వాసం.
పద్మావతి అమ్మవారి ఆవిర్భావం
ఆకాశరాజు దంపతులకు చాలా కాలం వరకు సంతానం కలగలేదు. సంతానప్రాప్తి కోసం పుత్రకామేష్టి యాగం నిర్వహించాలని ఆకాశరాజు సంకల్పించారు. యాగశాల నిర్మాణానికి భూమిని నాగలితో దున్నుతుండగా, పద్మంలో పవళించి ఉన్న ఒక దివ్య బాలిక కనిపించిందని స్థలపురాణం చెబుతోంది.
పద్మంలో లభించిన బాలిక కావడంతో ఆమెకు “పద్మావతి” అని నామకరణం చేశారు. ఆకాశరాజు, ధరణీదేవి దంపతులు ఆమెను తమ కన్నబిడ్డగా ఎంతో ప్రేమతో పెంచారు. పద్మావతి దేవి స్వయంగా మహాలక్ష్మి అవతారమని భక్తుల విశ్వాసం.
శ్రీనివాసుడు–పద్మావతి దేవి తొలి దర్శనం
ఒకరోజు తిరుమలలో నివసిస్తున్న శ్రీనివాసుడు వేటకు బయలుదేరారు. ఒక అడవి ఏనుగును వెంబడిస్తూ నారాయణవనం ప్రాంతానికి వచ్చారు. అక్కడి రాజ ఉద్యానవనంలో చెలికత్తెలతో విహరిస్తున్న పద్మావతి దేవిని చూసి, ఆమెను వివాహం చేసుకోవాలని సంకల్పించారు.
తరువాత వకుళమాత ద్వారా ఆకాశరాజు దంపతులకు వివాహ ప్రతిపాదన పంపించారని పురాణకథనం. జ్యోతిషులు, పురోహితులు ఈ సంబంధం దైవనిర్ణయమని తెలియజేయడంతో ఆకాశరాజు దంపతులు సంతోషంగా అంగీకరించారు.
దివ్య కల్యాణ మహోత్సవం
విళంబి నామ సంవత్సరంలో, వైశాఖ మాసం, శుక్లపక్ష దశమి, శుక్రవారం నాడు శ్రీనివాసుడు–పద్మావతి దేవి వివాహం అత్యంత వైభవంగా జరిగినట్లు స్థలపురాణం పేర్కొంటోంది.
బ్రహ్మ, రుద్రుడు, ఇతర దేవతలు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, బ్రహ్మర్షులు, దేవర్షులు ఈ దివ్య కల్యాణానికి హాజరయ్యారని పురాణకథనం. ఆకాశరాజు తన కుమార్తె పద్మావతీ దేవిని శ్రీనివాసుడికి సాలంకృత కన్యాదానం చేశారు. వేదమంత్రాల మధ్య పాణిగ్రహణం జరగడంతో నారాయణవనం భూలోకంలోని పవిత్ర కల్యాణ వేదికగా ప్రసిద్ధి చెందింది.
ఈ కారణంగానే ఇక్కడి స్వామివారిని “శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి” అని పిలుస్తారు.
మూలవిరాట్టు విశిష్టత
ఇక్కడి స్వామివారి దివ్యమంగళ విగ్రహంలో అనేక ప్రత్యేకతలు కనిపిస్తాయి.
స్వామివారి కుడిచేతికి కల్యాణ కంకణం కనిపిస్తుంది. ఇది పద్మావతి అమ్మవారితో జరిగిన దివ్య వివాహానికి గుర్తుగా భావిస్తారు.
స్వామివారి నడుమున దశావతార వడ్డాణం ఉంటుంది. దీనిపై మహావిష్ణువు దశావతారాలకు సంబంధించిన ఆకృతులు ఉంటాయని చెబుతారు.
వేటకు వచ్చిన సందర్భాన్ని గుర్తుచేసే విధంగా స్వామివారి వద్ద ఖడ్గం దర్శనమిస్తుంది.
స్వామివారు నేత్రదర్శనంతో భక్తులను అనుగ్రహిస్తున్నట్లు కనిపించడం మరో విశేషం.
స్వామివారి రూపం నూతన వరుడి రూపాన్ని తలపిస్తూ, కల్యాణ సౌభాగ్యాన్ని ప్రసాదించే మంగళమూర్తిగా దర్శనమిస్తుంది.
తిరుమల శ్రీవారికి పలు అలంకారాల కారణంగా కొన్ని ప్రత్యేక చిహ్నాలు స్పష్టంగా కనిపించకపోవచ్చు. నారాయణవనంలోని స్వామివారి రూపంలో మాత్రం కల్యాణ కంకణం, దశావతార వడ్డాణం, ఖడ్గం వంటి విశేషాలను దర్శించగలగడం భక్తులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది.
వివాహం కానివారికి కల్యాణప్రాప్తి
వివాహం ఆలస్యమవుతున్న యువతీ యువకులు శ్రీ పద్మావతీ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శిస్తే వివాహ అవరోధాలు తొలగి, మంచి సంబంధం కుదురుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ఇప్పటికే వివాహమైన దంపతులు దర్శించుకుంటే:
దాంపత్య అన్యోన్యత పెరుగుతుందని,
కుటుంబ కలహాలు తొలగుతాయని,
సంతాన సౌభాగ్యం కలుగుతుందని,
కుటుంబంలో శాంతి, సుఖసంతోషాలు వృద్ధి చెందుతాయని విశ్వసిస్తారు.
అందువల్ల నూతన వధూవరులు, వివాహం కావలసిన యువతీ యువకులు, దాంపత్య సమస్యలు ఎదుర్కొంటున్న దంపతులు ఈ క్షేత్రాన్ని భక్తిశ్రద్ధలతో దర్శిస్తుంటారు.
వైఖానస ఆగమ సంప్రదాయం
ఆలయంలో పూజలు వైఖానస ఆగమ విధానం ప్రకారం నిర్వహిస్తారు. వైఖానస ఆగమం అనేది విష్ణు ఆలయాల్లో విగ్రహ ప్రతిష్ఠ, నిత్యపూజలు, నివేదనలు, ఉత్సవాలు, అలంకరణలు ఎలా నిర్వహించాలో నిర్దేశించే ప్రాచీన వైదిక సంప్రదాయం.
ఇక్కడ నిత్య, నైమిత్తిక, విశేష కైంకర్యాలు సంప్రదాయబద్ధంగా కొనసాగుతున్నాయి.
నిత్య కైంకర్యాలు: ప్రతిరోజూ నిర్వహించే సుప్రభాతం, అర్చన, నివేదన, హారతి తదితర సేవలు.
నైమిత్తిక కైంకర్యాలు: ప్రత్యేక తిథులు, నక్షత్రాలు, పర్వదినాల్లో జరిగే పూజలు.
విశేష కైంకర్యాలు: బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, తెప్పోత్సవాలు, కల్యాణోత్సవం వంటి మహోత్సవాలు.
ఆలయ నిర్మాణం, నిర్వహణ
స్థలపురాణం ప్రకారం శ్రీనివాసుడు–పద్మావతి దేవి వివాహానంతరం ఆకాశరాజు ఈ ఆలయాన్ని నిర్మించి, స్వామివారిని ప్రతిష్ఠించినట్లు చెబుతారు.
కాలక్రమంలో ఈ ఆలయం:
కార్వేటినగరం సంస్థానాధీశుల పాలనలో,
తిరుత్తణి ఆలయ నిర్వహణలో,
దేవాదాయశాఖ ధర్మకర్తల మండలి పాలనలో కొనసాగింది.
తరువాత 1967 ఏప్రిల్ 29వ తేదీన ఆలయ నిర్వహణను తిరుమల తిరుపతి దేవస్థానాలకు అప్పగించారు. అప్పటి నుంచి టీటీడీ ఆధ్వర్యంలో జీర్ణోద్ధరణ, అభివృద్ధి కార్యక్రమాలు, నిత్యపూజలు, వార్షిక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. నారాయణవనం ఆలయం టీటీడీ పరిధిలోని ప్రముఖ అనుబంధ ఆలయాలలో ఒకటిగా కొనసాగుతోంది. టీటీడీ అధికారిక ఆలయ సమాచారం⁠�
“ఐహిక–ఆముష్మిక ఫలాలు” అంటే ఏమిటి?
స్థలపురాణంలో పేర్కొన్న ఐహిక ఫలాలు అంటే ఈ లోక జీవితంలో కలిగే వివాహం, సంతానం, కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, సంపద, మనశ్శాంతి వంటి శుభఫలాలు.
ఆముష్మిక ఫలాలు అంటే ఆధ్యాత్మిక పురోగతి, పుణ్యం, భగవంతునిపై భక్తి, అంతరంగ శాంతి, మోక్షమార్గానికి సంబంధించిన ఫలాలు.
అందువల్ల ఈ స్వామివారిని దర్శించే భక్తులు ప్రాపంచిక శుభఫలాలతోపాటు ఆధ్యాత్మిక అనుగ్రహాన్ని కూడా పొందుతారని క్షేత్ర మహిమ చెబుతోంది.
ఈ క్షేత్రం అందించే ఆధ్యాత్మిక సందేశం
నారాయణవనం మనకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది. భగవంతుని వివాహం అంటే కేవలం ఇద్దరి కలయిక మాత్రమే కాదు. శ్రీనివాసుడు పరమాత్మకు, పద్మావతి దేవి జీవాత్మకు ప్రతీకలుగా భావిస్తే—వారి కల్యాణం జీవాత్మ పరమాత్మను చేరుకునే దివ్య ఘట్టంగా కనిపిస్తుంది.
అందుకే నారాయణవనం దర్శనం కేవలం ఒక ఆలయ సందర్శన కాదు. శ్రీనివాసుడు–పద్మావతి అమ్మవారి ప్రేమ, దైవసంకల్పం, వివాహ ధర్మం, దాంపత్య పవిత్రతను స్మరింపజేసే ఆధ్యాత్మిక అనుభూతి.
తిరుమలలో శ్రీనివాసుని దర్శించే భక్తుడు—నారాయణవనంలో ఆయన దివ్య కల్యాణ ఘట్టాన్ని స్మరించుకుంటే ఆ యాత్ర మరింత పరిపూర్ణమవుతుంది.

Thursday, 20 August 2026

వరలక్ష్మి వ్రతం

 *వరలక్ష్మీ వ్రతకల్పమువరలక్ష్మీ వ్రతం
- *పూజా సామగ్రి:
పసుపు, కుంకుమ, పండ్లు, పూలు, తమలపాకులు, అగరువత్తులు, వక్కలు, కర్పూరం, గంధం, అక్షింతలు, కొబ్బరికాయలు, కలశము, కలశ వస్త్రము (రవికల గుడ్డ).
-----------------------------------
అమ్మవారి ప్రతిమ లేక విగ్రహము లేక ఫోటో
-----------------------------------
*పంచామృతములు:-* ------------------------------------ ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవునెయ్యి, తేనె, పంచదార
-----------------------------------
*తోరము:-* ------------------------------------ తొమ్మిది ముడులు వేసిన తోరము. దారానికి పసుపు రాసి ఒక్కొక్క పూవు పెట్టి ఒక్కొక్క ముడి వేయవలెను. తొమ్మిది తోరములు కావాలి. ఒకటి అమ్మవారికి, ఒకటి మీకు, మిగతావి ముత్తయిదువలకు.
-----------------------------------
పసుపు ముద్దతో వినాయకుడిని చేయవలెను. ఒక పీటమీద కొద్దిగా బియ్యము పరచి, పూర్ణకుంభంలో (వెండి/ఇత్తడి/రాగి/కంచు చెంబులో) కొత్త బియ్యము వేసి, మర్రియిగుళ్ళు గాని, మామిడి ఆకులు గాని, అవి దొరకకపోతే తమలపాకులు గానీ వేసి, ఆ కుంభం మీద కొత్త రవికల గుడ్డ చుట్టిన కొబ్బరికాయ ఉంచి దానిని పీట మీద మధ్యగా ఉంచి, పూజకు సిద్ధం చేయాలి.
------------------------------------
*పూజావిధానం:-*
------------------------------------
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం!
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే!!
-----------------------------------
దీపము వెలిగించాలి.
-----------------------------------
*ఆచమ్య:-*
------------------------------------
కేశవాయ స్వాహా, నారాయణాయ స్వాహా, మాధవాయ స్వాహా, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోరాయనమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః..
------------------------------------
శ్లో!! ఉత్తిష్ఠిన్తు భూతపిశాచాః యేతేభూమి భారకాః!
ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే!!
------------------------------------
(అని అక్షతలు వాసన చూచి తమ యెడమప్రక్కన పడవేయవలెను.)
మమ ఉపాత్త దురితయక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరీ ముద్దిశ్య శ్రీ పరమేశ్వరీ ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే గంగాగోదావర్యోర్మధ్య ప్రదేశే...సమస దేవతా బ్రాహ్మణ హరిహ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన .......సంవత్సరే ....ఆయనే.....ఋతౌ...మాసే.....పక్షే....తిథౌ.....వాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్ధం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్ధ సిధ్యార్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్ధం, సత్సంతాన సౌభాగ్య శుభఫలావాప్త్యర్థం శ్రీ వరలక్ష్మీ ముద్దిశ్య శ్రీ వరలక్ష్మీ ప్రీత్యర్థం యావచ్ఛక్తి, ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే! తదంగత్వేన కలశపూజాం కరిష్యే!
----------------------------------
అని సంకల్పము చేసి కలశమునకు గంధాక్షతలు పెట్టి, పుష్పమును కలశములో నుంచి, చేతితో కలశమును మూసి ఈ క్రింది శ్లోకమును చదువవలెను.
------------------------------------
శ్లో!!కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రితః
మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృ గణాః స్మృతాః!!
కుక్షౌతు సాగరాః సర్వే సప్తద్వీపా వసుంధరా!
ఋగ్వేదోధయజుర్వేదః, సామవేదోహ్యధర్వణః!
అజ్గైశ్చ సహితాః సర్వే కలశాంబు సమాశ్రితాః!
ఆయాంతు శ్రీ వరలక్ష్మీ పూజార్థం దురితక్షయకారకాః
గంగేచ, యమునేచైవ గోదావరి సరస్వతీ!
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు!!
కలశోదకేన దేవమాత్మానాం, పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య!!
-----------------------------------
(కలశములోని ఉదకమును పుష్పముతో దేవునిపైన, తమ పైన, పూజాద్రవ్యములపైన చల్లవలెను.)
---------------------------------
కళ్యాణీ కమలనిలయే కామితార్థ ప్రదాయినీ!
యావత్త్వాం పూజయిష్యామి శుభదే సుస్థిరోభవ!!
----------------------------------
(అని ప్రార్థిమ్చి దేవునిపై పుష్పము నుంచవలెను)
-----------------------------------
*అథ ధ్యానమ్:-*
------------------------------------
పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే!
నారాయణ ప్రియే దేవీ సుప్రీతా భవ సర్వదా!!
క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే!
సుస్థిరో భవమే గేహే సురాసుర నమస్కృతే!!
లక్ష్మీంక్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం!
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం!
శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం!
త్వామ్ త్రైలోక్య కుటుంబినీం సరసిజామ్ వందే ముకుంద ప్రియామ్!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, ధ్యాయామి!
----------------------------------
*ఆవాహనం:-*
-----------------------------------
సర్వమంగళ మాంగళ్యే విష్ణువక్షస్థలాలయే!
ఆవాహయామి దేవీత్వామ్ సుప్రీతా భవసర్వదా!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, ఆవాహయామి!
----------------------------------
*ఆసనమ్:-*
-----------------------------------
సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే!
సింహాసనమిదం దేవీ గృహ్యతాం సురపూజితే!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, రత్నఖచిత సింహాసనం సమర్పయామి.
-----------------------------------
*పాద్యమ్:-*
-----------------------------------
సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవమ్!
పాద్యం గృహాణ దేవీ త్వం సర్వదేవ నమస్కృతే!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, పాదయోః పాద్యం సమర్పయామి!
----------------------------------
*అర్ఘ్యమ్:-*
-----------------------------------
శుద్ధోదకమ్ చ పాత్రస్థం గంధపుష్పాది మిశ్రితమ్!
అర్ఘ్యం దాస్యామి తే దేవీ గృహాణ సురపూజితే!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః,హస్తయోః అర్ఘ్యం సమర్పయామి!
-----------------------------------
*ఆచమనీయం:-*
-----------------------------------
సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతమ్!
గృహానాచమనం దేవీ మయాదత్తం శుభప్రదే!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, ముఖే ఆచమనీయం సమర్పయామి
----------------------------------
*పంచామృత స్నానం:-*
-----------------------------------
పయోదధి ఘృతోపేతం శర్కరా మధుసంయుతమ్!
పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, పంచామృత స్నానం సమర్పయామి
----------------------------------
*శుద్ధోదక స్నానం:-*
----------------------------------
గంగాజలం మయానీతం మహాదేవ శిరస్థితమ్!
శుద్ధోదక స్నానమిదం గృహాన హరివల్లభే!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, శుద్ధోదక స్నానం సమర్పయామి
----------------------------------
*వస్త్రం:-*
-----------------------------------
సురార్చితాంఘ్రి యుగళేదుకూల వసనప్రియే!
వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాన భువనేశ్వరీ!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, వస్త్రయుగ్మం సమర్పయామి
-----------------------------------
*యజ్ఞోపవీతం:-*
-----------------------------------
తప్తహేమకృతం సూత్రం ముక్తాదామ విభూషితమ్!
ఉపవీతమిదం దేవీ గృహాణ త్వం శుభంకరీ!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, యజ్ఞోపవీతం సమర్పయామి
-----------------------------------
*గంధం:-*
------------------------------------
కర్పూరాగరు కస్తూరీ రోచనాదిభిరన్వితమ్!
గంధం దాస్యామ్యహం దేవీ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, గంధం విలేపయామి
----------------------------------
*అక్షతలు:-*
-----------------------------------
అక్షతాన్ ధవళాన్ దేవీ శాలీయాన్ తండులాన్ శుభాన్!
హరిద్రాకుంకుమోపేతం గృహ్యతామబ్ధిపుత్రికే!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, అక్షతాన్ సమర్పయామి
------------------------------------
*ఆభరణం:-*
------------------------------------
కేయూర కంకణే దివ్యే హారనూపుర మేఖలాః!
విభూషణాన్యమూల్యాని గృహాణ ఋషిపూజితే!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, ఆభరణాని సమర్పయామి
----------------------------------
*పుష్పం:-*
----------------------------------
మల్లికాజాజి కుసుమైః చంపకైర్వకుళైస్తథా!
శతపత్రైశ్చ కల్హారైః పూజయామి హరిప్రియే!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, పుష్పైః పూజయామి
-----------------------------------
అథాంగపూజా!
ఓం చంచలాయై నమః పాదౌ పూజయామి
ఓం చపలాయై నమః జానునీ పూజయామి
ఓం పీతాంబదధరాయై నమః ఊరుం పూజయామి
ఓం కమలవసిన్యై నమః కటిం పూజయామి
ఓం పద్మాలయాయై నమః నాభిం పూజయామి
ఓం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి
ఓం లలితాయై నమః భుజద్వయం పూజయామి
ఓం కంబుకంఠ్యై నమః కంఠం పూజయామి
ఓం సునాసికాయై నమః నాసికాం పూజయామి
ఓం సుముఖ్యై నమః ముఖం పూజయామి
ఓం శ్రియై నమః ఓష్ఠౌ పూజయామి
ఓం సునేత్రే నమః నేత్రం పూజయామి
ఓం రమాయై నమః కర్ణౌ పూజయామి
ఓం కమలాయై నమః శిరః పూజయామి
ఓం వరలక్ష్మ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి
శ్రీ మహాలక్ష్మీ ప్రీత్యర్థం అష్టోత్తర శతనామ పూజాం కరిష్యే
అని సంకల్పము చేసి అష్టోత్తర నామపూజ పసుపు కుంకుమలతో గాని, పుష్పములతో గానీ చేయవలెను.
------------------------------------
శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళిః
------------------------------------
ఓం ప్రకృత్యై నమః
ఓం వికృత్యై నమః
ఓం విద్యాయై నమః
ఓం సర్వభూతహితప్రదాయై నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం విభూత్యై నమః
ఓం సురభ్యై నమః
ఓం పరమాత్మికాయై నమః
ఓం వాచే నమః
ఓం పద్మాలయాయై నమః (10)
------------------------------------
ఓం పద్మాయై నమః
ఓం శుచ్యై నమః
ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓం హిరణ్మయ్యై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్యై నమః (20)
----------------------------------
ఓం అదిత్యై నమః
ఓం దిత్యై నమః
ఓం దీప్తాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణ్యై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం కామాక్ష్యై నమః
ఓం క్రోధసంభవాయై నమః
ఓం అనుగ్రహపరాయై నమః (30)
------------------------------------
ఓం ఋద్ధయే నమః
ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోకాయై నమః
ఓం అమృతాయై నమః
ఓం దీప్తాయై నమః
ఓం లోకశోక వినాశిన్యై నమః
ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓం లోకమాత్రే నమః (40)
-----------------------------------
ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓం పద్మాక్ష్యై నమః
ఓం పద్మసుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓం పద్మముఖ్యై నమః
ఓం పద్మనాభప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓం పద్మమాలాధరాయై నమః
ఓం దేవ్యై నమః (50)
----------------------------------
ఓం పద్మిన్యై నమః
ఓం పద్మగంథిన్యై నమః
ఓం పుణ్యగంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖ్యై నమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓం చంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః (60)
------------------------------------
ఓం చంద్రరూపాయై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం ఇందుశీతులాయై నమః
ఓం ఆహ్లోదజనన్యై నమః
ఓం పుష్ట్యై నమః
ఓం శివాయై నమః
ఓం శివకర్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః (70)
------------------------------------
ఓం తుష్ట్యై నమః
ఓం దారిద్ర్య నాశిన్యై నమః
ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః
ఓం శాంతాయై నమః
ఓం శుక్లమాల్యాంబరాయై నమః
ఓం శ్రియై నమః
ఓం భాస్కర్యై నమః
ఓం బిల్వనిలయాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యై నమః (80)
------------------------------------
ఓం వసుంధరాయై నమః
ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓం హేమమాలిన్యై నమః
ఓం ధనధాన్య కర్యై నమః
ఓం సిద్ధయే నమః
ఓం స్త్రైణ సౌమ్యాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం నృపవేశ్మ గతానందాయై నమః
ఓం వరలక్ష్మ్యై నమః (90)
-----------------------------------
ఓం వసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓం హిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్ర తనయాయై నమః
ఓం జయాయై నమః
ఓం మంగళాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం విష్ణు వక్షఃస్థల స్థితాయై నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓం ప్రసన్నాక్ష్యై నమః (100)
-----------------------------------
ఓం నారాయణ సమాశ్రితాయై నమః
ఓం దారిద్ర్య ధ్వంసిన్యై నమః
ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః
ఓం త్రికాల ఙ్ఞాన సంపన్నాయై నమః
ఓం భువనేశ్వర్యై నమః (108)
----------------------------------
శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి
----------------------------------
దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరమ్!
ధూపం దాస్యామి దేవేశీ గృహ్యతాం పుణ్యగంధినీ!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, ధూపమాఘ్రాపయామి
--------------------------------
అగరువత్తి వెలిగించి ధూపము చూపవలెను
--------------------------------
ఘృతాక్తవర్తి సంయుక్తం అంధకార వినాశకమ్!
దీపం దాస్యామి తేదేవీ గృహాణ ముదితోభవ!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, దీపం దర్శయామి
----------------------------------
(దీపము చూపవలెను)
-----------------------------------
నైవేద్యం షడ్రసోపేతం దధిమద్వాజ్య సంయుతం!
నానాభక్ష్య ఫలోపేతం గృహాణ హరివల్లభే!!
-------------------------------
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, నైవేద్యం సమర్పయామి
--------------------------------
నివేదనము చేసి నీటిని వదలవలెను.
---------------------------------
పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతమ్!
కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్!!
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, తాంబూలం సమర్పయామి
నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితమ్!
తుభ్యం దాస్యామ్యహం దేవీ గృహ్యతాం విష్ణువల్లభే!!
---------------------------------
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, అనందమంగళ నీరాజనం సందర్శయామి
----------------------------------
నీరాజనానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి
పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే
నారాయణ ప్రియే దేవీ సుప్రీతో భవసర్వదా!!
------------------------------
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః,మంత్రపుష్పాణి సమర్పయామి
పుష్పము అక్షతలు ఉంచవలెను
------------------------------
యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ!
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే!!
--------------------------------
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, ప్రదక్షిణం సమర్పయామి
---------------------------------
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ
త్రాహిమాం కృపయాదేవీ శరణాగత వత్సలే!!
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణమ్ మమ!
తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష జనార్దనీ!!
నమస్త్రైలోక్య జననీ నమస్తే విష్ణు వల్లభే
పాహిమాం భక్తవరదే వరలక్ష్మీ నమోనమః!!
---------------------------------
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, నమస్కారాన్ సమర్పయామి
---------------------------------
తోరగ్రంథి పూజా!
---------------------------------
ఓం కమలాయై నమః - ప్రథమ గ్రంథిం పూజయామి
రమాయై నమః - ద్వితీయ గ్రంథిం పూజయామి
లోకమాత్రే నమః - తృతీయ గ్రంథిం పూజయామి
విశ్వజనన్యై నమః - చతుర్థ గ్రంథిం పూజయామి
వరలక్ష్మీ నమః - పంచమ గ్రంథిం పూజయామి
క్షీరాబ్ధి తనయాయై నమః - షష్ఠమ గ్రంథిం పూజయామి
విశ్వసాక్షిణ్యై నమః - సప్తమ గ్రంథిం పూజయామి
చంద్ర సహోదర్యై నమః - అష్టమగ్రంథిం పూజయామి
వరలక్ష్మ్యై నమః - నవమ గ్రంథిం పూజయామి
-----------------------------------
ఈ క్రింది శ్లోకము చదువుతూ తోరము కట్టుకొనవలెను.
------------------------------------
శ్లో!! బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం
పుత్రపౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే

వరలక్ష్మీ వ్రత కథ
సూత పౌరాణికుండు శౌనకుడు మొదలగు మహర్షులను జూచి యిట్లనియె – మునివర్యులారా! స్త్రీలకు సర్వ సౌభాగ్యములు గలుగునట్టి యొక వ్రతరాజంబును పరమేశ్వరుడు పార్వతీదేవికి జెప్పె దానిం చెప్పెద వినుండు, కైలాస పర్వతమున వజ్ర వైడూర్యాది మణిమయ ఖచితంబగు సింహాసనంబునందు పరమేశ్వరుడు కూర్చుండి యుండ పార్వతి పరమేశ్వరునకు నమస్కరించి దేవా! లోకమున స్త్రీలు యే వ్రతం బొనర్చిన సర్వ సౌభాగ్యంబులు, పుత్ర పౌత్రాదులం గలిగి సుఖంబుగ నుందురో అట్టి వ్రతం నా కానతీయవలయు” ననిన పరమేశ్వరుండిట్లనియె. ఓ మనోహరీ! స్త్రీలకు పుత్రపౌత్రాది సంపత్తులు గలుగంజేయం వరలక్ష్మీ వ్రతంబను నొక వ్రతంబు గలదు. ఆ వ్రతంబును శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగ వచ్చెడి శుక్రవారము నాడు జేయవలయుననిన పార్వతీదేవి యిట్లనియె. ఓ లోకారాధ్యా! నీ వానతిచ్చిన వరలక్ష్మీ వ్రతంబు నెట్లు చేయవలెను? ఆ వ్రతంబునకు విధియేమి? ఏ దేవతను పూజింపవలయును? పూర్వం బెవ్వరిచే నీ వ్రతంబాచరింపబడియె? దీనినెల్ల వివరంబుగా వివరింపవలయునని ప్రార్థించిన పరమేశ్వరుడు పార్వతీదేవిని గాంచి ఓ కాత్యాయనీ! వరలక్ష్మీ వ్రతమును సవిస్తరముగ జెప్పెద వినుము. మగధ దేశంబున కుండినంబను నొక పట్టణము గలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారముల తోడను, బంగారు గోడలు గల యిండ్లతోనూ గూడియుండెను. అట్టి పట్టణము నందు చారుమతి యనునొక బ్రాహ్మణ స్త్రీ గలదు. ఆ వనితామణి భర్తను దేవునితో సమానముగ దలచి ప్రతి దినంబును ఉదయంబున మేల్కాంచి స్నానంబుచేసి పుష్పంబులచే భర్తకు పూజచేసి పిదప అత్తమామలకు ననేక విధంబులైన యుపచారంబులను చేసియు ఇంటి పనులను జేసికొని మితముగా ప్రియముగాను భాషించుచుండెను. ఇట్లుండ అమ్మహా పతివ్రతయందు వరలక్ష్మికి అనుగ్రహము గలిగి యొకనాడు స్వప్నంబున ప్రసన్నమై “ఓ చారుమతీ, నేను వరలక్ష్మీ దేవిని. నీయందు నాకు అనుగ్రహము గలిగి ప్రత్యక్షమైతిని. –శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చెడి శుక్రవారమునాడు నన్ను పూజించిన నీవు కోరిన వరంబులు నిచ్చెదనని వచించిన చారుమతీ దేవి స్వప్నములోనే వరలక్ష్మీ దేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి ‘నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయే!
శరణ్యే త్రిజగద్వంద్వే విష్ణు వక్షస్థలాలయే!! అని అనేక విధంబుల స్తోత్రము చేసి ఓ జగజ్జననీ! నీ కటాక్షంబు కలిగెనేని జనులు ధన్యులుగను, విద్వాంసులుగను సకల సంపన్నులు గను నయ్యెదరు. నేను జన్మాంతరంబున జేసిన పుణ్య విశేషమున మీ పాదదర్శనము నాకు గలిగినదని జెప్పిన వరలక్ష్మీ సంతోషంబు జెంది, చారుమతికి ననేక వరములిచ్చి యంతర్థానంబు నొంద చారుమతి తక్షణంబున నిదుర మేల్కొని యింటికి నాలుగు ప్రక్కలం జూచి వరలక్ష్మీ దేవిని గానక ఓహో! మనము కలగంటిమని స్వప్న వృత్తాంతము భర్తకు మామగారికి మొదలయిన వాండ్రతో జెప్పగా వారు ఈ స్వప్నము మిగుల ఉత్తమమయినదని శ్రావణ మాసంబు వచ్చినతోడనే వరలక్ష్మీ వ్రతం బావశ్యంబుగ జేయవలసిందని జెప్పిరి.
------------------------------------
చారుమతి స్వప్నంబు విన్న స్త్రీలును శ్రావణమాసం ఎప్పుడు వచ్చునాయని ఎదురు చూచుచుండిరి. ఇట్లుండగా వీరి భాగ్యోదయంబు వలన శ్రావణ మాస పూర్ణిమకు ముందు వచ్చెడి శుక్రవారము వచ్చెను. అంత చారుమతియు మొదలగు స్త్రీలందరును ఈ దినంబే గదా వరలక్ష్మీ దేవి చెప్పిన దినంబని యుదయంబుననే మేల్కాంచి స్నానాదుల జేసి చిత్ర వస్త్రంబులను గట్టుకొని చారుమతీదేవి గృహంబున నొక ప్రదేశమునందు గోమయంబుచే నలికి మంటపం బేర్పరచి యందొక ఆసనంబువైచి దానిపై కొత్తబియ్యం బోసి మర్రి చిగుళ్ళు మొదలగు పంచపల్లవంబులచేత కలశంబేర్పరచి యందు వరలక్ష్మీదేవిని ఆవాహనము చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిగుల భక్తియుక్తులై సాయంకాలంబున “పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే! నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవసర్వదా!!” అను శ్లోకముచే ధ్యానావాహనాది షోడశోపచార పూజలం చేసి తొమ్మిది సూత్రములు గల తోరంబును దక్షిణహస్తమునకు గట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజ్యంబులను నివేదన జేసి ప్రదక్షిణము జేసిరి. ఇట్లొక ప్రదక్షిణము జేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్ళయందు ఘల్లుఘల్లుమను నొక శబ్దము కలిగెను. అంత కాళ్ళకు జూచుకొనిన గజ్జెలు మొదలగు నాభరణములు కలిగియుండ చారుమతి మొదలగు స్త్రీలందరునూ ఓహో! వరలక్ష్మీదేవి కటాక్షం వలన గల్గినవని పరమానందంబు నొంది మరియొక్క ప్రదక్షిణంబు జేయగా హస్తములందు దగద్ధగాయమానంబుగా మెరయుచుండ నవరత్న ఖచితంబులైన నాభరణములుండుట గనిరి. ఇంక చెప్పనేల మూడవ ప్రదక్షిణంబు గావించిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వభూషణాలంకృతులైరి. చారుమతి మొదలగు నా స్త్రీల గృహంబులెల్ల స్వర్ణమయంబులై రథ గజ తురగ వాహనములతో నిండియుండెను. అంత నా స్త్రీలను దోడ్కొని గృహంబులకు పోవుటకు వారి వారి యిండ్లనుండి గుర్రములు, ఏనుగులు, రథములు బండ్లును నా స్త్రీలు వరలక్ష్మీదేవిని పూజించి స్థలమునకు వచ్చి నిలిచియుండెను. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు కల్పోక్తప్రకారముగా పూజచేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్పాక్షతలచే పూజించి పండ్రెండు కుడుములు వాయన దానం ఇచ్చి దక్షిణ తాంబూలము లొసంగి నమస్కారము చేసి ఆ బ్రాహ్మణోత్తమునిచే నాశీర్వాదంబు నొంది వరలక్ష్మీదేవికి నివేదన చేసి భక్ష్యాదులను బంధువులతో నెల్లరను భుజించి తమకొరకు వచ్చి కాచుకొని యుండు వాహనములపై యిండ్లకు బోవుచు ఒకరితో నొకరు ఓహో! చారుమతీదేవి భాగ్యంబేమని చెప్పవచ్చు. వరలక్ష్మీదేవి తనంతట స్వప్నములోకి వచ్చి ప్రత్యక్షం బాయెను. ఆ చారుమతీదేవి వలన కదా మనకిట్టి మహాభాగ్యం, సంపత్తులు గలిగెనని చారుమతీ దేవిని మిక్కిలి పొగుడుచు తమ తమ యిండ్లకు బోయిరి. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరంబును నీ వ్రతంబును చేయుచు పుత్రపౌత్రాభివృద్ధి గలిగి, ధనకనక వస్తు వాహనములతోడ గూడుకొని సుఖంబుగా నుండిరి. కావున ఓ పార్వతీ! యీ యుత్తమమైన వ్రతమును బ్రాహ్మణాది నాలుగు జాతుల వారును చేయవచ్చును. అట్లొనర్చిన సర్వ సౌభాగ్యంబులను గలిగి సుఖంబుగ నుందురు. ఈ కథను వినువారలకును, చదువు వారలకును వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును.
--------------------------------
*వాయన దానము:-*
--------------------------------
శ్లో!! ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం స్వశక్తితః!
దాతవ్యం ద్వాదశాపూపం వాయనం హిద్విజాతయే!!
---------------------------------
శ్లో!! ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరావై దదాతిచ
ఇందిరా తారకో బాభ్యాం ఇందిరాయై నమోనమః!!

Tuesday, 12 May 2026

శ్రీ హనుమ జయంతి వేడుకలు

శ్రీ హనుమాన్ జన్మోత్సవo, మే,12 తేదీ (జయంతి కాదు) వస్తున్నదనీ అందరికీ ముకుళిత హస్తాలతో నేను ఒక ప్రత్యేక విన్నపం చేస్తున్నాను 🙏🏻* ************************* *మనము అందరము దీనిని జయంతి అని కాకుండా హనుమాన్ జన్మోత్సవo అని పిలవమని అందరిని ప్రోత్సహించండి ఎందుకంటే ఈ లోకంలో లేని వారికి జయంతి జరుపుకుంటారు మరియు కలియుగంలో కేవలం శ్రీరామ భక్తుడు హనుమ మాత్రమే చిరంజీవి నేటికీ ఉనికి లో ఉన్నారు కావున మనం తప్పక ఈ మార్పును తీసుకురావాలి మరియు ఈ సందేశం శ్రీ హనుమాన్ జన్మోత్సవo గురువారం(12 /05/26) లోపల అందరికీ చేరాలా నేను మిమ్మల్ని సవినయంగా అభ్యర్థిస్తున్నాను ఈ సందేశాన్ని కనీసం మీ గ్రూపులలో పంపండి*
************************* *జై శ్రీరామ్ జై జై శ్రీరామ్* *హనుమాన్ జన్మోత్సవo*
  ---------------------------------- *ఆంజనేయమంగళాష్టకం* 
**********************
*వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే |*
*పూర్వాభాద్రప్రభూతాయ మంగళం శ్రీహనూమతే || ౧ ||*
*************************
*కరుణారసపూర్ణాయ ఫలాపూపప్రియాయ చ |*
*మాణిక్యహారకంఠాయ మంగళం శ్రీహనూమతే || ౨ ||*
*************************
*సువర్చలాకళత్రాయ చతుర్భుజధరాయ చ |*
*ఉష్ట్రారూఢాయ వీరాయ మంగళం శ్రీహనూమతే || ౩ ||*
************************
*దివ్యమంగళదేహాయ పీతాంబరధరాయ చ |*
*తప్తకాంచనవర్ణాయ మంగళం శ్రీహనూమతే || ౪ ||*
*************************
*భక్తరక్షణశీలాయ జానకీశోకహారిణే |*
*జ్వలత్పావకనేత్రాయ మంగళం శ్రీహనూమతే || ౫ ||*
*************************
*పంపాతీరవిహారాయ సౌమిత్రిప్రాణదాయినే |*
*సృష్టికారణభూతాయ మంగళం శ్రీహనూమతే || ౬ ||*
*************************
*రంభావనవిహారాయ గంధమాదనవాసినే |*
*సర్వలోకైకనాథాయ మంగళం శ్రీహనూమతే || ౭ ||*
*************************
*పంచాననాయ భీమాయ కాలనేమిహరాయ చ |*
*కౌండిన్యగోత్రజాతాయ మంగళం శ్రీహనూమతే || ౮ ||*
*************************
*కేసరీపుత్ర దివ్యాయ సీతాన్వేషపరాయ చ |*
*వానరాణాం వరిష్ఠాయ మంగళం శ్రీహనూమతే* 
--------------------------------------
*🙏🏻శ్రీరామ భక్త హనుమాన్ కి జై* *🙏🏻రేపు శ్రీ హనుమాన్ జన్మోత్సవo🙏🏻*
*************************
*హనుమంతుని జీవితం గురించి వివిధ గాథలు ప్రచారంలో ఉన్నాయి.* *ప్రధానంగా రామాయణంలో హనుమంతుడు శ్రీరాముని బంటుగానే ప్రస్తావింపబడింది. కొన్ని పురాణాలు ,* *ఉపనిషత్తులు , సంప్రదాయ గాథలలో మరికొన్ని విషయాలు , కథలు ఉన్నాయి. ఇక జానపద సాహిత్యంలోనూ , వివిధ స్థలపురాణాలలోనూ కొల్లలుగా గాథలున్నాయి. ఈ వ్యాసంలో ప్రధానంగా వాల్మీకి రామాయణ ఇతివృత్తమైన గాథ క్లుప్తంగా ఇవ్వబడింది.*
*************************
*జననం*
*************************
*పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను. అతని తల్లి అంజన కథతో సంబంధం కలిగి ఉన్నది. అంజన అనే ఆడ వానరం మరియు కేసరి అనే పురుష వానరం యొక్క కుమారునిగా జన్మించాడు. గతంలో అంజన బ్రహ్మ న్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేది. ఆమె బాల్యంలో ఒక ముని తపోభంగం కలిగించినందుకు శపించబడింది. ఆమె బాల్యంలో , కాళ్ళు ముడుచుకుని ధ్యానంచేసుకుంటున్న వానరాన్నిని చూసి , ఆశ్చర్యంతో ఉత్సాహభరితంగా , చిన్నపిల్ల అయిన అంజన వానరం పైన పండ్లు విసిరింది.*
*************************
*హఠాత్తుగా ధ్యానానికి భంగం కలిగిన వానరం రూపంలో ఉన్న ముని నిజరూపం పొంది , కోపంతో అంజనను , ఆమె ఎవరితోనైన ప్రేమలో పడిన్నప్పుడు వానరంగా మారమని శాపం ఇచ్చాడు. అంజన చేసిన తప్పు తెలుసుకుని ఆ మునిని క్షమాభిక్ష పెట్టమని యాచించింది మరియు ఆ ముని శాంతపడి ఆమె వానర రూపంలో ఉన్నా , ఆమెను ఎవరైతే ఇష్టపడతారో మరియు శివుని అవతారమైన శిశువుకు ఆమె జన్మ ఇచ్చినప్పుడు ఆమె శాపం నుండి విడుదల అవుతుందని వరమిచ్చాడు.* 
*************************
*అందువలన శాపవిమోచనానికి అంజన భూమిపైన జన్మించింది. అడవిలో నివాసం ఏర్పరచుకున్న అంజన ఒక రోజు ఒక పురుషుడిని చూసింది మరియు ఆమె అతనితో ప్రేమలో పడింది. ఆమె ప్రేమలో పడిన క్షణం నుండి , వెంటనే ఆమె వానర రూపంలోకి మారింది. ఆ మనిషి అంజన వద్దకు వచ్చి తన నామధేయం 'కేసరి' అని , వానారములకు రాజును అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. అంజన వానర ముఖం కలిగి ఉన్నా అతనిని చూసి ఆశ్చర్యపోయింది మరియు ఇచ్ఛానుసారం వానరం మరియు మానవరూపాలను మార్చుకోగలిగిన శక్తి గల అతనిని చూసి అబ్బురపడింది.*
*************************
*అతను తనను వివాహమాడమని అంజనను కోరాడు. అంజన మరియు కేసరి ఆ అడవిలోనే వివాహం చేసుకున్నారు. అంజన శివుడికి పూజలు జరిపి తపస్సు చేసింది. సంతోషించిన శివుడు ఆమెను కోరిక కోరుకోమన్నాడు. అంజన , ముని శాపవిమోచనం కోసం శివుడిని తన కుమారుడిగా జన్మించమని కోరుకున్నది. శివ ఆమె అభ్యర్థనను ఆమోదించాడు.*
*************************
*ఇంకో వైపు దశరధుడు , అయోధ్య రాజు సంతానం కోసం పుత్రకామేష్టి యజ్ఞం నిర్వర్తిస్తున్నాడు. తృప్తిచెందిన అగ్నిదేవుడు రాజుకు పవిత్రమైన పాయసం ఇచ్చాడు మరియు దైవాంశసంభూతులైన సంతానం కోసం ఆ పాయసాన్ని అతని భార్యలకు పంచిపెట్టమని చెప్పాడు. రాజు , అతని పెద్ద భార్య అయిన కౌసల్యకు ఒక భాగం ఇచ్చాడు. ఆ పవిత్ర పాయస భాగాన్ని ఒక గాలిపటం దూరంగా తీసుకెళ్ళింది.*
*************************
*ఆ గాలిపటం ఆ పాయసభాగాన్ని(తీపి ఆహారము) అంజన తపస్య స్థలంలో పడవేసింది. మహాదేవుడు , అంజనా చేతుల్లో ఆ పాయసాన్ని ఉంచమని వాయు , గాలి దేవుడిని ఆజ్ఞాపించాడు. పాయసాన్ని చూసిన అంజన అది శివుని దీవేనలుగా భావించి సంతోషంగా ఆమె దానిని త్రాగింది.*
*************************
*ఆమె వానర ముఖంగల శివుని అవతారమైన శిశువుకి జన్మ ఇచ్చింది మరియు ఈ బాలుడు అంజనాదేవికి జన్మించటం వలన ఆంజనేయుడని , కేసరినందనుడని , వాయుపుత్ర లేదా పవనపుత్ర అంటే వాయువు యొక్క కుమారుడని వివిధ పేర్లతో ప్రసిద్ధి చెందాడు. తన బాల్యదశలో కూడా హనుమాన్ చాలా శక్తివంతమైనవాడు. అతను , తన తండ్రిఅయిన కేసరి , తల్లి , అప్సర అంజన యొక్క శక్తి , వాయువేగం గలవాడు. హనుమాన్ జననం వలన అంజన శాపవిమోచనం పొందింది మరియు స్వర్గం తిరిగివెళ్ళింది.*
*************************
*భక్తులెందరో హనుమంతుణ్ణి ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు. అతణ్ణి మహాహలుడు , బుద్ధిశాలి , కపిశ్రేష్టుడు , సర్వశాస్త్ర పారంగతుడు , స్వామిభక్తి పరాయణుడు , రామదూత అంటూ ఎన్నోవిధాలుగా ప్రస్తుతిస్తారు. తల్లి అంజనాదేవి కనుక అతణ్ని ఆంజనేయుడంటారు. అతని తండ్రి ఎవరనే విషయంలో శివమహాపురాణం , రామాయణం , పరాశరసంహిత మొదలైన గ్రంథాల్లోని వైవిధ్యగాథలతో అతడి దివ్యజననం ముడిపడి ఉంది.*
*************************
*హనుమాన్ , ఏడుగురు చిరంజీవులలో ఒకడు మరియు శ్రీరాముడికి ప్రచండమైన భక్తుడు. అతను లంక రాజు , రావణుడి బారి నుండి సీతను కాపాడి తిరిగి శ్రీ రాముడికి అప్పగించాడు. హనుమాన్ కథ , మన జన్మ యొక్క రహస్యం , శక్తి గురించి తెలుసుకోవటంలో మనకు సహాయపడుతుంది.*
************************
*జన్మతః బలసంపన్నుడు అయిన ఆంజనేయుడు ఒకమారు ఉదయించుచున్న సూర్యబింబమును చూచి పండు అనుకొని తినుటకు ఆకాశమునకెగిరెను. అప్పుడు జరిగిన ఘటనలలో ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ బాలుని దవడ (హనుమ) పై కొట్టెను. అలా కొట్టడం వల్ల ఆ బాలుని దవడకు చొట్ట పడినది. చొట్ట పడిన దవడ కలిగిన వాడవడం చేత హనుమంతుడనే పేరు వచ్చింది. తన కొడుకు దెబ్బ తిన్నందుకు ఆగ్రహించి , వాయుదేవుడు వీచటం మానివేశాడు. అపుడు బ్రహ్మాది దేవతలు హనుమంతున కనేక వరాలిచ్చి వాయుదేవుని శాంతింప జేశారు.*   
************************* *ఆంజనేయస్వామి అవతారాలు తొమ్మిది:*
*************************
*హనుమంతుడు కూడా దుష్టశిక్షణ , శిష్టరక్షణ కోసం అవతారాలు ఎత్తాడు. అవి తొమ్మిది. హనుమన్నవావతారాలంటారు. పరాశర సంహితలో పరాశర మహర్షి వాటిని వివరించడం జరిగింది.*
*************************
*1)ప్రసన్నాంజనేయస్వామి*
*2)వీరాంజనేయస్వామి*
*3)వింశతిభుజాంజనేయ స్వామి*
*4)పంచముఖాంజనేయ స్వామి*
*5)అష్టాదశ భుజాంజనేయస్వామి*
*6)సువర్చలాంజనేయ స్వామి*
*7)చతుర్భుజాంజనేయ స్వామి*
*8) ద్వాత్రింశాద్భుజాంజనేయస్వామి*
*9)వానరాకార ఆంజనేయస్వామి*
*తంత్రశాస్త్రంలో హనుమంతుణ్ణి ఆరాధిస్తే సమస్త క్షుద్రపీడలు పటాపంచలై పోతాయి.....!!!*
*************************
*దశమహావిద్యలతో సమానమైన శక్తి కలవాడు ఆంజనేయుడు. హనుమంతుడు తంత్రదేవతలందరిలోకి అధికుడు. ఆంజనేయునికి అష్టసిద్ధులు ఉన్న కారణంగా ఆయనను ఉపాసించిన వారికి మానవాతీత శక్తులు లభిస్తాయి.*
*************************
*ఆయన అష్టసిద్ధులు*
*************************
*1)అణిమాసిద్ధి : శరీర పరిమాణం ఆవగింజంత చిన్నదిగా చేసుకోగల శక్తి*
*************************
*2)మహిమాసిద్ధి : శరీర పరిమాణం పర్వతమంత పెంచుకోగల శక్తి*
*************************
*3)లఘిమాసిద్ధి : శరీరం బరువును నువ్వుగింజ కన్నా తక్కువ బరువుగా చేసే శక్తి*
************************* *4)గరిమ : శరీరం బరువును పర్వతమంత బరువు పెరిగేలా చేసే శక్తి*
*************************
*5)ప్రాప్తిసిద్ధి : ఎక్కడికైనా ప్రయాణించగల శక్తి.. దేనినైనా పొందగలిగే శక్తి*
*************************
*6)పరకామ్యసిద్ధి : ఎవరూ తగ్గించలేని ఆత్మబలాన్ని కలిగిఉండే శక్తి*
*************************
*7)వశిత్వసిద్ధి : అన్ని జీవులపైనా ఆధిపత్యాన్ని కలిగిఉండే శక్తి*
*************************
*8)ఈశిత్వసిద్ధి : దేనినైనా సృష్టించగల మరియు దేనినైనా నాశనం చేయగల శక్తి*
*************************
*శ్రీ హనుమంతుని ప్రదక్షిణాలు ఎలా చేయాలి* ?
*************************
*హనుమంతునకు ప్రదక్షిణములు ఇష్టం. ఏ దేవాలయానికి వెళ్ళినా మూడు ప్రదక్షిణాలు చెస్తాం. కాని హనుమంతుని ఆలయానికి వెళ్లినప్పుడు ఐదు ప్రదక్షిణాలు చేయాలి.* *'ప్రదక్షిణ , నమస్కారాన్, సాష్టాంగాన్, పంచ సంఖ్యాయా' అని ఆర్ష వాక్యం. మామూలుగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ప్రదక్షిణ శ్లోకాలు చదువు కోవాలి. సకల రోగ , భూతప్రేత పిశాచాది భాధలు తొలగుటకు , అభిష్టకి ప్రదక్షిణాలు సుప్రసిద్దాలు. ప్రదక్షిణాలు చేసి సంతానం పొందిన వారెందరో ఉన్నారు. కాబట్టి భక్తులను ఏ బాధలో ఉన్నా ప్రదక్షిణాలకు ప్రోత్సహించండి. నియమాలు పాటించటం ముఖ్యం. రోజు ఒకే మారు 108 లేదా 54 అదీ చేయలేనివారు 27 పర్యాయాలు చేయాలి. పుష్పములు. వక్కలు , పసుపుకొమ్మలు వంటి వాటిని లెక్కించడానికి వాడటం మంచిది. ప్రదక్షిణాలు చేస్తూ చదవాల్సిన ధ్యానం.*
*************************
*'శ్రీహనుమన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్'*
*************************
*శ్లో|| ఆంజనేయం మహావీరం - బ్రహ్మవిష్ణు శివాత్మకం*
*తరుణార్క ప్రభంశాంతం - రామదూతం నమామ్యహం*
*************************
*శ్లో|| మర్కటే శ మహొ త్సాహ - సర్వశోక వినాశన*
*శత్రూన్సంహర మాం రక్ష - శ్రియం దాపయ మే ప్రభో||*
*************************
*అని చదువు కొంటూ ప్రదక్షిణాలు చేయాలి. కోరిక మేరకు మండలం , అర్ధ మండలం కాని ప్రదక్షిణాలు చేసి చివరిలో స్వామికి విశేషార్చన జరిపించి*
*************************
*''యాకృత్తె రేభి: ప్రదక్షిణ ణై| శ్రీ సువర్చలా సమేత హనుమాన్ సుప్రిత స్సుప్రసంనో వరదో భూత్వా మామాభిష్ట సిద్దం దదాతు''*
*************************
*అని జలాన్ని అక్షతలతో వదలిపెట్టాలి. ప్రదక్షిణ కాలంలో బ్రహ్మచర్యం , శిర స్స్నానం , నేలపడక , సత్త్వికాహారం వంటి నియమాలు పాటించాలి.*
*************************
*ఆచరణ: భక్తులకు ఏ బాధలు కలిగినా నియమాలు చెప్పివారు ప్రదక్షిణాలు చేయునట్లు ప్రోత్సహించి వారి బాధలు స్వామిద్వారా తోలగునట్లు చేయాలి. హనుమత్ప్ర దక్షిణ ధ్యానం శీలాఫలకంపై చెక్కించి ఆలయాన అతికించాలి. మామూలుగా ఐదు ప్రదక్షిణాలు చేయమని భక్తులకు తెలపాలి.*
*************************
*అభిషేకం*
*************************
*పరమ వైష్ణవ శిఖామణి అయిన హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు కాబట్టి ఆయనకు అభిషేకం ఇష్టం. అందులోనూ మన్యు సూక్త అభిషేకిస్తే పరమానంద భరితుడు అవుతాడు , కోరికల్ని తీరుస్తాడు. స్వామి పుట్టిన నక్షత్రం పూర్వభాద్ర రోజు తప్పకుండా చేయాలి. వారం వారం , నిత్యమూ చేయగలగటం మరీ మంచిది.*
*************************
*ఆచరణ : మన్యుసూక్తం నేర్చుకొని భక్తులకు దాని విలువ తెలిపి ప్రతి పర్వదినానా దాతల ద్వారా అభిషేకం జరిపింపజేయాలి*
*************************
*మంగళ వార సేవ*
*************************
*మంగళవారంనాడు హనుమంతునకు శరీరంపై సింధూరం పూయటం చాల ఇష్టం. అంతా కుదురనివారు మూతికయినా తప్పక పూయాలి. సింధూరార్చన చేయటం , అరటి పండ్లు నివెదించటం చేయాలి. అందుకు కారణమైన విశేషగాధ ఉంది.*
************************ *శనివార సేవ*
*************************
*హనుమంతుడు శనివారం జన్మించాడు. కాబట్టి ఆయనకు శనివారం ఇష్టమైనది. నాడు యథాశక్తి విశేషార్చన , సహస్రనామాదికం చేయాలి. భక్తులచే అప్పాలు , వడ మాల వంటి విప్రోత్సహించి చే యించి స్వామికి సంతృప్తి కలిగించాలి.*
*************************
*పంచ సంఖ్య*
*************************
*హనుమంతుడు పంచ (ఐదు) సంఖ్య ఇష్టం కాబట్టి చెసే ప్రదక్షిణాలు , నమస్కారాలు ఐదు చేయాలి. అరటి పండ్లు వంటి ఏవయినా ఐదు సంఖ్యలలో సమర్పించుట స్వామికి ప్రీతికరం.*
*************************
*హనుమత్ జన్మోత్సవం*
*************************
*హనుమంతుడు వైశాఖ మాసంలో , కృష్ణ పక్షంలో , దశమితిథి పూర్వభాద్రా నక్షత్రం , శనివారం , కర్కాటక లగ్నంలో , వైదృతి యోగంలో జన్మిచాడు. ఇవి ఖగోళాది సకల ప్రమాణాలతో ఏ , కల్పంతర గాధలను బట్టి ఎవరో చేప్పారని భిన్న భిన్న తిథులలో హనుమత్ జన్మో త్సవం కొందరు జరుపుతున్నారు. సాధారణంగా మే నెలలో వచ్చే వైశాఖ బహుళ దశమినాడు తప్పక జన్మోత్సవం జరపాలి. వీటిని పంచాహ్మికంగా ఐదు రోజులు ఇలా శక్తి కొలది జరుపవచ్చు.*
*************************
*విశేషార్చనలు సామూహిక కార్యక్రమాలు నిర్వహించాలి.*
*************************
*ఆచరణ : సంవత్సరంలో ఈ ఒక్క జన్మోత్సవం నాడయినా భక్తులు మారేడుదళం , సింధూరం మల్లెపూలు లేదా తములపాకులు , తులసిదళం , ప్రోత్సహించి లక్షార్చన వంటి వాటితో జరిపించాలి.* ************************ *🙏🏻ఆంజనేయుని కుమారుడు🙏🏻* --------------------------------------
*మకరధ్వజుడు*
*************************
*హనుమంతుని ఆజన్మ బ్రహ్మచారిగా భక్తులు*
*భావిస్తారు .... కానీ ఆయనకే తెలియకుండా,* *హనుమంతునికి ఓ పుత్రుడు ఉండేవాడన్న వృత్తాంతం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది ... ఈ వృత్తాంతానికి మూలం లంకాదహనం సమయంలో కనిపిస్తుంది ... శ్రీరాముని* *దూతగా సీతను విడిపించమంటూ రావణాసురునికి నాలుగు ముక్కలు చెప్పేందుకు లంకకు చేరుకుంటాడు* *హనుమంతుడు , కానీ కామవశుడైన రావణాసురుడు, హనుమంతుని మాటను లెక్కచేయకపోగా...*
*అతని తోకను నిప్పంటించమని తన సైన్యానికి ఆదేశిస్తాడు ... నిప్పంటుకున్న తన తోకతో ఏకంగా లంకనే ముట్టిస్తాడు హనుమంతుడు. కానీ లంక నుంచి తిరిగివెళ్తూ, ఆ వేడి నుంచి ఉపశమనం* *లభించేందుకు సముద్రంలో కొంత సేపు మునిగి ఉండేందుకు నిశ్చయించుకుంటాడు .... హనుమంతుడు నీట మునగగానే అతని శరీరం నుంచి విడివడిన స్వేద బిందువు, ఓ జల కన్య నోటిలోకి ప్రవేశిస్తుంది ....*
*అదే ఆమె గర్భాన ఒక శిశువుగా మారుతుంది ....*
*ఇదేమీ గ్రహించని హనుమంతుడు తన దారిన తను వెళ్లిపోతాడు ....* *కొన్నాళ్లకి పాతాళలోకాన్ని ఏలే మైరావణుడి భటుల వలలో జలకన్య చిక్కుతుంది.... మైరావణుడికి ఆహారంగా ఆ జలకన్యను* *మోసుకుపోతారు అతని భటులు .... కానీ ఆమె*
*పొట్టను కోసి చూసిన వారు ఆశ్చర్యంలో*
*మునిగిపోతారు .... జలకన్య గర్భాన శక్తిమంతమైన*
*ఓ జీవి వారికి కనిపిస్తుంది .... సగం కోతి రూపంలోనూ, మరో సగం మకరంగానూ ఉన్న ఆ జీవికి మకరధ్వజురడు అని పేరు పెడతాడు*
*మైరావణుడు .... అంతేకాదు ! అతని శక్తిని*
*గమనించి తన రాజ్యానికి ద్వారపాలకునిగా కూడా* *నియమిస్తాడు .... రోజులు గడుస్తున్నాయి ...* *రామరావణుల మధ్య రాయబారాలు*
*బెడిసికొట్టడంతో యుద్ధం మొదలైంది ... యుద్ధం జరుగుతున్న కొద్దీ* *రామలక్ష్మణులది పైచేయి* 
*కాసాగింది ....దీంతో* *కంగారుపడిపోయిన రావణాసురుడు తన బంధువైన పాతాళాధిపతి మైరావణుడికి కబురు* *పంపాడు ....ఎలాగైనా హనుమంతుని కన్నుగప్పి రామలక్ష్మణులను* *పాతాళానికి తీసుకుపోయి బంధించమంటూ*
*అర్థించాడు .....రావణుడి కోరిక మేరకు మైరావణుడు మాయోపోయాలతో రామలక్ష్మణులను అపహరించి తన కోటలో బంధిస్తాడు ...వారిరువురినీ బలి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటాడు .....ఈలోగా రామలక్ష్మణుల జాడ* *తెలుసుకున్న హనుమంతుడు మైరావణపురానికి చేరుకుంటాడు ... అక్కడ మకరధ్వజునితో* *హనుమంతుడు* *తలపడాల్సిన సందర్భం*
*ఏర్పడుతుంది ....* *మకరధ్వజుని* *బలపరాక్రమాలను చూసిన హనుమంతుడు నువ్వు ఎవరి కుమారుడవు అని అడుగుతాడు ....దానికి తాను హనుమంతుని కుమారుడినని చెప్పడంతో ఆశ్చర్యపోతాడు* *హనుమంతుడు .... ఆపై అతని జన్మవృత్తాంతాన్ని తెలుసుకుని సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోతాడు .....* *అటువైపు మకరధ్వజునికి కూడా తన తండ్రిని కలుసుకున్నానన్న సంతోషం నిలువనియ్యదు ....*
*కానీ తన ప్రభువైన మైరావణుడికి మోసం చేయలేననీ, ఆయన ఆజ్ఞను జవదాటలేనని తేల్చిచెబుతాడు* *మకరధ్వజుడు .... తనను ఓడించిన తరువాతే కోట లోపలికి ప్రవేశించమని హనుమంతునితో సూచిస్తాడు ....*
*తన కుమారుని స్వామిభక్తికి అచ్చెరువొందుతూనే హనుమంతుడు అతనితో తలపడతాడు .... సుదీర్ఘకాలం సాగిన ఆ ద్వంద్వ యుద్ధంలో చివరికి హనుమంతుడు ఎలాగూ విజయం సాధిస్తాడు .... ఆపై కోట లోపలికి ప్రవేశించి మైరావణుని సంహరించి రామలక్ష్మణులను విడిపిస్తాడు ....* *హనుమంతుని నుంచి మకరధ్వజుని మాట విన్న రాములవారు, అతడిని పాతాళానికి అధిపతిగా నియమించి* *లంకకేగుతారు .....*
*ఇప్పటికీ క్షత్రియులలో కొందరు తాము మకరధ్వజునికి వారసులుగా భావిస్తారు ..... వారు పాలించిన రాజస్థాన్‌,* *గుజరాత్‌ వంటి ప్రాంతాలలో ఆయనకు ఆలయాలను నిర్మించి తన భక్తిని చాటుకున్నారు కూడా !*
*రాజస్థాన్‌లోని* 
 *అజ్మీర్‌కు దగ్గరలో,*
 *గుజరాత్‌లోని*
  *ద్వారకలో*
*మకరధ్వజుని ఆలయానికి ఇప్పటికీ భక్తులు అధిక సంఖ్యలో వస్తూనే ఉంటారు.*
*************************
*తండ్రిలాగే మకరధ్వజుడు కూడా తన శరణు కోరిన వారిని వెన్నంటి రక్షిస్తాడని భక్తుల నమ్మకం ! ఇదీ మకరధ్వజుని వృత్తాంతం !.. స్వస్తీ ... !!* ************************* *రేపు హనుమాన్ జన్మోత్సవం* *************************
*అసాధ్య సాధక స్వామిన్ అసాధ్య తవ కింవధ|*
*రామదూత కృప సింధో మత్కార్యం సాధ్యప్రభో||*
*************************
*హిందూ సంప్రదాయంలో ఎన్నో పండుగలున్నాయి.* *ఇందులో హనుమాన్ (జన్మోత్సవం) ముఖ్యమైన పండుగ. సందర్భంగా భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం చేయడంతో పాటు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు,రేపు, మే , 12 , గురువారం ఊరూరా, వాడవాడనా యావత్ దేశవ్యాప్తంగా వేడుకలు నేత్రపర్వంగా సాగుతాయి.*
*హిందువులు ఆంజనేయుడిని ధైర్యానికి ప్రతీకగా కొలుస్తారు. శక్తి సామర్థ్యాలకు ప్రతిరూపరంగా భావిస్తారు. సముద్ర లంఘించి లంకకు చేరి సీతమ్మవారి జాడ కనిపెట్టారు. సంజీవనీ పర్వతాన్నే పెలికించి తీసుకొచ్చి లక్ష్మణుడి ప్రాణాలను కాపాడారు స్వామివారు.*
********************
*మరికొందరు వైశాఖమాసం దశమినాడు ( రేపు మే 22) హనుమజ్జయంతిని జరుపుకుంటారు.*
*************************
*ఇక తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మార్గశిర మాసంలో నిర్వహిస్తారు.*
*************************
*నిజానికి పురాణాల ప్రకారం*
*************************
*హనుమాన్ ఇప్పటికీ భూమిపై భౌతికంగా ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి. హనుమంతుడు గంధమాదన్ పర్వతం మీద నివసిస్తున్నాడని నమ్ముతారు. అందుకే హనుమంతుడిని కలియుగ మేల్కొన్న దేవుడు అని పిలుస్తారు. మరణించిన వారి జన్మదినోత్సవం జరుపుకుంటారు.*
*కానీ హనుమంతుడు ఇప్పటికీ భూమిపై ఉన్నారు కాబట్టి అతని పుట్టినరోజును జన్మోత్సవం* *అని పిలవడం హనుమాన్ జయంతిని హనుమాన్ జన్మోత్సవంగా* 
*పిలుస్తారు.* ************************ *🙏🏻హనుమ లాంగూల స్తోత్రం🙏🏻*
*************************
*శ్రీమంతం హనుమంత మాత్త రిపుభి ర్భూభృత్తరు భ్రాజితం|*
*చాల్ప ద్వాలధిబధ్ధ వైరినిచయం చామీకరాది ప్రభం|*
*రోషా ద్రక్త పిశంగ నేత్ర నలినం భ్రూభంగ మంగస్ఫుర|*
*త్ర్పోద్య చ్చండమయూఖ మాండల ముఖం దుఃఖాపహం దుంఖినాం||*
*కౌపీనం కటిసూత్ర మౌంజ్యజినయు గ్దేహం విదేహాత్మాజా|*
*ప్రాణాధీశ పదారవింద నిహిత స్వాం తం కృతాంతం ద్విషాం|*
*ధ్యాత్వైవం సమరాంగణ స్థిత మథానీయ స్వహృత్పంకజే|*
*సంపూజ్యాఖిల పూజనోక్తవిధినా సంప్రార్ధయే త్ర్పార్ధితమ్||*
*************************
*🙏🏻శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం🙏🏻*
*************************
*శ్రీరామ జయరామ జయజయరామ*
*************************
*మాణిక్యం*
************************
*తతో రావణనీతాయాః సీతాయాః శత్రుకర్శనః |*
*ఇయేష పదమన్వేష్టుం చారణాచరితే పథి ౧*
*************************
*ముత్యం*
*************************
*యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథా తవ |*
*స్మృతిర్మతిర్ధృతిర్దాక్ష్యం స కర్మసు న సీదతి ౨*
************************* *ప్రవాలం*
*************************
*అనిర్వేదః శ్రియో మూలం అనిర్వేదః పరం సుఖమ్ |*
*అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తకః ౩*
*************************
 *మరకతం*
*************************
*నమోస్తు రామాయ సలక్ష్మణాయ*
*దేవ్యె చ తస్యై జనకాత్మజాయై* 
*నమోస్తు* *రుద్రేంద్రయమానిలేభ్యః*
  *నమోస్తు* *చంద్రార్కమరుద్గణేభ్యః ౪*
*************************
*పుష్యరాగం*
*************************
*ప్రియాన్న సంభవేద్దుఃఖం అప్రియాదధికం భయమ్ |*
*తాభ్యాం హి యే వియుజ్యంతే నమస్తేషాం మహాత్మనామ్ ౫* 
*************************
*హీరకం*
*************************
*రామః కమలపత్రాక్షః సర్వసత్త్వమనోహరః |*
*రూపదాక్షిణ్యసంపన్నః ప్రసూతో జనకాత్మజే ౬*
************************* *ఇంద్రనీలం*
*************************
*జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః |*
*రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః |*
*దాసోఒహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః |* 
*హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః ౭* 
*************************
 *గోమేధికం*
*************************
*యద్యస్తి పతిశుశ్రూషా యద్యస్తి చరితం తపః |*
*యది వాస్త్యేకపత్నీత్వం శీతో భవ హనూమతః ౮*
*************************
*వైడూర్యం*
*************************
*నివృత్తవనవాసం తం త్వయా సార్ధమరిందమమ్ |* 
*అభిషిక్తమయోధ్యాయాం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవమ్ ౯* 
*************************
*🙏🏻ఇతి శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రమ్🙏🏻 --------------------------🙏🏻హనుమాన్ సర్వస్వం🙏🏻*
-------------------------------------
*పరాశర సంహిత నుంచి సేకరించిన సమాచారం ప్రశ్నలు జవాబులు*
------------------------------------ *1) శ్రీ హనుమంతుని తల్లపేరు?*  
*జవాబు : అంజనా దేవి! --------------------------- 2) హనుమంతుని తండ్రి పేరు?*  
*జవాబు : కేసరి !* -------------------------------- *3) కేసరి పూర్వ జన్మలో ఎవరు?*---
*జవాబు : కశ్యపుడు !*  
----------------------------------- *4) అంజన పూర్వ జన్మలో ఎవరు?*
*జవాబు : సాధ్య !* ----------------------------------- *5) హనుమంతుని జన్మ తిథి ఏది?*
*జవాబు : వైశాఖ బహుళ దశమి!*
-----------------------------------       
 *6) హనుమంతుని జన్మ స్థలం ఏది?*
*జవాబు: తిరుమల ,అంజనాద్రి --------------------------- 7) హనుమంతుని నక్షత్రము ?*
*జవాబు :పూర్వాభాద్ర నక్షత్రం ----------------------- 8) హనుమంతుని జనన లగ్నం ?*
*జవాబు : కర్కటక ----------------------- 9) హనుమంతుడు ఏ యోగం లో పుట్టాడు ?*
*జవాబు : వైదృవీయోగం లో*
-------------------------------------- *10)హనుమంతుడు ఏ అంశతో పుట్టాడు ?*
*జవాబు : ఈశ్వరాంశ*
-----------------------------------       
*11) ఎవరి వరం వలన హనుమంతుడు పుట్టాడు ?* *జవాబు : వాయుదేవుని

Saturday, 25 April 2026

శ్రీ వాసవి కన్యక అష్టకం

శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అష్టకం
ఏప్రిల్ 26 ఆదివారం శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వర జయంతి సందర్భంగా...

నమో దేవ్యై సుభద్రా యై కన్యకాయై నమో నమః
శుభం కురు మహా దేవి వాసవ్యైచ నమో నమః || 1 ||

జయయై చంద్ర రూపాయై చండికాయై నమో నమః
శాంతి మావహ మనో దేవి వాసవ్యై తే నమో నమః ||2 ||

నందాయైతే నమస్తే స్తు గౌర్యై దెవ్యై నమో నమః
పాహిణః పుత్రదారాంశ్చ వాసవ్యై తే నమో నమః ||3 ||

అపర్ణాయై నమస్తే స్తు గౌర్యై దెవ్యై నమో నమః
నమః కమల హస్తాయై వాసవ్యై తే నమో నమః ||4 ||

చతుర్భుజాయై శర్వాణ్యై శుకపాణ్యై నమో నమః
సుముఖాయై నమస్తే స్తు వాసవ్యై తే కులాలయే ||5||

కమలాలయే నమస్తే స్తు విష్ణు నేత్ర కులాలయే
మృడాన్యైతే నమస్తే స్తు వాసవ్యై తే నమో నమః ||6 ||

నమః శీతల పాదాయై నమస్తే పరమేశ్వరి
శ్రియం నోదేహి మాతస్వమ్ వాసవ్యై తే నమో నమః || 7 ||

త్వత్పాద పద్మ విన్యాసం చంద్ర మండల శీతలం
గృహేషు సర్వదాస్మాకం దేహి శ్రీ పరమేశ్వరి || 8 ||

ఓం బాలారూపిణి విద్మహే | పరమేశ్వరి ధీమహి తనః కన్యా ప్రచోదయాత్ ||

🙏🙏🙏

Friday, 28 November 2025

కాలభైరవాష్టమి - (మార్గశిర శుధ్ధ అష్టమి)

కాలభైరవాష్టమి - (మార్గశిర శుధ్ధ అష్టమి)
*శ్లో॥ కాలాకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి।*
*తన్నో కాలభైరవ ప్రచోదయాత్॥*

*శ్రీ కాలభైరవస్వామి జన్మించిన రోజే కాలభైరవాష్టమి...*
----------------------------------------
*కాలభైరవస్వామి ఆవిర్భవానికి సంబంధించి శివపురాణంలో ఆసక్తికరమైన పురాణగాధ వుంది.
పూర్వం సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడికి శివుడికి మధ్య ఒక వివాదం ఏర్పడింది, బ్రహ్మదేవుడు మధ్యన వున్న తన ఐదవ శిరస్సుతో శివుడిని తూలనాడడం ప్రారంభించాడు.దీనితో కోపోద్రిక్తుడైన శివుడు హూంకరించాడు, ఆ హూంకారం నుంచి. ఒక భయంకర రూపం ఆవిర్భవించింది.*
*మహోన్నతకాయముతో... మూడు నేత్రాలతో త్రిశూలము, గద, ఢమరుకము వంటి వాటిని చేతులతో ధరించిన ఆ భయంకర రూపుడే -* *శ్రీకాలభైరవుడు.*
*శివుని  ఆజ్ఞ మేరకు కాలభైరవుడు బ్రహ్మదేవుడి ఐదు శిరస్సులలో మధ్యన వున్న ఐదవ శిరస్సును ఖండించాడు. దీనితో బ్రహ్మదేవుడి గర్వం అణిగిపోయింది...*
------------------------------------ *బ్రహ్మ శిరస్సును ఖండించిన కాలభైరవుడు తనకు చుట్టుకున్న బ్రహ్మహత్యాపాతకాన్ని పోగొట్టు కోవడానికి కాశీ చేరుకోగా ఆయన చేతికున్న బ్రహ్మ కపాలం కాశీలో మాయమైంది... అదే బ్రహ్మ కపాల తీర్థంగా ప్రసిద్ధి చెందింది...*
------------------------------------- *శక్తిసంపన్నుడైన కాలభైరవుడు ఉద్భవించిన రోజుని కాలభైరవ అష్టమిగా జరుపుకుంటూ వుంటారు. ఈ రోజున చాలా మంది ఆయన అనుగ్రహాన్ని కోరుతూ  కాలభైరవ వ్రతం చేస్తుంటారు. దగ్గరలో గల కాలభైరవ ఆలయాల్లో స్వామికి అభిషేకాలు నిర్వహిస్తారు, లేదంటే శివాలయాల్లోనే పూజాభిషేకాలు జరుపుతారు.*
----------------------------------------
*కాలభైరవుడు పరమేశ్వరుని యొక్క అంశ అందునా శివక్రోధము చేత జన్మించాడు... ఇతను కాలస్వరూపుడు, భయంకరమైన రూపం కలవాడు. సాధారణంగా కాలభైరవుడు నాలుగు చేతులతో దర్శన మిస్తాడు. నాలుగు చేతుల్లో శూలం,కపాలం, గద , మరియు ఢమరుకం , ఉంటాయి...*
---------------------------------------
*రౌద్రనేత్రాలు , పదునైన దంతాలు, మండే వెంట్రుకలు ఇదే కాలభైరవ స్వరూపం. కాలభైరవుడు నాగుపాములను ఆభరణాలుగా ధరిస్తాడు, ఈయన వాహనం శునకం.*
---------------------------------------
*శ్రీ శివమహా పురాణం ప్రకారం ప్రధానంగా భైరవుని రూపాలు ఎనిమిది...అవి*
---------------------------------------- *1) కాల భైరవ*
*2) అసితాంగ భైరవ*
*3) సంహార భైరవ*
*4) రురు భైరవ*
*5) క్రోధ భైరవ*
*6) కపాల భైరవ*
*7) రుద్ర భైరవ*
*8 ) ఉన్మత్త భైరవ*
--------------------------------------
*ఇవే కాక భీష్మ భైరవ, స్వర్ణాకర్షణ భైరవ, శంబర భైరవ, మహా భైరవ, చండ భైరవ అనే రూపాలు కుడా ఉన్నాయి.*
*స్వర్ణాకర్షణ భైరవుని పై సహస్రనామాలు కూడా ఉండడం విశేషం.

*భైరవుడంటే పోషకుడని, భయంకురడనే అర్ధాలు వస్తాయి.భైరవుని దగ్గర కాలుడు (కాలం) కూడా అణిగి ఉంటాడు కనుకనే కాళభైరవుడయ్యాడు, భైరవుణ్ణి  శరణు కోరితే మృత్యు భయం తొలగిపోతుంది.  ఈరోజు గంగాస్నానం, పితృతర్పణం, శ్రాద్ధకర్మలు ఆచరిస్తే ఏడాది మొత్తం లౌకిక, పార లౌకిక బాధల నుండి విముక్తి కలుగుతుంది. అలాగే భైరవుని వాహనమైన శునకానికి పాలు, పెరుగు, వంటివి ఆహారంగా ఇవ్వడం మంచిది.
*కాలభైరవుడిని కాశీ క్షేత్ర పాలకుడిగా కీర్తించారు, ఏది సాధించాలన్నా ముందుగా ఆయన అనుమతి తీసుకోవాలని కాశీక్షేత్ర మహిమ చెబుతుంది. సాక్షాత్తు శివుడే కాలభైరవుడే* *సంచరించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. హోమ కార్యాలలో అష్టాభైరవులకు ఆహుతులు వేసిన తరువాతే ప్రధాన హోమం చేస్తారు.భక్తులకు. అనుగ్రహాన్ని,అతీంద్రమైన శక్తులను ఆయన ప్రసాదిస్తారు, దేవాలయంలో ఆయనకి గారెలతో మాల వేస్తారు. కొబ్బరి, బెల్లం నైవేద్యంగా పెడతారు, ఈశ్వరుడు ఆయుష్షుని ప్రసాదిస్తాడు.*
---------------------------------------          *కాలభైరవాష్టమి*
---------------------------------------
*మార్గశిర బహుళ అష్టమి, శ్రీ కాలభైరవ స్వామి ఆవిర్భవించిన మార్గశిర బహుళ  అష్టమిని కాలభైరవాష్టమిగా పిలుస్తారు...*
*ఈ కాలభైరవ స్వామి పుట్టుకకు సంబంధించిన ఆసక్తికరమైన కథ శివపురాణం చెబుతుంది.ఒకసారి.* *శివబ్రహ్మలు మాట్లాడుకుంటున్నారు.* 
*ఆ మాటలు కాస్తా వాదోపవాదాలుగా మారాయి..*
*బ్రహ్మదేవుడు 'నేను సృష్టికర్తను... పరబ్రహ్మ స్వరూపుడను... నేను చెప్పినట్లుగానే మీరంతా నడుచుకోవాలి అన్నాడు.*
*దానికి శివుడు* *సమ్మతించలేదు.* 
*దాంతో వారి మధ్య వాదం పెరిగింది*. 
*సమస్య పరిష్కారం కొరకు శృతి ప్రమాణం కదా అందుకని వేదాలని పిలుద్దాం అని వేదాలని పిలిచారు.*
------------------------------------
*ఋగ్వేదం:-*
-------------------------------------- *అపుడు ఋగ్వేదం ఈ సమస్తమునకు సృష్టికర్త ఏ మహానుభావుడు సంకల్పం వలన మొట్ట మొదట నారాయణుడు జన్మించాడో ఎవరు చిట్ట చివర ఈ లోకములని తనలోకి తీసుకుంటున్నాడో అటువంటి ఆ పరమ శివుడు పర బ్రహ్మము అంది.*
------------------------------------
*యజుర్వేదము:-*
------------------------------------- *తరువాత యజుర్వేదమును పిలిచారు.అసుర శక్తులు పోయి ఈశ్వర శక్తులు రావడానికి జ్ఞానమును మహేశ్వరుడు ఇస్తాడు.* 
*కాబట్టి జ్ఞాన యజ్ఞము నందు ఆరాధింప బడుతున్నవాడు కనుక పరమశివుడే పరబ్రహ్మము అని చెప్పింది.*
-------------------------------------
*సామవేదము:-*
-------------------------------------- *తరువాత సామవేదమును పిలిచి అడిగారు మూడు కన్నులున్న వాడెవడు ఉన్నాడో ఎవరు ఈ లోకమునంతటినీ తిప్పుతున్నాడో ఆ తిప్పుతున్న వాడిని ఏ యోగులు ఉపాసన చేస్తున్నారో ఏ యోగులకి ఉపాసన చేత జ్ఞానమునందు తెలియబడుతున్నాడో ఎవరు తనలో తాను రమిస్తూ ఉంటాడో అటువంటి శివుడు పరబ్రహ్మము అని చెప్పింది.*
--------------------------------------
*అధర్వణవేదము:-*
--------------------------------------- *పిమ్మట అధర్వణ వేదము ఏ మహానుభావుడిని భక్తులందరూ సంసార సముద్రమును దాటి దుఃఖమును పోగొట్టుకుని ఆనందమును తెలుసుకోవడానికి ఉపాసన చేస్తున్నారో అటువంటి పరమశివుడు పరబ్రహ్మము అని చెప్పింది.*
---------------------------------------
*అంటే సృష్టి చేసింది మనం కాదు, నిలబెట్టింది మనం కాదు, వేరొకడున్నాడు... తెలుసుకో అని శాస్త్ర ప్రమాణం.నాలుగు వేదములు అదే చెప్తున్నాయి.*
------------------------------------
*ప్రణవం:-*
------------------------------------- *ఇప్పుడు ప్రణవాన్ని పిలిచారు, అపుడు ప్రణవం ఎవడు నిరంతరమూ శక్తి స్వరూపముతో క్రీడిస్తూ ఉంటాడో శక్తి ఆయనను విడిచిపెట్టి ఉండదో శక్తీశ్వరులై వారున్నారో అటువంటి శక్తీశ్వరుడై శక్తి ఆయనతో ఆయన శక్తితో విడివడకుండా కలిసి ఉంటారో అటువంటి పార్వతీ పరమేశ్వరులు, పార్వతి వామార్థ భాగమునందు ఉన్న శంకరుడే పరబ్రహ్మము, అని చెప్పింది.*
---------------------------------------
*ప్రణవం చెప్పిన మాటను వాళ్ళు అంగీకరించలేదు.* 
*ఈ మాటలు రుచించక పోతే ఇప్పుడు ఈశ్వరుడు* *దండించవలసి ఉంటుంది.కాబట్టి ఈశ్వరుడు అంతటా నిండిన పరబ్రహ్మము జ్యోతిగా మారాడు.* 
*జ్యోతి సాకారం అయింది, సాకారమును చూసినప్పుడు విష్ణువు ఊరుకున్నాడు.* 
*కానీ బ్రహ్మ నీవు ఎవరు?* *నువ్వు నా రెండు కనుబొమల మధ్యలోంచి పుట్టిన రుద్రుడవు. నన్ను స్తోత్రం చెయ్యి అన్నాడు.*
---------------------------------------
*బ్రహ్మలో మార్పు రాలేదు, ఆయన దండింపబడాలి, కాబట్టి ఇపుడు ఆ జ్యోతి ఘోర రూపమును పొందింది.* 
*శంకర ఏమి నీ ఆజ్ఞ అని అడిగాడు. బ్రహ్మ అహంకారంతో మాట్లాడుతున్నాడు.*
*అయిదవ తలను తీసివేయి అన్నాడు.అప్పుడు ఈశ్వర రూపం ప్రచండ రూపమును పొందింది, దిగంబరమై రూపంతో బ్రమ్మ అయిదవ తలను గోటితో గిల్లేసింది*
*ఆ రూపమే కాలభైరవ స్వరూపం*
---------------------------------------
*ఇలా జరిగే సరికి బ్రహ్మ భయపడి పోయి నాలుగు తలకాయలు అమ్మవారి చేతుల క్రింద పెట్టేసి ఈశ్వరా నేను చేసిన పొరపాటు మన్నించి ఉదారుడవై నన్ను కాపాడు అన్నాడు.*
*అపుడు శంకరుడు కాల భైరవునితో నీవు కాలము వలె ప్రకాశించుచున్నావు.*
*కాలము ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో అలా ఉంది నీ నడక.నీ నడకలో బ్రహ్మ తల తెగిపోయింది, కాబట్టి నిన్ను ఈ రోజు నుండి కాలభైరవ అని పిలుస్తారు.*
----------------------------------------
*కాలభైరవ నీవు ఎంత గొప్ప వాడవయినా బ్రహ్మ తల తెంపేశావు కాబట్టి నీకు బ్రహ్మహత్యాపాతకం అంటుకుంది. ఈ అయిదవ తలకాయ పుర్రెను చేతిలో పట్టుకుని పన్నెండు సంవత్సరములు భిక్షాటన చేసి ఆ కపాలంలో తిను.* 
*అపుడు నీ బ్రహ్మ హత్యా పాతకం పోతుంది, అని చెప్పాడు.*
*బ్రహ్మహత్యాపాతకమును తొలగించుకునేందుకు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి అనేక క్షేత్రాలలో పర్యటించినా తనకు సోకిన బ్రహ్మహత్యాపాతకము తొలగకపోవడంతో కాలభైరవుడు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి ప్రార్థించాడు.*
---------------------------------------
*కాలభైరవుడి ప్రార్థన విన్న శ్రీ మహావిష్ణువు కాలభైరవా నీవు శివుడి పుత్రుడవు కనుక శివుడితో సమానుడవు.* 
*బ్రహ్మ దేవుడి గర్వమును అణుచుటకు* *జనించినవాడవు.*
*నీవు ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఉపయోగం లేదు,* *కనుక నీవు కాశీ క్షేత్రానికి వెళ్ళు... కాశీ క్షేత్రంలో అడుగు పెట్టినంతనే నీ బ్రహ్మ హత్యాపాతకం* *భస్మమైపోతుంది అని సలహా యిచ్చాడు.*
---------------------------------------
*విష్ణుమూర్తి సలహా మేరకు కాలభైరవుడు కాశీ నగరానికి చేరుకోవడంతోనే బ్రహ్మహత్యా పాతకం తొలగిపోగా బ్రహ్మ కపాలాన్నీ కాశీలో పూడ్చిపెట్టాడు.*
*బ్రహ్మ కపాలం పూడ్చిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే నేటి కాశీ క్షేత్రంలోని ''కపాల మోక్షతీర్థం''...*
----------------------------------------
*కాశీలో కాలభైరవుడు విశ్వనాథ లింగాన్నిభక్తితో పూజించి తరించాడు.*
*విశ్వనాధుడు భక్తికి మెచ్చి కొన్ని వరాలు ఇచ్ఛాడు...*
----------------------------------------
*కాలభైరవ ఎవడు ఈశ్వరుని ధిక్కరించి బ్రతుకుతాడో వాడి ప్రాణోత్క్రమణము అవగానే నువ్వే కనపడతావు.* 
*దీనిని 'భైరవ యాతన' అంటారు.అప్పుడు జీవుడు నిన్ను చూసి హడలిపోతాడు.*
*కానీ ఎవరు నీ గురించి వింటారో శివాలయమునకు వచ్చినపుడు ఎవరు కాలభైరవుడి యందు శిరస్సు వంచి నమస్కరిస్తారో వాళ్ళ పాపమును నీవు తీసివేయి, అలా తీసేసే శక్తిని నేను నీకు ఇచ్చాను కాబట్టి నిన్ను 'అమర్దకుడు' అని పిలుస్తారు.*
----------------------------------------
*ఇక నుండి నీవు నా దేవాలయలలో క్షేత్ర పాలకుడిగా ఉంటావు.* 
*భక్తుల పాపములను నీవు తీసిన వాటిని నువ్వు* *తినేయ్యి. నువ్వు పాపములను తినేసి వాళ్ళను రక్షిస్తావు కాబట్టి నీకు 'పాప భక్షకుడు' అనే పేరును ఇస్తున్నాను.నిన్ను కాశీ క్షేత్రమునకు అధిపతిగా ఉంచుతున్నాను.* 
*నీ అనుగ్రహం ఉన్నవాళ్ళే కాశీక్షేత్ర ప్రవేశం చేస్తారు అని చెప్పాడు.*
---------------------------------------
*మనల్ని కాశీ క్షేత్రంలోని కాలభైరవుడు ఆ క్షేత్ర ప్రవేశానికి అనుమతించిన క్షేత్రపాలకుడు కనుక అయ్యా నాకు లోపలికి ప్రవేశింపచేసి నా పాపములను దగ్ధం చేశావు కాలభైరవా' అని ఆ మహానుభావుడికి ఇంటికి రాగానే కృతజ్ఞతా పూర్వకంగా కాలభైరవ పూజ అని చేసి ఇక నుండి మంచి పనులు చేస్తాను అని అన్న సంతర్పణ చేస్తారు...*
-------------------------------------
*భైరవ మూర్తి ప్రసన్నమూర్తి అయినాడని చెప్పడానికే ఆయన మేడలో ఒక గారెల దండ వేస్తారు. కాశీ సంతర్పణ చేస్తే తప్పకుండా వెళ్లి ఆ ప్రసాదమును తీసుకోవాలి.*
--------------------------------------
*ఇహలోకమునందు ఇప్పటివరకు ఈశ్వరుడి పట్ల తాము చేసిన దూషణల ఫలితము ఎలా పోతుందని బెంగ పెట్టుకున్న వాళ్ళ కోసం భైరవయాతన ఇక్కడే తేలికగా అనుభవింప చేస్తాడు.*
----------------------------------------
*అందుకే హరిద్వార్, ఋషికేశ్ వెళ్ళిన వాళ్ళు మానసా దేవి ఆలయమునకు వెళ్తే బయటకు వచ్చేటప్పుడు ఒకసారి ఒంగోండి అని ఒక బెత్తం పెట్టి వీపు మీద కొడతారు. అది భైరవ యాతన అని ఆ కర్ర ఠప్ అంటుంది, అక్కడితో పాపాలు పోతాయి.*
---------------------------------------
*ఆ కాలభైరవ స్వరూపం అంత గొప్పది.... 'మేము కాశీ వెళ్ళాము మాకు ఇంట ఏ భయమూ లేదు అని చెప్పడానికి ఒక నల్లతాడును రక్షగా కూడా కట్టుకుంటారు.*
----------------------------------------
*కాబట్టి ఇన్ని రూపములుగా ఆ కాలభైరవ స్వరూపం ఆనాడు ఆవిష్కరింపబడింది.*
---------------------------------------
*ఎవరు ఈ కాలభైరవ స్వరూపమును గురించి వింటున్నారో భక్తితో ప్రణమిల్లుతున్నారో ఒక్కసారి నమస్కరిస్తున్నారో అటువంటి వారు శివానుగ్రహాన్ని పొందుతారు.* 
*కాలభైరవుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడు, వాళ్ళు ఎప్పుడూ ఎంతో సంతోషంగా, సుఖంగా ఉంటారు.*
------------------------------------
*కాశీ క్షేత్రాన్ని దర్శించిన వారు శ్రీకాలభైరవ స్వామిని దర్శించడంతో పాటుగా కాశీ నుండి వచ్చిన వారు కాశీ సమారాధన చేయడం ఆచారం అయింది.*
*కాశీ క్షేత్రానికి వెళ్లి వచ్చిన వారు కాశీ విశ్వేశ్వర స్వామి వారిని పూజించడంతోపాటు వడలను చేసి వాటితో మాలను తయారు చేసి పూజానంతరం శునకమునకు పసుపు, కుంకుమలు పెట్టి ఆ మాలను దాని మెడలో వేసి నమస్కారం చేస్తారు.*
*ఆ ఆచారాలు శ్రీ కాలభైరవ స్వామి వారి మాహాత్మ్యానికి నిదర్శనం.*
--------------------------------------
*ఈ కాలభైరవుని జన్మదినమైన కాలభైరవాష్టమి నాడు శ్రీ కాలభైరవ స్వామి విగ్రహం లేదా చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని గణపతిని పూజించిన తరువాత షోడశోపచారాలతోను,* *అష్టోత్తరాలతోను. శ్రీ కాలభైరవ స్వామిని పూజిస్తారు. మినప వడలను నైవేద్యంగా సమర్పిస్తారు, ఒకపూట ఉపవాసం కూడా చేస్తారు.*
 *కాలభైరవ అష్టకమ్*
----------------------------------------
*దేవరాజసేవ్యమానపావనాఙ్ఘ్రిపఙ్కజం*
*వ్యాలయజ్ఞసూత్రమిన్దుశేఖరం కృపాకరమ్*
*నారదాదియోగివృన్దవన్దితం దిగంబరం*
*కాశికాపురాధినాథ కాలభైరవం భజే|
----------------------------------------
*భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం*
*నీలకణ్ఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ |*
*కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం*
*కాశికా పురాధినాథ కాలభైరవం భజే|
--------------------------------------
*శూలటఙ్కపాశదణ్డపాణిమాదికారణం*
*శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ |*
*భీమవిక్రమం ప్రభుం విచిత్రతాణ్డవప్రియం*
*కాశికా పురాధినాథ కాలభైరవం భజే |
---------------------------------------
*భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం*
*భక్తవత్సలం స్థితం సమస్తలోకవిగ్రహమ్ |*
*వినిక్వణన్మనోజ్ఞహేమకిఙ్కిణీలసత్కటిం*
*కాశికాపురాధినాథ కాలభైరవం భజే |
----------------------------------------
*ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం*
*కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ |*
*స్వర్ణవర్ణశేషపాశశోభితాఙ్గమణ్డలం*
*కాశికాపురాధినాథ కాలభైరవం భజే |
-------------------------------------
*రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం*
*నిత్యమద్వితీయమిష్టదైవతం నిరఞ్జనమ్ |*
*మృత్యుదర్పనాశనం కరాళదంష్ట్రమోక్షణం*
*కాశికాపురాధినాథ కాలభైరవం భజే |
---------------------------------------
*అట్టహాసభిన్నపద్మజాణ్డకోశసన్తతిం*
*దృష్టిపాతనష్టపాపజాలముగ్రశాసనమ్ |
*అష్టసిద్ధిదాయకం కపాలమాలికన్ధరం*
*కాశికాపురాధినాథ కాలభైరవం భజే 
----------------------------------------
*భూతసఙ్ఘనాయకం విశాలకీర్తిదాయకం
*కాశివాసలోకపుణ్యపాపశోధకం విభుమ్ |
*నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం
*కాశికాపురాధినాథ కాలభైరవం భజే |
--------------------------------------
*కాలభైరవాష్టకం పఠన్తి యే మనోహరం*
*జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనమ్ |
*శోకమోహదైన్యలోభకోపతాపనాశనం*
*తే ప్రయాన్తి కాలభైరవాఙ్ఘ్రిసన్నిధిం ధ్రువమ్ 
----------------------------------------
*ఇతి శ్రీమచ్ఛఙ్కరాచార్యవిరచితం కాలభైరవాష్టకం సంపూర్ణమ్.

Friday, 24 October 2025

నాగుల చవితి విశిష్టత

--------------------------------------
*నాగుల చవితి* 
--------------------------------------
 *అక్టోబర్ 25 శనివారం నాగులచవితి సందర్భంగా...* 
---------------------------------------
*కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ!_*
*_ఋతుపర్ణస్య రాజర్షే: కీర్తనం కలినాశనమ్!!*
--------------------------------------
*ఈ శ్లోకాన్ని నాగులచవితినాడు పఠిస్తే కలిదోష నివారణ అవుతుంది.*
---------------------------------------
*నాగులచవితికి నాగన్న.. స్నానం సంధ్యలు నాగన్న... పువ్వులు పడగలు నాగన్న... మడిబట్టలతో నాగన్న..' అంటూ తెలుగువారు నాగులచవితి పండుగను నియమ నిష్ఠలతో ఆచరిస్తారు. పుట్టలో పాలుపోసి ఉపవాసవ్రతాలు ఆచరిస్తారు. నాగులచవితి పర్వం వెనుక అంతరార్థం, సంప్రదాయ విశిష్టతలు ఎన్నో ఉన్నాయి.*
----------------------------------------
*నాగారాధన అనాది యుగాలనుంచి కొన్ని ప్రాంతాంలో కొనసాగుతోంది. కార్తికశుద్ధ చవితినాడు నాగులచవితి జరుపుకోవటం ఆచారం. మన శరీరమే నవరంధ్రాల పుట్ట. అందులో పామురూపంలో ఉండే కుండలినీశక్తిని ఆరాధించడమే నాగులచవితి. శరీరమనే పుట్టలో అడుగున మండలాకారంలో మూడున్నర చుట్టలు చుట్టుకుని పడుకున్న పాము ఉద్రేకముతో విషం కక్కుతూ ఉంటుంది. పాలు అనే యోగసాధన ద్వారా ఆ విషాన్ని హరించవచ్చు అని లౌకిక అర్ధంలో చెప్పడమే. నాగులచవితి ప్రయోజనం. నాగుల చవితినాటి రాత్రినుంచి స్వచ్ఛమైన నీలాకాశంలో అనంతశయనాకృతి పాలపుంతగా స్పష్టంగా కానవస్తుంది. ఇది ఉత్థానఏకాదశి వరకూ ఎనిమిదిరోజుల పాటు ఆకాశంలో కనిపించే అద్భుత దృశ్యం. అలాగే కార్తికమాసంలో సూర్యుడు మృత్యువుకు స్థానమైన వృశ్చికరాశిలో సంచరిస్తాడు. ఆ సమయంలో నాగారాధన వల్ల మృత్యువును జయించే సిద్ధి కలుగుతుంది. అందుకే కార్తికమాసమంతా నాగారాధన ప్రత్యేకంగా చేస్తారు.*
----------------------------------------
*నాగులచవితికి పత్తితో చేసిన వస్త్రాలు, యజ్ఞోపవీతాల వంటి నూలుదారాలతో పుట్టలను అలంకరిస్తారు. చిన్నచిన్న వెండిరేకుల్ని పుట్టకి పెట్టి 'పుట్టాకళ్ళు' అలంకరిస్తారు. “నాగులచవితికి నాగన్నా నీ పుట్టనిండా పాలుపోసేము తండ్రీ! నీ పుట్టదరికి మా పాపలొచ్చేరు. పొరపాటున 'తోక తొక్కితే తొలగిపో, నడుం తొక్కితే నడిచిపో! పడగ తొక్కితే పారిపో! మమ్మల్ని, మా సంతానాన్ని కాపాడు" అంటూ పుట్టలో పాలుపోస్తారు. ప్రదక్షిణ నమస్కారాలు చేస్తారు. చలిమిడి, చిమ్మిలి, అరటిపళ్లు, తాటి బుర్రగుజ్జు, తేగలు వంటివి నివేదన చేస్తారు". సర్పారాధనకు తామరపూలు, కర్పూరపూలు శ్రేష్ఠం. సర్పారాధన చేసే వారి వంశం తామరతంపరగా వర్ధిల్లుతుందని భవిష్యపురాణం చెప్తోంది. నాగేంద్రుడిని స్త్రీలు ఆరాధిస్తే శుభలక్షణాలు కలిగిన సంతానం కలుగుతుంది. వివాహం కానివారు ఆరాధిస్తే యోగ్యుడైన భర్త లభిస్తాడని విశ్వాసం: సౌభాగ్యానికి, సత్సంతానప్రాప్తికి సర్పపూజ చేయడం ఆనవాయితీ.*
---------------------------------------
*పుట్ట మట్టిని 'పుట్టబంగారం' అంటారు. కొద్దిగా పుట్టమట్టి చెవి దగ్గర పెట్టుకుంటే వినికిడి సమస్యలు తొలగిపోతాయి. నాగులచవితికి ఉపవాసం చేసి స్వామికి నివేదించిన చిమ్మిలి, చలిమిడినే అల్పాహారంగా తింటారు. నువ్వులు, బెల్లంతో చేసిన చిమ్మిలి, చలిమిడి చలికాలంలో తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. "నూకలిస్తా మూకనియ్యి... పిల్లలమూక నాకియ్యి" అంటూ సంతానం కోరే వారు పుట్టలో పాలతో పాటు నూకవేసి వేదుకుంటారు. అన్ని ఆలయాల్లో నాగారాధన విశేషంగా జరుగుతుంది. పామును చంపిన పాపం తొలగిపోవడానికి తైత్తిరీయసంహిత నాగపూజావిధానం వివరించింది.*
--------------------------------------
*పాములు భూమి అంతర్భాగంలో నివసిస్తూ భూసారాన్ని కాపాడతాయి. సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా నాగులను పూజించడం మన ఆచారం. పుట్టలో సోసే పాలు పాములు తాగవని అందరికీ తెలిసిన సత్యం. అయితే నాగులచవితినాడు మనం పుట్టలో వేసే పిండిపదార్ధాలు, నువ్వులు, బెల్లం ఇతర పదార్థాలు తినేందుకు క్రిములు చేరతాయి. వాటిని తినడానికి కప్పలు, ఎలుకలు ఆ పుట్టల్లోకి చేరతాయి. అవి పాములకు ఆహారంగా మారతాయి. అలా కొద్దిగా పుట్టమట్టి చెవి పాములు తమ నివాసాల నుంచి బయటకు రాకుండానే వాటిస్థానాల్లోనే ఆహారం లభిస్తుంది. ఫలితంగా పాములకు ప్రాణహాని వాటివలన మనకు హాని రాకుండా నివారించగలుగుతున్నాం. ఇలా ఎలుకలను ఎరవేసి పట్టించడం వల్ల రైతులకు పంటనష్టం కూడా తగ్గుతుంది. పాముల సహజ నివాసాలను ఉండనిచ్చి, ప్రకృతిని కాపాడుకునే విశిష్ట పర్వం నాగులచవితి.*
----------------------------------------     *నాగులచవితి విశిష్టత*
----------------------------------------
*దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని, నాగులచవితి పండుగ అంటారు.* 
*కొందరు శ్రావణ శుద్ధ చతుర్థినాడు జరుపుకుంటారు.*
*మన పురాణాలలో నాగులచవితి గురుంచి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతటా పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి కదా!. ఈ నాగులచవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్చిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారు. ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ' వెన్నుబాము' అని అంటారు. అందు కుండలినీశక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారమువలెనే వుంటుందని "యోగశాస్త్రం" చెబుతోంది. ఇది మానవశరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ, మానవునిలో 'సత్వగుణ' సంపత్తిని హరించివేస్తూ ఉంటుందని; అందుకు ' నాగులచవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పపుట్టలను ఆరాధించి, పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివశించే "శ్రీమహావిష్ణువు"కు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే... ఈ నాగుపాముపుట్టలో పాలు పోయడంలో గల అంతర్యము.*
---------------------------------------- 
*దీనినే జ్యోతిష్యపరంగా చూస్తే! కుజ, రాహు దోషాలున్నవారు, సాంసారిక బాధలున్నవారు, ఈ కార్తీకమాసంలో వచ్చే చతుర్దశి, షష్టీలలో మంగళవారము నాడుగాని, చతుర్దశి బుధవారం కలసివచ్చే రోజుకాని దినమంతా ఉపవాసము ఉండి ఈ దిగువ మంత్రాన్ని స్మరిస్తూ!*
----------------------------------------
*పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ౹* *సత్సంతాన సంపత్తిం దేహిమే శంకర ప్రియ౹*
*అనంతాది మహానాగ రూపాయ వరదాయచ౹ తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా౹౹*
---------------------------------------
*అలా! ఆవుపాలు పుట్టలో పోసి, నాగపూజచేసి,* *చలిమిడి,చిమ్మిలి,అరటిపళ్ళు మున్నగునవి నివేదన చేస్తారు. ఆ సందర్భంగా పుట్టవద్ద 'దీపావళి నాటి మిగిలిన మతాబులు, కాకరపువ్వొత్తులు, టపాసులు చిన్నారులు ఎంతో సంతోషంగా కాలుస్తారు.*
*ఇలా స్త్రీలు ఆరాధిస్తే శుభప్రదమైన సుఖసంతానము; అదే కన్నెపిల్లలు ఆరాధిస్తే! మంచిభర్త లభించునని పలువురి విశ్వాసము. ఈ విధమైన నాగుల ఆరాధన ఈనాటిదికాదు,* *యుగాలనాటిది!*
*సౌభాగ్యానికి, సంతానప్రాప్తికి సర్పపూజ చేయుటనేది, లక్షల శరత్తులనాడే ఉన్నట్లు మన పురాణాలలో ఎన్నో గాధలు కానవస్తున్నాయి.*
-------------------------------------- 
*దేశమంతటా పలు దేవాలయాల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలను ఈ "నాగులచవితి" నాడు నాగేంద్రుని శివభావముతో అర్చిస్తే సర్వరోగాలూ పటాపంచలై సౌభాగ్యవంతులవుతారని ఋషివచనం.*
---------------------------------------   *నాగేంద్రా! మేము మా వంశములోవారము నిన్ను ఆరాధిస్తున్నాము.*
*పొరపాటున "తోకతొక్కితే తొలగిపో! నడుంతొక్కితే నా వాడనుకో! పడగ త్రొక్కితే కస్సుబుస్సుమని మమ్ములను భయపెట్టకు తండ్రీ!  అంటూ పుట్టకు ప్రదక్షిణ నమస్కరాలు చేయాలని పెద్దలు చెప్తూ ఉంటారు.*
----------------------------------------  *నూకని పుట్టచుట్టూ... నూకలు నువ్వు తీసుకుని, మూకలు మాకివ్వు తండ్రీ! అని చల్లి, పుట్టమన్ను చెవులకి పెట్టుకుంటాము. మనకి పంట సరిగ్గా పండి మనపొట్ట నిండటానికి ఎంతో సహాయపడే ఈ పాముల్ని ఈ ఒక్కరోజన్నా మనసారా తలుచుకుని, వాటి ఆకలి,దప్పికలు తీర్చడమే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.*
----------------------------------------
*నాగులచవితిరోజున            ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తే కలిదోషనివారణ అవుతుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.*
*శ్లో॥ "కర్కోటకస్య నాగస్య*             *దయయంత్యా నలస్యచ।*
 *ఋతుపర్ణస్య రాజర్షే*
 *కీర్తనం కలినాశనమ్‌" ||*
---------------------------------------
*ఈ సర్పారాధనకు తామరపూలు,* *కర్పూరంపూలు, లడ్డు మున్నగునవి ప్రీతికరమని చెప్తారు.*
*సర్పారాధన చేసేవారి వంశం 'తామరతంపరంగా' వర్ధిల్లు తుందని భవిష్యపురాణం చెప్తోంది.*
 ---------------------------------------
*తలనుండు విషము ఫణికిని,* 
*వెలయంగా తోకనుండు* *వృశ్చికమునకున్‌,*
*తలతోకయనక యుండు ఖలునకు,*
*నిలువెల్ల విషము గదరా సుమతీ!*
*అని చెప్పినట్లు... అలా మనచుట్టూ మానవరూపంలో ఉండే మానవులు; సర్పజాతి మనసుకంటే నికృష్టమైన (అంటే! అవి మనంవాటి జోలికి వెళితేనే ప్రమాదకరమవుతాయి), వాటికంటే భయంకరమైన మానవసర్పాలు మనచుట్టూ తిరుగుతున్నా గమనించలేక పోతున్నాం! అని గ్రహించుకోవలసి ఉంది.*
----------------------------------------
*నాగర్కోయిల అనే ఊరిలో నాగుపాము విగ్రహం ఉందిట! దాని సమీపంలో 6నెలలు తెల్లని ఇసుక, 6నెలలు నల్లని ఇసుక భూమిలో నుండి ఉబికి, ప్తెకివస్తోందని భక్తులు చెప్తూ ఉంటారు. నాగుపాము కుబుసానికి కూడా మంచి ఆయుర్వేద గుణాలు ఉన్నాయని, గరళాన్ని ఆయుర్వేదమందులలో తగుమోతాదులలో ఉపయోగిస్తారని ఆయుర్వేదశాస్త్రం చెబుతుంది.*
---------------------------------------
*వృశ్చికరాశిలో వచ్చే, జ్యేష్ఠనక్షత్రాన్ని*
*సర్పనక్షత్రం అంటారు.* 
*ఈ నక్షత్రంలో సూర్యుడు సరిగ్గా.... కార్తీక శుద్ధచవితి నాడు ప్రవేశిస్తాడు. ఇలా, ప్రవేశించిన రోజుని* *నాగులచవితి అంటారు. పాములు అనేవి మనకి పరోక్షంగా చాలా మేలు చేస్తాయి. భూమి అంతర్భాగాలలో ఉంటూ, భూమిని నాశనం చేసే క్రిముల్ని, పురుగుల్ని తినేసి, మన భూసారాన్ని కాపాడుతూ నీటి వనరుల కింద ఉపయోగపడతాయి. అటువంటి పాముల్ని ఈ రోజున కొలిచి, మనకి తిండికి, ఆరోగ్యానికి, సంతానానికి, ఏ రకమయినటువంటి ఇబ్బందులూ కలగకుండా కాపాడమని ఈ రోజున ప్రత్యేక పూజలు చేస్తాము. మన భారతీయులు చాలా ఇళ్ళల్లో ఇలవేల్పు సుబ్రహ్మణేశ్వరుడే! ఆరాధ్యదైవంగా పూజిస్తారు కాబట్టి, వారి పేరును చాలామంది నాగరాజు, ఫణి, సుబ్రహ్మణ్యం, సుబ్బారావు అంటూ పేర్లు పెట్టుకుంటూనే ఉంటారు.*
---------------------------------------- 
*వ్రతం ఆచరించేపద్ధతి / పూజ చేయువిధానము:*
*దైవారాధన ఒక నమ్మకము. ఏనాడూ నమ్మకమనేది మూఢనమ్మకాలు కాకూడదు.* 
*మూఢనమ్మకాలు జీవితంలో అనర్ధాలకు దారితీయును.* 
*నమ్మకము - మనశ్శాంతిని, మనోబలాన్ని ఇస్తుంది.*
----------------------------------------
*నాగులచవితి రోజున ఉదయాన్నే లేచి, తలంటుపోసుకొని ఇంట్లో దేవునివద్ద దీపారాధన చేయాలి. ఎరుపు రంగుదుస్తులు ధరించాలి.* *తర్వాత పూజామందిరము, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజామందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి.* *పూజామందిరంలో కలశమును ఏర్పాటు చేసి, దానిపై ఎరుపువస్త్రాన్ని పరుచుకోవాలి.* *నాగేంద్రస్వామి (పాముపడగ) ప్రతిమనుగానీ, లేదా ఫోటోనుగానీ ఉంచి, పూజించాలి. పూజకు మందారపూలు,* *కనకాంబరములు, వంటి ఎర్రటి పువ్వులు,*
*నైవేద్యమునకు చిన్నచిన్న ఉండ్రాళ్ళు, వడపప్పు, అరటిపండ్లు, చలిమిడి, చిమ్మిలి లను సిద్ధం చేసుకోవాలి. ఉదయం 9 గంటలలోపు పూజను పూర్తిచేయాలి. పూజకు ముందు నాగేంద్ర అష్టోత్తరము,నాగేంద్ర స్తోత్రము, నాగస్తుతిః, నాగేంద్ర సహస్రనామములను పఠించడం ద్వారా* *సకలసంతోషాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం.* *స్తోత్రములు పఠించేందుకు వీలుకాని పక్షములో* 
*"ఓం నాగేంద్రస్వామినే నమః"*
 *అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.*
--------------------------------------- 
*దీపారాధనకు* *నువ్వులనూనెను వాడాలి. 7 దూదివత్తులు, ఆవునేతితో సిద్ధం చేసుకున్న దీపముతో హారతినిచ్చి, నైవేద్యమును సమర్పించుకోవాలి. పూజ ముగిశాక నాగేంద్రస్వామి నిత్యపూజ అనే పుస్తకమును తాంబూలముతో చేర్చి ముత్తైదువులకు* *అందజేయాలి. తరువాత దగ్గరలో ఉన్న పుట్టవద్దకు పోయి, దీపం వెలిగించి, పుట్టలో పాలుపోసి, పూజ చేయాలి. పూజ అయిన తరువాత నైవేద్యం పెట్టి, ఆ రోజు పగలంతా ఉపవాసం ఉండి, రాత్రికి భోజనం చేయాలి. ఇదీ వ్రతం ఆచరించే పద్ధతి. నాగులచవితి రోజున నాగదేవతలకు పంచామృతములతో అభిషేకం చేయిస్తే, సర్వం సిద్ధిస్తుందని నమ్మకం. అలాగే... దేవాలయాల్లో నాగేంద్ర అష్టోత్తర పూజ, నాగేంద్ర సహస్రనామపూజలు చేయించడం శుభదాయకం. ఇంకా మోపిదేవి ఆలయం, నాగేంద్రస్వామి పుట్టలను, నాగులచవితి రోజున సందర్శించేవారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురోహితులు వచన.*
--------------------------------------
*చెవిబాధలు, కంటిబాధలు ఉన్నవాళ్లకు చవితి ఉపవాసం మంచిది. నాగవస్త్రాలు పుట్టమీద పెట్టి, తీసి ధరిస్తే, మనోరథాలు తీరుతాయి.*
*బాలబాలికలు, దీపావళి రాత్రి నాగదివ్వెలను వెలిగించి, చవితిని స్మరించి, ఆహ్వానిస్తారు. దీపావళి పండుగ వెళ్లిన నాలుగోనాడు మనకు నాగులచవితి వస్తుంది.*
----------------------------------------
*సంతానానికి, సర్పపూజకు గల సంబంధాన్ని తెలపడానికి బ్రహ్మ పురాణంలో ఒక కథ ఉంది.శూరసేనుడు చంద్రవంశపు రాజు. శూరసేనుడు అతని భార్య, సంతానంకోసం చాలారోజులు తపస్సు చేశారు. చివరికి వారికి ఒక సర్పం పుట్టింది. ఆ సర్పాన్నే వీరు పెంచుతూ వచ్చారు. కొన్నాళ్లకు ఆ సర్పం మనుషుల భాషలో మాట్లాడింది. ఆ పాము తనకు ఉపనయనం చేయమని కోరింది. రాజు అలాగే చేశాడు. కొన్నాళ్లకు ఆ పాము తనకు పెళ్లి చేయమని కోరింది. ఖడ్గాన్ని పంపి ఒక రాకుమార్తెతో పెళ్లిచేసి రప్పించారు. ఆమె అత్తింటికి వచ్చి, తన మగడు ఒక పాము అని తెలుసుకుంది. ఆమె ఏమాత్రం భయపడక ఆ పాముతో కలసిమెలసి ఉంటూ ఉండేది. నన్ను చూసి నీవు ఎందుకు భయపడవు? అని పాము ఆమెను అడిగింది. భర్త ఎట్టివాడైనా స్త్రీకి దైవసమానుడు. దైవాన్ని చూసి భయపడడం దేనికి? అని సమాధానం చెప్పింది. అప్పుడు ఆ పాము శివుని శాపంవల్ల ఇలా అయ్యానని చెప్పి, ఆమెతో కలిసి చవితి వ్రతం ఆచరించి, గౌతమినదిలో స్నానం చేసి, శివుని సన్నిధిలో శాపవిమోచనం పొందాడు.*
----------------------------------------
*"చలి ప్రవేశించు నాగులచవితి నాడు మెరయు వేసవి రథసప్తమీ దివసమున అచ్చసీతు ప్రవేశించు పెరిగి మార్గశిర పౌష మాసాల మధ్య వేళ'' అని శివరాత్రి మాహాత్మ్యంలో శ్రీనాథుడు పేర్కొన్నాడు. చలికాలం ఆరంభమయ్యే కార్తీకమాసంలో చవితినాడు నాగపూజ చేయడం, ఆంధ్రదేశంలో ప్రాచీనకాలం నుంచీ వస్తున్న సంప్రదాయం.*
---------------------------------------
*భవిష్యపురాణం 'నాగదష్టవ్రతం' గురించి చెబుతోంది.*
*''నాగదష్టో సరో రాజన్‌ ప్రాప్యమృత్యుం ప్రజత్యథః అధోగత్వా భవేత్సర్పో నిర్తిషో నాత్ర సంశయః''-*
*''రాజా! పాముకాటు పొందిన నరుడు మరణించిన పిదప పాతాళ లోకానికి పోయి, విషరహితుడై సర్పజన్మ పొందుతా''డని సుమంతుడు చెప్పగా శతానీకుడు పాముకరచినవాని కుటుంబీకులు అతని మోక్షప్రాప్తికి ఏమి చేయాలని? ప్రశ్నిస్తే – నాగపూజను వివరించినట్లు కథ. కొన్నిచోట్ల నాగపంచమి ప్రాచుర్యం పొందితే, కొన్ని ప్రాంతాల ప్రజలు కార్తీక చతుర్థినాడు నాగపూజ చేయడం పరిపాటి. స్కందపురాణంలో దీనిని 'శాంతి వ్రతం' అన్నారు.*
 ---------------------------------------
*హైందవ సంప్రదాయంలోనే గాక జైన, బౌద్ధ ధర్మాల్లోనూ నాగారాధనకు ప్రాముఖ్యం ఉంది.అమరావతీ స్తూపంలో ఫణీంద్రుడు పడగవిప్పిన చిత్రాలు ఉన్నాయి.దుర్గాదేవి పరివారంలో ఒక సర్పం కూడా ఉంది. శివుడునాగభూషణుడు, అతని వింటినారి వాసుకి.*
*శ్రీమహావిష్ణువు మేను వాల్చింది నాగతల్పం ఆదిశేషుడు పైనే.*
*వినాయకునికి సర్పం ఆభరణం, యజ్ఞోపవీతం కూడా. కుమారస్వామి వాహనమైన మయూరం కాళ్లకు సర్పాలు చుట్టుకొని ఉంటాయి. ఆంధ్రదేశం దాదాపు 2500 సంవత్సరాల క్రితం నాగరాజుల ఏలుబడిలో ఉన్నట్లు, వారివల్లనే ఈ దేశానికి నాగభూమి అని పేరు ఏర్పడిందని బౌద్ధగాథలు వెల్లడిస్తున్నాయి. సర్పం జాతీయచిహ్నంగా గల ప్రాచీనతెగ నాగులని కొందరు చరిత్రకారుల అభిప్రాయం.* ఆంధ్రదేశంలో *నాగపూజ పరంపరాగతంగా వస్తోంది. శాతవాహనుల నాటి బౌద్ధాచార్యుడు నాగార్జునుని పేరులో నాగశబ్దం ఉంది. నాగవరం, నాగపట్నం, నాగులపాడు మొదలైన గ్రామనామాలు; నాగయ్య, నాగమ్మ వంటి వ్యక్తి నామాలు; నాగులేరు, నాగరం, నాగుల చీర మొదలైన విశేషనామాలు తెలుగునాట ప్రసిద్ధం.* 
*అమరావతి స్తూపంలో నాగబు శాసనస్థమైన తొలి తెలుగు మాటగా వేటూరి ప్రభాకరశాస్త్రి గుర్తించారు.* 
*మహావిష్ణువు చాతుర్మాస్యానంతరం నిద్రలేచే ఉత్థానేకాదశికి ఈ నాగులచవితి దగ్గరగా ఉన్నందున కార్తీక శుద్ధ చవితి నాడే నాగపూజ ఆంధ్రుల ఆచారం. ఆనాడు* *జ్యోతిర్మండలంలో అనంత శయనాకృతి కనిపిస్తుందని చెబుతారు.*
----------------------------------------
*నాగులచవితికి మిగతా పండుగాల్లాగా ఇళ్ళకు సున్నాలు అవీ పూయకూడదు. ఇళ్ళల్లో కానీ, పొలాల్లో కానీ, కన్నాలుంటే పూడ్చాకూడదు. ఇల్లు తుడిచాక ముగ్గుపిండితో ముగ్గు పెట్టకూడదు. సుద్దముక్కలు లేకపోతే చాక్ పీస్ లతో ముగ్గు పెట్టాలి. అన్ని గుమ్మాలకీ, తలుపులకీ ఆస్తిక అని వ్రాయాలి. ఆస్తికుడు ఎవరంటే .... అర్జునుని కొడుకు అభిమన్యుడు, అభిమన్యుడు యుద్ధంలో మరణించినప్పుడు అతని భార్య ఉత్తర గర్భవతి. అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు, పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు అనాలోచితంగా చేసిన పాప ఫలితంగా, శాపఫలితంగా పరీక్షిత్తు పాముకాటు వలన మరణిస్తాడు. తండ్రి మరణానికి ప్రతీకారంగా జనమేజయుడు పాముజాతిని మట్టుపెట్టాలని సర్పయాగాన్ని నిర్వహిస్తాడు. యాగం మధ్యలో సర్పజాతిని రక్షించటానికి ఆస్తికుడు వచ్చి, తన మాటల చాతుర్యంతో జనమేజయున్ని మెప్పించి, సర్పయాగాన్ని ఆపి, జగత్కళ్యాణ కారకుడు అవుతాడు. అందుకే నాగులచవితి రోజు ప్రతీ వాకిలి దగ్గరా ఆస్తీక అని వ్రాసి, సర్పజాతిని కాపాడినవాడిని తలచుకోవడం జరుగుతుంది.*
---------------------------------------- 
*పాముల ఉపయోగాలు :*
*ప్రతి జీవి, ఇంకొక జీవికి ఏదోవిధంగా ఉపయోగపడుతూ ఉంటుంది . దీనినే సమన్వయ సహకారము (Symbiosis) అంటాము . అన్ని జీవుల మాదిరిగానే పాములూ 'జీవపరిణామ క్రమము' (Theory of Evaluation of species(life))లో భాగంగానే ఉద్భవించాయని అనడంలో సందేహము లేదు.*
---------------------------------------
*నాగుపాము కుబుసానికి కూడా మంచి ఆయుర్వేద గుణాలు ఉన్నాయని, గరళాన్ని ఆయుర్వేద మందులలో తగుమోతాదులతో ఉపయోగిస్తారని ఆయుర్వేదశాస్త్రం చెబుతోంది. నాగులచవితి రోజున ఉపవాసం ఉండి పాముపుట్టను పూజించాలి. పుట్టలో ఆవుపాలు పోయాలి. పుట్టను పూజించే అవకాశం లేనప్పుడు నాగవిగ్రహాన్ని పాలతో అభిషేకించాలి. సాధారణంగా ప్రతిచోట ఆలయాలలోనూ, రావి, వేప చెట్ల క్రింద ఈ నాగవిగ్రహాలు / నాగబంధం ఉంటుంది.*
---------------------------------------- 
*ఒక విషయం గుర్తుంచుకోండి.పాములు సరీసృపాలు కనుక పాలు త్రాగవు. అలా అని అన్నిపాములూ పాలు త్రాగవని కాదు,* *దేవతాసర్పాలు మాత్రమే పాలు త్రాగుతాయి. మాములుపాములు పాలుత్రాగితే అరగక కక్కెస్తాయి, మరణిస్తాయి కూడా! దేవతా సర్పాలు ఎక్కడపడితే అక్కడ ఉండవు.మనిషి కంటికి కనిపించవు, అంటే మానవ కదలికలులేని మహారణ్యాలలో మాత్రమే ఉంటాయి. అందువల్ల పుట్టలో పాక్యేట్ల కొద్దీ పాలు పోయకండి. నాగజాతిని తలుచుకుని నాగదేవతకు నైవేద్యంగా ఒకటి, రెండు చెంచాల పాలు మాత్రమే పుట్టలో పోసి, మిగితావి ప్రసాదంగా స్వీకరించడం మంచిది. నాగదేవత పూజలో పసుపుకుంకుమలను* *పుట్టదగ్గర వాడవద్దు. పసుపు అంటే పాములకు అలర్జీ. పసుపు వాటి శరీరానికి అంటుకోవడం వలన కూడా అవి మరణిచే అవకాశం ఉంటుంది. పండుగ పూట పాపం చేయకండి.* *పసుపుకుంకుమలను పుట్టదగ్గరవాడకండి.*
*పుట్ట దగ్గర / నాగబంధం దగ్గర పూజించాకా, ఇంటి గడప దగ్గర కూడా పాలుపోయాలి. ప్రతి ఇంటి గుమ్మం దగ్గర నాగరాజు కొలువుండి ఇంటిని రక్షిస్తుంటాడు. కనుక ఇంటి గడపమీద పాలు పోయండి, కాసింత చిమ్మిలి, చలివిడి పెట్టండి, ఒక అరటిపండు ముక్క పెట్టండి. మరునాడు ఇంట్లో బంగారంతో కాని, వెండితో కాని, కొయ్యతో(చెక్క) కాని, మట్టితో కాని చేసిన నాగప్రతిమను పంచామృతాలతోనూ, జాజి,సంపెంగ లాంటి సువాసనగల పూలతోనూ పూజించాలి. ఈ నాగపూజ వలన సర్పదోషాలు నశిస్తాయి.*
---------------------------------------
*ఆశ్లేష , ఆరుద్ర , మూల , పూర్వాభాద్ర , పూర్వాషాడ అను ఈ ఐదు నక్షత్రములు సర్ప నక్షత్రములు.సర్పము అనగా కదిలేది , పాకేది.  నాగములో ‘న , అగ’* *ఎప్పుడూ కదులుతూ ఉండేదని అర్థం. క్షణం కూడా ఆగకుండా అతివేగంగా వెళ్ళేదాన్ని ‘నాగము’అంటారు. అన్నింటికంటే వేగంగా వెళ్ళేది ‘కాలము’కావున నాగమునకు మరో అర్థం కాలం. అందుకే ‘కాలనాగము’ లేదా* *‘కాలనాగు’అని అంటారు.* 
----------------------------------------
*జ్యోతిష్యశాస్త్రానుసారం కాలసర్ప దోషం ఉన్నవారికి జీవన క్రమంలో ఎన్నో అవరోధాలు ఏర్పడుతాయి.  జీవితం నిరంతరం కొనసాగే ప్రక్రియ అనగా ‘నాగం’సర్పము హృదయ భాగంతో పాకుతూ ఉంటుంది. ఈ భాగాన్ని ‘ఉరా’ అంటారు.  కావున సర్పానికి ‘ఉరగము’ అని కూడ పేరు. ఉదరమున ఉన్న మనస్సు చెప్పినట్టు నడిచే వాళ్ళమైన మనమూ కూడా ‘ఉరగముల’మే. సర్పం తాను నిరంతరం సాగుతూ మన జీవనక్రమంలోని వివాహం , సంతానం వంటి జీవన ఘట్టాలను అవరోధపరస్తుంది కావున కార్తీక మాసంలో నాగులను ఆరాధిస్తారు. అగ్ని దేవతగా ఉండేది.కార్తీకమాసములోనే మన జీవనానికి కావాల్సిన ఉత్సాహం , ఉత్తేజం వంటివి తేజస్సు వలన అనగా సూర్యుడు , అగ్ని వలన కలుగుతాయి. శ్రీహరికి శయ్య , శంకరునికి ఆభరణము కూడా సర్పమే.  కావున నాగులను ఆరాధించడం వలన హరిహరులను సేవించిన ఫలం దక్కుతుంది.*
----------------------------------------
*కార్తికమాసమంతా ఇంట్లో నాగ ప్రతిమను ఆరాధిస్తూ , నాగస్తుతిని చేస్తే పరమాత్మ అనుగ్రహిస్తాడు. కార్తీకమాసం నెలరోజులు కాకపోయినా కనీసం *కార్తీక శుద్ధ చవితినాడు*  *నాగులను ఆరాధించాలి. చవితి అంటే నాల్గవది అనగా ధర్మార్థ కామ మోక్ష పురుషార్థాలలో నాల్గవది మోక్షం కావున ఆనాడు నాగులను ఆరాధిస్తే మోక్షము లభిస్తుంది. అంటే జీవితంలో వచ్చిన కష్టాల నుండి విముక్తులవుతాము. కావున నాగులను చవితినాడు దేవాలయాలలో , గృహములో లేదా పుట్టల వద్ద నాగ దేవతను ఆరాధించాలి.* 
----------------------------------------
*ప్రకృతి మానవుని మనుగడకు జీవనాధరమైనది కనుక దానిని దైవ స్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును ,పుట్టను , రాయిని , రప్పను , కొండను , కోనను , నదిని , పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణికోటిని దైవ స్వరూపంగా చూసుకొంటూ* *పూజిస్తూవస్తున్నారు. ఇదే మనభారతీయ సంస్కృతిలోని హిందువుల పండగల విశిష్టత.* 
---------------------------------------
*నిశితంగా పరిశీలిస్తే ... అందులో భాగంగానే "నాగుపాము"ను కూడా నాగరాజుగా , నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు.*
----------------------------------------
*ఈ రోజున ఊరిలో ఉన్న గుళ్ళలో ఉన్న పుట్టలలో కానీ లేదా ఊరి బయట ఉన్న పాము పుట్టలో పాలు పోస్తారు. పుట్టలో పాలు పోయటమనేది భారతదేశంలో అనాదిగా వస్తున్న ఆచారం. సిటీ ప్రాంతంలో నాగుల చవితికి అంత సందడిగా కనిపించదు కానీ గ్రామీణ ప్రాంతాలలో మాత్రం ఎంతో సందడి సందడిగా కనిపిస్తుంది.* 
----------------------------------------
*దేవాలయాల్లో రాతి విగ్రహా జంట పాముల ప్రతిమలు , రెండు పాములు మెలికలు వేసుకొని రావి , వేప చెట్ల కింద దర్శనం ఇవ్వటం మనము ఎక్కువ గమనిస్తుంటాము. చవితి నాడు సర్పాలను పూజిస్తే సర్వరోగాలు , వైవాహిక , దాంపత్య దోషాలు , గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులవుతారని భక్తులు విశ్వాసంతో పుజిస్తారు. ఎందుకంటే కుజ దోషం , కాలసర్ప దోషానికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా మన దేశంలో ఒక్కో చోట ఒక్కో విధంగా నాగులచవితిని జరుపుకుంటారు.కొన్ని ప్రాంతాల వారు దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ  జరుపుకుంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థినాడు జరుపుకుంటారు.ఇవి రైతులకు కూడా ఎంతో మేలును చేకూరుస్తాయిఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి" నీటిని" ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే  క్రిమికీటకాదులను తింటూ , పరోక్షంగా " రైతు " కు పంటనష్టం కలగకుండా చేస్తాయట !.  అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి.*
----------------------------------------
*భారతీయ సనాతన సంప్రదాయాల్లో జంతు పూజ ఒకటి. ఈశ్వరాంశ ప్రతి ప్రాణిలోనూ వ్యాపించి ఉన్నదని ఉపనిషత్‌ ప్రబోధం.ప్రకృతి పరిరక్షణకు తోడ్పడే సద్భావన అది. వేదంలో నాగ పూజ కనిపించకున్నా -  సంహితల్లో , బ్రాహ్మణాల్లో ఆ ప్రసక్తి వస్తుంది. పురాణ , ఇతిహాసాల్లోని గాథల్లో సర్పాలు వివిధ సందర్భాల్లో ప్రత్యక్షమవుతాయి. ఈ రోజునే తక్షకుడు , కర్కోటకుడు , వాసుకి , శేషుడు మొదలైన 100 మంది నాగ ప్రముఖులు జన్మించారని పురాణ కథనం.భూలోకానికి క్రింద ఉన్న అతల , వితల , సుతల , తలాతల , రసాతల , మహాతల , పాతాళ లోకాలల్లో వివిధ జీవరాసులు నివసిస్తాయి. వాటిలో ఐదు రసాతల లోకాల్లో రాక్షసులు నివసిస్తారు. చివరిదైన పాతాళ లోకంలో నాగులు ఉంటాయి. నాగ ప్రముఖులందరూ అక్కడ ఉంటారు. ఈరోజున నాగులకు ఆహారం అందజేస్తే నాగదోషం సహా మొదలైన దోషాలు తొలగిపోతాయి.*
*కద్రువ నాగ మాత , మహావిష్ణువుకు శయ్యగా అమరిన ప్రాణి ఆదిశేషువు. సర్పం పరమశివుడి కంఠాన మనోహర ఆభరణం. సూర్యభగవానుడి రథానికి సర్పమే పగ్గం. అదే - ఆకాశం మధ్య వెలసిన కుజగ్రహానికి కుదురు. భైరవుడి భుజంపై వేలాడే యజ్ఞోపవీతం సర్పమే. శనిదేవుడి చేతిలోని  ఆయుధమూ అదే. సర్పమే మంథర పర్వతానికి కవ్వపు తాడుగా మారింది. దేవతలకు , రాక్షసులకు సముద్ర మథన సమయంలో సహాయకారిగా ఉపయోగపడింది.*
----------------------------------------
*దంపతులకు సంతానం కలగకపోవడానికి ప్రాచీన , ఆధునిక వైద్యశాస్త్రాలు పలు కారణాలు చెబుతాయి.  సర్పదోషమే కారణమని భావించినవారు రామేశ్వరం వెళ్లి నాగప్రతిష్ఠ చేయడం రివాజు. అక్కడికి వెళ్లలేనివారు తమ గ్రామ దేవాలయప్రాంగణంలోనే సర్ప విగ్రహాల్ని ప్రతిష్ఠించే పద్ధతి ఉంది. మన ప్రాచీన దేవాలయాల చుట్టూ శిథిలమైన నాగ విగ్రహాలు ఇప్పటికీ దర్శనమిస్తుంటాయి.*
----------------------------------------
*వర్షకాలంలో పాములు పుట్టల్లో నుంచి బయటకు వచ్చి సంచరిస్తాయి. అందుకే శ్రావణ మాసంలో సైతం ‘నాగ పంచమి’*  *పేరుతో పండుగ చేసుకుంటారు. పుట్ట వల్ల భూమిలో తేమ పెరుగుతుంది. పంటలకు ఇది ఎంతో అవసరం. పంటలకు మూలం పాములే కాబట్టి , రైతులు వాటిని దేవతలుగా భావిస్తుంటారు. పంటలు ఏపుగా పెరిగే కాలంలో ‘కార్తీక శుద్ధ చవితి’నాడు మనం ‘నాగుల చవితి’ని పర్వదినంగా ఆచరిస్తున్నాం.*
--------------------------------------
*పాములకు ప్రాణదానం చేసిన ఆస్తీకుడి కథ భారతంలో ఉంది. ఇతడు జరత్కారువు అనే నాగజాతి స్త్రీకి జన్మిస్తాడు. జనకుడి పేరు జరత్కారుడు. చిన్నతనంలోనే సకల విద్యలూ నేర్చుకున్న ఆస్తీకుడు గొప్ప జ్ఞాని అవుతాడు !*
-------------------------------------
*పరీక్షిత్తు పాముకాటు వల్ల మరణిస్తాడు. ఇందుకు ఆగ్రహించిన అతడి పుత్రుడు జనమేజయుడు సర్వ సర్ప జాతీ నాశనం కావాలని సర్పయాగం ప్రారంభిస్తాడు. ఎక్కడెక్కడి నుంచో పాములు వచ్చి యాగాగ్నిలో పడి మాడిపోతాయి. మిగిలిన సర్పాలు తమను రక్షించాలని జరత్కారువును ప్రార్థిస్తాయి.  రాజును ఒప్పించి సర్పయాగం ఆపించాలని ఆమె తన కుమారుడు ఆస్తీకుణ్ని కోరుతుంది. అతడు జనమేజయుడి వద్దకు వెళ్తాడు. అతడి  విద్యానైపుణ్యాన్ని చూసిన జనమేజయుడు సత్కరించడానికి సిద్ధపడతాడు.*
----------------------------------------
*‘సర్ప హింస మంచిది కాదు. నీవు ఈ యాగం మాని , వాటిని రక్షిస్తే చాలు. అదే నాకు పెద్ద సత్కారం’* *అంటాడు ఆస్తీకుడు. జనమేజయుడు అందుకు అంగీకరించి , సర్పయాగాన్ని విరమిస్తాడు. నాగుల చవితినాడు ఈ కథ వింటే , నాగ దోషాల నుంచి విముక్తి కలుగుతుందని పలువురి నమ్మకం.*
---------------------------------------
*పంట పొలాలకు శత్రువులు ఎలుకలు , వాటిని నిర్మూలించేవి పాములు. అవి క్రమంగా కనుమరుగైతే , మానవాళి మనుగడకే ప్రమాదం. నాడు ఆస్తీకుడు వంటి విజ్ఞాని ప్రబోధం వల్ల జనమేజయుడు ప్రభావితుడయ్యాడు. అదే ఉద్బోధతో మన కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంది నాగుల చవితి పండుగ ! ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివునికి వాసుకిగా , విష్ణువుకు ఆది శేషుడుగా తోడు ఉంటాడు కాబట్టి ఈ చవితి రోజు విశ్వాసం గల భక్తుల పూజ నైవేద్యాలను సమర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం.*
----------------------------------------
*ఆధ్యాత్మిక యోగా పరంగా :-ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను'* *వెన్నుపాము'అని అంటారు. అందులో కుండలినీశక్తి మూలాధారచక్రంలో* *"పాము"ఆకారమువలెనే వుంటుందని* *"యోగశాస్త్రం"చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ ! కామ , క్రోధ , లోభ , మోహ , మద , మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ  మానవునిలో 'సత్వగుణ'* *సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు'* *నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది , అందరి హృదయాలలో నివసించే ' శ్రీమహావిష్ణువు"నకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ! ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుటలోగల అంతర్యమని కొంత మంది పెద్దల మాటల ద్వార తెలుస్తుంది.*
--------------------------------------
*నాగులకు పాలు పోయడంలోని అంతరార్థం*
---------------------------------------
*పాలు స్వచ్ఛతకు ప్రతీక. ఈ పాలను వేడి చేసి చల్లపరచి దానికి కొద్దిగా చల్లను చేరిస్తే పెరుగవుతుంది. ఆ పెరుగును చిలుకగా వచ్చిన చల్లలో నుంచి వచ్చే వెన్నను కాయగా నెయ్యి అవుతుంది. దీనిని మనం యజ్ఞంలో హవిస్సుగా ఉపయోగిస్తాం. అలాగే మన బ్రతుకనే పాలను జ్ఞానమనే వేడితో కాచి వివేకమనే చల్ల కలిపితే సుఖమనే పెరుగు తయారవుతుంది. ఈ పెరుగును ఔదార్యమనే కవ్వంతో చిలుకగా శాంతి అనే చల్ల లభిస్తుంది. ఆ చల్లను సత్యం , శివం , సుందరం అనే మూడు వేళ్ళతో కాస్త వంచి తీస్తే సమాజ సహకారం అనే వెన్న బయటకు వస్తుంది.  ఆ వెన్నకు భగవంతుని ఆరాధన అనే జ్ఞానాన్ని జోడిస్తే త్యాగము , యోగము , భోగమనే మూడు రకముల నెయ్యి ఆవిర్భవిస్తుంది. ఇదే సకల వేదాలసారం , సకల జీవనసారం అయిన పాలను జీవనమునకు ప్రతీక అయిన నాగులకు అర్పించడంలోని అంతరార్థం.*
----------------------------------------
*”దేవా: చక్షుషా భుంజానా: భక్తాన్‌ పాలయంతి”అనేది ప్రమాణ వాక్యం , అనగా దేవతలు ప్రసాదాన్ని చూపులతోనే ఆరగిస్తారని అర్థం. పాములు పాలు తాగవనే అపోహతో పాలు పోయడం మానకుండా కొద్దిగా పాలను పుట్టలో పోసి మిగిలిన పాలను నైవేద్యంగా స్వీకరించాలి.*
----------------------------------------
*నాగుల చవితి మంత్రం*
*పాములకు చేసే ఏదైనా పూజ , నైవేద్యం నాగదేవతలకు చేరుతుందని నమ్ముతారు. అందువల్ల ఈ రోజు ప్రజలు పాములను ఆరాధిస్తారు. అనేక సర్పదేవతలు ఉన్నప్పటికీ 12 మందిని మాత్రం నాగులు చవితి పూజా సమయంలో కొలుస్తారు. అంతేకాకుండా పాముకు పాలను సమర్పిస్తుంటారు. చవితి నాడు సర్పాలను పూజిస్తే కుజ దోషం , కాలసర్ప దోషానికి ఆదిదేవుడు సుభ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలుగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి.*
*అనంత*
*వాసుకి*
*శేష*
*పద్మ*
*కంబాల*
*కర్కోటకం*
*ఆశ్వతార*
*ధృతరాష్ట్ర*
*శంఖపాల*
*కలియా*
*తక్షక*
*పింగళ*
*ఈ ప్రపంంచంలో పాములు, ఆకాశం , స్వర్గం , సూర్యకిరణాలు , సరస్సులు , బావులు చెరువులు నివసిస్తున్నాయి. ఈ రోజు ఈ సర్పాలను పూజించి ఆశీర్వాదాలు పొందుతారు.*
---------------------------------------
*పాము పుట్టలో  పాలు పోసేటప్పుడు  ఇలా చేప్పాలి మరియు పిల్లలు చేత చెప్పించాలి .*
-------------------------------------
*నడుము తొక్కితే నావాడు అనుకో* 
*పడగ తొక్కితే పగవాడు కాదు అనుకో* 
*తోక తొక్కితే తోటి వాడు అనుకో* 
*నా కంట నువ్వుపడకు నీకంట నేను పడకుండా చూడు తండ్రీ అని చెప్పాలి.* 
----------------------------------------
*ప్రకృతిని పూజిచటం  మన భారతీయుల  సంస్కృతి.  మనం విషసర్పమును కూడా పూజించి మన శత్రువును కూడా ఆదరిస్తాము. అని అర్ధము.  పిల్లల చేత ఇవి చెప్పించటం ఎందుకంటే వారికి మంచి అలవాట్లు నేర్పించటము ముఖ్యవుద్దేశము.*
----------------------------------------
*మనలను ఇబ్బంది పెట్టినవారిని , కష్టపెట్టేవారిని క్షమించాలి అని తెలుపుట ఇలాంటివి నేర్పుట ఉద్దేశము. నాగుల చవితిరోజు పుట్టలో పాలుపోసిన తరువాత.  బియ్యం , రవ్వ లేదా పిండిని చుట్టూ జల్లుతారు ఎందుకంటే మన చుట్టూ వుండే చిన్న చిన్న జీవులకు ఆహారంను పెట్టటం అన్నమాట.  ఉదాహరణకు చీమలకు ఆహారంగా పెడుతున్నాం.  పుట్ట నుండి మట్టి తీసుకొని ఆ మన్నును చేవులకు పెడతారు.  ఎందుకంటే చెవికి సంభందించిన ఇబ్బందులు రాకూడదని.*                                ----------------------------------------