*భగవంతుని చేరడానికి కావలసింది నిష్కల్మషమైన భక్తే గానీ ఇంకేమీ అవసరం లేదని వీరి కథలు నిరూపిస్తాయి..*.
*తిరు నిన్ద్రసీర్ నెడుమార నాయనార్*
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
తిరు అలవై (మధురై) నగరాన్ని కున్ పాండియన్ అనే రాజు పరిపాలించే వాడు. అతడి ధర్మపత్ని మనగాయక్కర సియార్. ఆమెకు శివుడంటే మహా భక్తి. పాండియన్ మాత్రం జైన మత ప్రవచనాలు తత్వాలు విని ఆకర్షితుడై జైన మతాన్ని స్వీకరించాడు.
తాను జైన మతాన్ని అనుసరిస్తున్నందు వల్ల ప్రజలంతా తప్పక అదే అనుసరించాలని శివుడికి ఏ విధమైన పూజలు నిర్వహించ రాదని శాసనం చేసి దానిని గట్టిగా అమలు పరిచాడు.
రాణి తన లాగే శివ భక్తుడైన మంత్రి కులచిరైయార్ సహాయంతో తిరుజ్ఞాన సంబంధార్ అనే శైవ మత ప్రచారకుడిని మధురైకు పిలిపించింది.
ఆయన సందేశాలతో శివ మహిమను వ్యాప్తి చేయించి ప్రజలలో శివుడి పట్ల భక్తిని పెంపొందింప చేయడం ద్వారా తన భర్త చేస్తున్న శివాపరాదాన్ని కొంత మేరకయినా తగ్గించాలను కుంది.
సంబంధార్ మధురై ఊరి పొలిమేరలో విడిది చేసి, జైనుల నుండి వస్తున్న తీవ్ర ప్రతిఘటనల మధ్య తన శిష్య బృందంతో కలిసి, జనంలో శివుడి పట్ల భక్తి ఏర్పడేలా ప్రచారం నిర్వహించ సాగాడు.
ఇంతలో దైవ లీల వలన రాజు గారు కున్ పాండియన్ కి సుస్తీ చేసింది. ఆయనకు రాచపుండు లేచి తీవ్రమైన ఇబ్బంది పెట్టింది. ఆ బాధతో లేచి తిన్నగా నిలబడ లేని పరిస్తితి. రాజ వైద్యులు ఇస్తున్న మందులు గానీ, రాజ పురోహితులు చేస్తున్న పూజలు మంత్రాల వల్ల గానీ ఉపయోగం లేకుండా అయింది. మంచానికే అంకిత మయ్యాడు. రాణి గారు చాలా బాధపడింది. ఇది శివ దోష ఫలితమని గ్రహించి, సంబంధార్ ను తీసుకు రావలసిందిగా చెప్పింది.
సంబంధార్ రాజు పరిస్తితిని చూసి, అతడి రోగం తగ్గి పోవాలని ఆ దేవదేవుడైన పరమ శివుడిని అతి మధుర మైన గానంతో స్తుతించాడు. అందరూ చూస్తుండగానే అద్భుతం జరిగింది. రాజు కున్ పాండియన్ శరీరం మీద వున్న వ్రణములు మాయ మయ్యాయి. అతడు లేచి పూర్వం వలే నిటారుగ నిలబడి హుషారుగా కనిపించాడు.
మృత్యుకోరల నుండి తాను శివ భగవానుడి అనుగ్రహం వల్లనే రక్షింపబడ్డానని గ్రహించిన పాండియన్ గొప్ప శివ భక్తుడిగా మారిపోయాడు. తన జీవిత కాలం శైవ మత సిద్ధాంత వ్యాప్తికి పాటు పడ్డాడు. ఆయనకు తోడుగా భార్య మనగాయక్కరసియార్ సహకరించారు. చరమార్దంలో శివ సాయుజ్యం పొందారు.
*ఓం నమశ్శివాయ...*
*హర హర మహాదేవ శంభో శంకర*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment